Monday, 20 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలు

జిల్లా పోలీసు కార్యాలయం ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రదేశాలలో మహిళలు, విద్యార్థినిలకు యాప్ డౌన్లోడ్ విధానం మరియు వినియోగంపై వివరాలు తెలియజేస్తున్నారు. అత్యవసర సమయంలో యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందిస్తారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధంపై అవగాహన కల్పిస్తూ, 100, 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు.

ఖమ్మం

పెరిగిన ఎండ తీవ్రత తట్టుకోలేని జనం

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించి, టోపీ లేదా గొడుగు ఉపయోగించాలి. సూర్యరశ్మి నుంచి రక్షణకు సన్‌స్క్రీన్ వాడాలి. తలనొప్పి, వాంతులు, అలసట వంటి హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని వైద్యులను సంప్రదించాలి. మజ్జిగ, లస్సీ వంటి పానీయాలు కూడా ఉపయోగకరమని నిపుణులు తెలిపారు.

రంగారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న మొండివైఖరి విడనాడాలి.. రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింలు డిమాండ్* *పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 17/04/2026* *రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పట్ల వ్యవహరిస్తున్న మొండివైఖరి విడనాడి వెంటనే దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి వినతి పత్రాన్ని రికాగ్నైజ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో, రాష్ట్ర బాధ్యులు, రంగారెడ్డి జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా బాధ్యులు వెంకటస్వామి, జిల్లా బాధ్యుల సమక్షంలో వినతి పత్రాన్ని అందించడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 30 నెలలుగా పిఆర్సి పెండింగ్లో ఉన్నదని ఉద్యోగ పెన్షనర్లకు మెరుగైన వైద్యం వైద్య చికిత్సల కోసం వైద్య సేవలు సూచించే హెల్త్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలని రాష్ట్రంలో 50వేల మంది టెట్ మినహాయింపు లేదా టెట్ పరీక్ష విధానంలో మార్పులు అర్హత మార్కులు తగ్గించడం వంటి విషయాలను శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, ఇంకా ఈ కార్యక్రమంలో టిటిజెఏసి పక్షాన అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు*

రంగారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి* *పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 17/04/2026* *రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు పెన్షనర్లు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్లు 30 నెలలుగా పిఆర్సి పెండింగ్ ,పెన్షనర్లు వారి న్యాయమైన వారికి రావలసిన సర్వీసు ఆర్థికపరమైన బెనిఫిట్స్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వాళ్లకి వైద్య సేవలు అలాగే రాష్ట్రంలో దాదాపుగా 50వేల మందితో ముడిపడి ఉన్న టెట్ నుంచి మినహాయింపు ఇలా దాదాపుగా 60 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి గత వారం అన్ని సంఘాల నాయకత్వం తీర్మానం మేరకు ఈరోజు వారి వారి పనిచేస్తున్న పాఠశాలల్లో ఇక రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి అమీర్ పాషా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దతూపుర శంషాబాద్ మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి ,వెంకట్రామిరెడ్డి, ఉమాదేవి ,విట్టల్నాయక్, ఉమారాణి, సరోజ తదితరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు లేనిపక్షంలో దశల వారి ఆందోళన కొనసాగిస్తామని వారు తెలియజేశారు*

E-పేపర్

కొత్తపల్లి గ్రామంలోని UGD డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలి..

