Sunday, 19 April 2026

Blog

తూర్పు గోదావరి

రాజమండ్రిలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం

శుక్రవారం క్వారీ మార్కెట్ సెంటర్ లో బిజెపి జిల్లా కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధమ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగింది. పార్టీ ఇటీవల తలపెట్టిన మండల ప్రశిక్షణ కార్యక్రమం, ప్రతి ఊరిలో బిజెపి జండా స్థూప నిర్మాణం వంటి కార్యక్రమాలపై సమాలోచన రాబోయే కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు, SIR లో పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు చేయాల్సిన పనులు పై దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. SIR రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియ లో పాల్గొని పూర్తి అప్రమత్తతతో ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియకు నియోజకవర్గాల వారీగా పార్టీ ఏజెంట్లుగా నియమించిన వారికి నియామక పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇంచార్జ్ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు,జిల్లా జనరల్ సెక్రటరీలు, ఎమ్మెస్ కే రాజు, మద్దిపాటి స్వర్ణ రజని, శెట్టిపల్లి శివ నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ , ఉన్ని కృష్ణ , జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలు అడుగుల శ్రీవిద్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు, మీడియా సెల్ కన్వీనర్ వీరా వీరాంజనేయులు, రవిశంకర్, ఆశిష్, కురగంటి సతీష్, ఆకుల శ్రీధర్, సూర్య కిరణ్, మోహిని, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన, బిజెపి మండల అధ్యక్ష & ప్రధాన కార్యదర్శులు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు, బిజెపి జిల్లా పదాధికారులు, జిల్లా కోర్ కమిటీ సభ్యులు, వివిధ అసెంబ్లీల BLA1 లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నవాబుపేటలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్… 23 వాహనాలు స్వాధీనం

నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీస్ ఆదేశాల మేరకు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్డీపీఓ శ్రీమతి దీక్ష, ఐపీస్ ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు పాల్గొని సుమారు 400 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10 మంది రౌడీ షీటర్లు, 10 మంది అనుమానితులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాల నియంత్రణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

E-పేపర్

ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు

ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 17 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 62,19,127 లలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహసిల్దార్ అయ్యప్పకు ఫిర్యాదు చేసిన బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్, ప్రజా ప్రతినిధులు

E-పేపర్

రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత… యాచారం మేడిపల్లిలో కాంగ్రెస్–బిఆర్ఎస్ నేతల అరెస్టు!

రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత… యాచారం మేడిపల్లిలో కాంగ్రెస్–బిఆర్ఎస్ నేతల అరెస్టు! పున్నమి న్యూస్ తెలంగాణ ఇంచార్జ్ 17 ఏప్రిల్ 2026 మేడిపల్లిలో రాజకీయ ఉద్రిక్తత శిఖరానికి… ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు! యాచారం మండలం మేడిపల్లిలో టెన్షన్… కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్‌కు తరలింపు! రంగారెడ్డి జిల్లాలో హై డ్రామా… మేడిపల్లిలో ఇరు పార్టీల నేతల అరెస్టులు! మేడిపల్లిలో హీట్ పెరిగింది… కాంగ్రెస్–బిఆర్ఎస్ నాయకుల అరెస్టు, పరిస్థితి ఉద్రిక్తం! రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో వైఎస్సార్సీపీ నేతలకు ఘన సన్మానం – రాష్ట్ర పదవులు దక్కిన సూరపునేని, ముంగరకు అభినందనలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 17 ( జి ఎం కే రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీగా సూరపునేని కిషోర్ నాయుడు, జాయింట్ సెక్రటరీగా ముంగర వెంకటరమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Featured

Second Phase Census Training Concluded

Marripadu: April (Punnami Representative) The three-day second phase training program for the population census, conducted at Nand avaram Adarsha School in Marripadu mandal, has been successfully completed. During this training, enumerators and supervisors were provided with comprehensive guidance by field trainers on data collection methods, usage of digital devices, and solutions to challenges encountered in field operations. Speaking at the concluding session, Mandal Tahsildar Anil Kumar advised the trained staff to work with dedication at the field level and ensure the successful implementation of the Population Census 2027 program. Field trainers Haranath, Kalishetty Rajendra Kumar, and A.S.O. Ram Kishore, along with others, participated in the program.

News

Good morning

Failed attempts also contribute to successes. The lessons learned in failed attempts keep polishing our skills that ultimately yield success.-rg punnami Telugu Daily hastags good morning motivation story

తూర్పు గోదావరి

ఆశిష్ లాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి ఆశిష్ లాల్ నియామకాన్ని పురస్కరించుకుని మండలంలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రాష్ట్ర కమిటీ జాబితాలో ఆశిష్ లాల్‌కు ఈ పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో తాళ్లపూడి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు, నీలం భద్రరావు, పేరూరు తాతారావు పాల్గొని ఆశిష్ లాల్‌కు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

కొవ్వూరులో కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు ఘన స్వాగతం

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /,కొవ్వూరు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గానికి విచ్చేసిన కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాపవరం జంక్షన్ వద్ద ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అక్కడి నుంచి కొవ్వూరు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆశిష్ లాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తాళ్లపూడి మండలం నుంచి నామా సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

తూర్పు గోదావరి

ఎండల తీవ్రతపై అప్రమత్తం: ప్రజలకుడాక్టర్ హారిక గుప్తా, డాక్టర్ చింత థెరిస్సా వైద్యుల సూచనలు

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 17: మండలంలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రక్కిలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హారిక గుప్తా, డాక్టర్ చింత థెరిస్సా సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వెళ్లాలని తెలిపారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ, ముఖానికి స్కార్ఫ్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ ధరించాలని సూచించారు. లేత రంగు, కాటన్ దుస్తులు ధరించడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుందని తెలిపారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, దాహం లేకపోయినా తరచూ నీరు తాగాలని చెప్పారు. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా శరీరంలో నీరు, ఉప్పు సమతుల్యత నిల్వ ఉంటుందని వివరించారు. వేసవిలో మద్యం, కాఫీ, టీ, అధిక చక్కెర ఉన్న పానీయాలు, అలాగే మసాలా, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. కీరదోస, పుచ్చకాయ వంటి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల వడదెబ్బ ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇళ్లలో కిటికీలకు పరదాలు వేసుకోవడం, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం, చల్లటి నీటితో స్నానం వంటి చర్యలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో తిరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలుగా తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు, అలసట, చర్మం పొడిబారడం, అధిక జ్వరం, అపస్మారక స్థితి వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుడిని వెంటనే చల్లటి ప్రదేశానికి మార్చి, చల్లటి నీరు చల్లడం, తడి గుడ్డతో తుడవడం, ఓఆర్‌ఎస్ లేదా మంచినీరు ఇవ్వాలని సూచించారు. పరిస్థితి విషమిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.