హైస్కూల్ ప్లస్కు టీచర్ల కొరత
జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గత విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల పరీక్ష ఫలితాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందన లేదని విమర్శించారు. ఈ విద్యాసంవత్సరంలో అయినా సమయానికి ఉపాధ్యాయులను కేటాయించాలని డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజుపాలెం, కలువాయి, సూలూరుపేట, నార్త్ మోపూరు ప్రాంతాల్లో ఫిజిక్స్, బోటనీ, ఇంగ్లీష్, కామర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.











