Sunday, 19 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

హైస్కూల్ ప్లస్‌కు టీచర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్‌లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గత విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల పరీక్ష ఫలితాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందన లేదని విమర్శించారు. ఈ విద్యాసంవత్సరంలో అయినా సమయానికి ఉపాధ్యాయులను కేటాయించాలని డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజుపాలెం, కలువాయి, సూలూరుపేట, నార్త్ మోపూరు ప్రాంతాల్లో ఫిజిక్స్, బోటనీ, ఇంగ్లీష్, కామర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Featured

ప్రేరణాత్మక సూక్తి జార్జ్ బెర్నార్డ్ షా (నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత)

“మనకు జ్ఞానం వచ్చేది గతాన్ని గుర్తుచేసుకోవడం వల్ల కాదు, మన భవిష్యత్తుపై బాధ్యత తీసుకోవడం వల్లే వస్తుంది.” “We are made wise not by the recollection of our past, but by the responsibility for our future.”-George Bernard Shaw

ఖమ్మం

ఇంట్లో నుంచే జనగణన నమోదు.. తెలంగాణలో కొత్త విధానం

*📱సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానమిదే!* ▪️తెలంగాణ లో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ 26.4.2026 నుండి ప్రారంభమవుతుంది ప్రజలు se.census.gov.in పోర్టల్లో ఇంటిపెద్ద పేరు, మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం/ పట్టణం వివరాలివ్వండి. మ్యాప్లో ఇంటి లొకేషన్ గుర్తించి, అడిగిన ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ‘Final Submit’ చేయగానే Hతో మొదలయ్యే 11 అంకెల SE ID వస్తుంది. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది.

ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.

​గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ స్థానిక గన్నవరం బాయ్స్ హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రాంగణంలో మహిళా భద్రత, రక్షణ చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం సి.ఐ. మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వేధింపులను అరికట్టడంలో చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘దిశ’ యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి విద్యార్థిని మొబైల్‌లో ఈ యాప్ ఉండాలని, ఆపద సమయంలో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. ​వేధింపులకు గురైనప్పుడు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని, విద్యార్థులు తమ చుట్టుపక్కల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

అగ్నిప్రమాదంలో మృతి – బాధితులకు రిషితా రెడ్డి చొరవతో తక్షణ సాయం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని వెదుళ్ళ చెరువు గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన బండి వెంకటసుబ్బయ్య అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఆయన భార్య బండి రాణెమ్మ తెలుగుదేశం పార్టీ సభ్యురాలు కావడంతో, పార్టీ తరఫున అమలులో ఉన్న ప్రమాద బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది. ఈ సహాయాన్ని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆమె ప్రత్యేక కృషితో ఈ ఆర్థిక సహాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి, మేకల రమేష్, వెంకటాద్రి యాదవ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు.

తిరుపతి

శుక బ్రహ్మాశ్రమంలో 22 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు, మందుల పంపిణీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలోని స్థానిక శుక బ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలోని భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రిలో శుక్రవారం నేత్ర రోగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 22 మంది రోగులకు విజయవంతంగా కాటరాక్ట్ (కంటి శుక్లాల) శస్త్రచికిత్సలు పూర్తి చేసి, వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్, ప్రముఖ దంత వైద్యులు లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో శుక బ్రహ్మాశ్రమం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ అతిథుల చేతుల మీదుగా ఉచిత మందుల కిట్‌లను అందజేశారు. ఆసుపత్రి కోఆర్డినేటర్ వి. దొరస్వామి నేతృత్వంలో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆశ్రమ సేవా దృక్పథం పట్ల రోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతి

వేలంపాడు జడ్‌పీ హైస్కూల్‌లో SDRF మాక్ డ్రిల్ – విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) వేలంపాడు జడ్‌పీ హైస్కూల్‌లో 9వ బెటాలియన్ SDRF సిబ్బంది పాఠశాల భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 9వ బెటాలియన్ కమాండెంట్ ఈ.ఎస్. సాయి ప్రసాద్ మార్గదర్శకత్వంలో, అసిస్టెంట్ కమాండెంట్ బి. ఆనంద్ కన్నా పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎంఆర్‌ఓ సుబ్బారావు, వేలంపాడు వీఆర్‌ఓ సుబ్బరాజు హాజరయ్యారు. సమన్వయ బాధ్యతలను SDRF ఆర్‌ఐ డి. వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రాయోగికంగా వివరించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా రక్షణ చర్యలు, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), సురక్షితంగా బయటకు వెళ్లే విధానం (ఎవాక్యువేషన్)పై సిబ్బంది ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనగా, ప్రధానోపాధ్యాయురాలు రేణుకతో పాటు ఉపాధ్యాయులు SDRF బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అప్రమత్తత, భద్రతపై అవగాహన మరింత పెరిగిందని పేర్కొన్నారు.

తిరుపతి

వారపు సంతలో బొజ్జల బృందమ్మ సందడి – స్వచ్ఛత పాటించాలని విజ్ఞప్తి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి శుక్రవారం నిర్వహించే వారపు సంతను బొజ్జల బృందమ్మ సందర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడుతో కలిసి ఆమె సంత అంతటా కలియదిరుగుతూ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందలాది మంది ప్రజలు, వినియోగదారులు ఈ సంతకు వస్తుంటారని, వారి ఆరోగ్య దృష్ట్యా మార్కెట్ పరిసరాలను అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోనే వేయాలని వ్యాపారులకు సూచించారు. సంతకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులకు కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల విక్రయదారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మాట్లాడుతూ.. సంతలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

తిరుపతి

మిద్దెల కృష్ణయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సంతాపం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో పద్మశాలిపేటలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ మిద్దెల హరి తండ్రి మిద్దెల కృష్ణయ్య ఆకస్మిక మరణం పట్ల శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కృష్ణయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో అంజూరు తారక శ్రీనివాసులు, పగడాల రాజు, ఆర్.డి.ఓ. ముత్తు, శ్రీవారి సురేష్, కంటా ఉదయ్ కుమార్, పఠాన్ ఫరీద్, గోరా, వేలూరు రమేష్, ఆర్కాట్ శంకర్, అస్లాం, ఆరిఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

కైలసగిరి మునిసిపల్ పాఠశాలలో సరస్వతి పూజ, వార్షికోత్సవం ఘనంగా

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని కైలసగిరి కాలనీలో ఉన్న మునిసిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో సరస్వతి పూజతో పాటు వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రధానోపాధ్యాయులు వి. హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆశిక, నీలావతి, దిలీప్, లీలావతి, మోహన్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తరగతి ప్రథములు, హాజరు ప్రథములకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.