కొత్తపల్లి గ్రామంలోని UGD డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలి… కొత్తపల్లి గ్రామంలో గత నెల మెన్ రోడ్డు UGD పనులు ప్రారంభించడం జరిగింది కాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని వార్డు సభ్యులు తెలిపారు.పనులు ఆలస్యం కారణంగా రాకపోకలకు ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నం ఆమనగల్ వెల్లే బస్సు,రాత్రి దొడ్లపాడు వెల్లే బస్సు రాకపోవడం వల్ల తండా వాసులు,గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు,రైతులు పొలాలకి వెళ్లిరవడానికి,అత్యవసర సేవలు అందక,వెళ్లడానికి గ్రామం నుండి మరొక్క పెద్ద రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుందని,ఇండ్ల ముందు పోవడానికి కూడా వీలు లేకుండా నెలల తరబడి గుంతలు తీసి పెట్టారు,పెద్దవాళ్లు,చిన్న పిల్లలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉందన్నారు.ఇంజనీర్ ఏఈ కూడా పరిస్థితులను గమనించి కాంటాక్ట్ తో మాట్లాడి ఈవారంలో డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలని వారితో మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాలే.అనిత,వార్డు సభ్యులు వంగ.సంజీవ రెడ్డి,కంబాలపల్లి. కుమార్,మహేశ్వరం.వినోద, పోలే.శివ కుమార్, అరవింద్ గ్రామస్థులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చాటిన విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరిజిల్లా గోకవరంలోని విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ ఒలింపియాడ్ పరీక్షల్లో విశేష విజయాలు సాధించారు. గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, జీకే వంటి విభాగాల్లో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని, గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పతకాలను అందుకున్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, పతకాలతో పాటు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా విద్యార్థి పవన్ సాయి తన అద్భుత ప్రతిభతో రూ.2,500 నగదు బహుమతిని అందుకోవడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు కూడా “లిటిల్ స్టార్స్ ఒలింపియాడ్” పరీక్షల్లో పాల్గొని గణితం, ఇంగ్లీష్, సైన్స్, జీకే విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను సాధించారు. వీరికి పతకాలతో పాటు సర్టిఫికెట్లు, గిఫ్ట్‌లు, ఇతర బహుమతులు కూడా ప్రదానం చేయబడ్డాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విజేతలకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. END

తూర్పు గోదావరి

స్వయంగా జనగణన-2027లో వివరాలు నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మంత్రి దుర్గేష్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమహేంద్రవరందేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన-2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. గురువారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేశారు. నమోదు అనంతరం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియ విజయవంతంగా పూర్తయినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన వసతులు, సేవలు అందించేందుకు జనగణన ముఖ్య దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల ఖచ్చితమైన సంఖ్య తెలిసినప్పుడే ప్రభుత్వం సమర్థవంతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించగలదని వివరించారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. “నేను జనగణనలో పాల్గొని నా వివరాలు నమోదు చేసుకున్నాను… మీరు కూడా ముందుకు వచ్చి పాల్గొనండి” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలు నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రణాళికలు సిద్ధం కావడానికి సహకరించాలని ఆయన ఆకాంక్షించారు. END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“సర్వేపల్లిలో అంగన్వాడీలకు సిఎస్‌ఆర్ వరం – చిన్నారుల అభివృద్ధికి పరికరాల పంపిణీ”

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 17 ( జి ఎం కె రావ్ పున్నమి ప్రతినిధి).సర్వేపల్లినియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ నిధులతో అవసరమైన పరికరాలు అందజేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మనుబోలు, వెంకటచలం, పొదలకూరులోని 69 కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు గ్యాస్ స్టవ్‌లు, స్లీపింగ్ మ్యాట్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లు, టీవీలు పంపిణీ చేశారు. పోషణ్ పక్వాడ కార్యక్రమం ద్వారా పిల్లల పోషకాహారం, మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – కొవ్వూరులో గ్రీవెన్స్ కార్యక్రమం

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 17: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించే దిశగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం కొవ్వూరులో జరిగింది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 22 వినతి పత్రాలను అందజేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డ్రెయినేజ్ సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా వినిపించాయి. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కేడర్ సమావేశం నిర్వహించబడింది. ఇందులో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, టీవీ రామరావు, దాయన రామకృష్ణ, బేతిన నారాయణ, కాకర్ల నారాయుడు, కళాధర్ చక్రవర్తి, సుంకర సత్తిబాబు, వేమగిరి వెంకట్రావు తదితర NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం పున్నమి న్యూస్ ప్రతినిధి 17 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి : *మాల్ రెడ్డి రంగారెడ్డి ది నరం లేని నాలుక.. ఏ రోజు ఎది మాట్లాడతాడో ఆయనకే తెలియదు… బహిరంగ చర్చలకు వచ్చే దమ్ము మాల్ రెడ్డి రంగారెడ్డి కి లేదు -బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి ఫార్మాసిటీ భూముల విషయంలో మేడిపల్లి గ్రామంలో రైతులముందు నిజ నిర్ధారణ చర్చకు రావాలని ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి . చర్చకు రాకుండా తోక ముడిచిన ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి చర్చను అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మరియు భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఇంచార్జి శ్రీ క్యామా మల్లేష్ తో పాటు కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.