Thursday, 9 July 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 8 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కోదండరామాపురం జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

గోపాలపురం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు: పేదల గుండెల్లో నిలిచిన మహోన్నత నేత వైఎస్ఆర్!​

గోపాలపురం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు: పేదల గుండెల్లో నిలిచిన మహోన్నత నేత వైఎస్ఆర్!​గోపాలపురం నియోజకవర్గం:తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి, కేకులు కట్ చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు చోట్ల మాజీ హోంమంత్రి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి క్రమశిక్షణ కమిటీ మెంబర్ మరియు వైఎస్ఆర్సిపి గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ అయిన తానేటి వనితమ్మ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.​ఈ వేడుకల కొనసాగింపుగా రాజంపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు కురుకూరి నాగేశ్వరరావు గారు మరియు కురుకూరి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాజంపాలెంలో కేక్ కట్ చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు కురుకూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, కోట్లాది మంది పేదల గుండె చప్పుడు అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో ఆయన చిరునవ్వులు పూయించారని గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలోనే నేటి తరం నాయకత్వం కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, వైఎస్ఆర్ అందించిన మహోన్నత పాలన తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన ప్రసంగించారు.​ఈ ఘనమైన కార్యక్రమంలో కురుకూరి నాగేశ్వరరావు, కురుకూరి ధనలక్ష్మి, గంగాధరుని సత్యనారాయణ, గంగుల వెంకటరావు, నీలపాల సత్యనారాయణ, షేక్ ఇబ్రహీం, గుండారపు శ్రీను, ఏలూరి వెంకటేశు, బైపో కిరణ్ కుమార్, ఆడ్రు రామారావు, బంగారు రాజు, కాసాని శ్రీను, గాలింకి సుబ్బారావు, పోలేపల్లి కృష్ణ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కాకినాడ

గాడిమొగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ ర్యాలీ

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం గాడిమొగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం,డెంగ్యూ నివారిద్దాం అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పి ప్రకాష్,ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్యామల, డాక్టర్ రత్నకుమార్ మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బి ఎల్ జి కుమార్,రంజన్,నాగమణి,బిఎల్ శ్రీను,అభినవ, గోవిందు, మోహన, ఆదినారాయణ, కే ఆంజనేయులు, కేన్ ప్రసాదు, సిహెచ్ బాలకృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

బాలల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాల్యవివాహాలు జరక్కుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు మరియు మందాల గంగా సూర్యనారాయణ సూచించారు.బాలల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రెవిన్యూ డివిజనల్ కార్యాలయం సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణపై మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం, కార్మిక శాఖ, విద్యా శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, ట్రాన్స్ పోర్ట్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మరియు డి ఆర్ డి ఏ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఇ.శ్రీనివాసరావు, బాలల సంక్షేమ సమితి, ఛైర్పర్సన్ ఎమ్.ఆర్.ఎల్.రాధ,జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని ఎన్.సూర్య లక్ష్మీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎమ్.రమేష్ , తదితరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి శాఖ అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, పోక్సో కేసుల దర్యాప్తు, బాధితుల పునరావాసం, బాలల అక్రమ రవాణా నివారణ, కౌమార దశలో గర్భాలు, గంజాయి కేసులు, పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యలో చేర్చడం వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, బాధిత పిల్లలకు అందించిన పరిహారం, పునరావాస చర్యలు, జనన ధ్రువీకరణ పత్రాల జారీ, వివిధ శాఖల సమన్వయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన వసతి, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం, నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణలో ఏ శాఖ నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమని, జిల్లా స్థాయిలో గుర్తించిన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో పాటు తగిన సిఫారసులు సమర్పిస్తామని తెలిపారు.కమిషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీ బాబు మరియు మందాల గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా స్థాయి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించి బాలల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బాలుడి సంక్షేమం, భద్రత రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. జిల్లాలో గల స్వచ్ఛంద సంస్థల పరిధిలో గల బాలల సంరక్షణ కేంద్రాల అధికారులతో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం అయి పిల్లల బాగోగులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కశింకోటలో గల బాలసధనాన్ని మరియు సుందరయ్య పేటలో గల దయ చైల్డ్ కేర్ హోమ్ అనే స్వచ్ఛంద సంస్థ ను కూడా కమిషన్ సభ్యులు సందర్శించారు . సమావేశానంతరం బాల్య వివాహాల చట్టవిరుద్ధం పోస్టర్, దత్తత,24 గంటల ఉచిత నెంబర్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, టీనేజ్ ప్రెగ్నెన్సీ గోడపత్రికలను ఆవిష్కరించారు.

రాజన్న సిరిసిల్ల

యూరియా కొరతపై రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: మెంగని మనోహర్

రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి 07/07/2026 ముస్తాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ అన్నారు. ఒక యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందని, రైతుల ఉసురు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోమని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, యూరియా, దుక్కిమందు సరఫరా, వడ్ల కొనుగోలు, రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేవని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన మేర యూరియా, దుక్కిమందు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మెట రాజు, శీలం వెంకటేష్, జహంగీర్, తుమ్మలపల్లి శేఖర్, వల్లెపు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సాహితీ

ఉదయం 5 గంటలు మీ జీవితంలో అత్యంత విలువైన సమయం

ఉదయం 5 గంటలు కేవలం గడియారంలో కనిపించే సమయం మాత్రమే కాదు; అది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే బంగారు అవకాశం. ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారు తమ జీవితాన్ని మరింత క్రమబద్ధంగా, ఉత్పాదకంగా, విజయవంతంగా మార్చుకోగలరు. ఈ ఒక గంటలో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా మారుతుంది. ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది. రోజు లక్ష్యాలను రాసుకుంటే పనిలో స్పష్టత వస్తుంది. ఈ నాలుగు అలవాట్లు కలిసి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. చాలామంది రోజు ప్రారంభమైన తర్వాత సమయాన్ని వెంబడిస్తారు. కానీ ఉదయం 5 గంటలకు లేచే వారు సమయాన్ని నియంత్రిస్తారు. అందుకే వారు ఒత్తిడిని తగ్గించుకుని, మంచి నిర్ణయాలు తీసుకుని, ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేయగలుగుతారు. ఈ అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం మీరు మీకు ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవడం ద్వారా మీపై మీకున్న నమ్మకం మరింత బలపడుతుంది. అయితే, ఉదయం 5 గంటలకు లేవడం మాత్రమే విజయానికి హామీ కాదు. తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యమైనది. రాత్రి సరైన సమయంలో నిద్రపోయి, శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇచ్చిన తర్వాతే ఈ అలవాటు నిజమైన ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర, క్రమబద్ధమైన దినచర్య, స్పష్టమైన లక్ష్యాలు—ఈ మూడు కలిసి 5 AM అలవాటును శక్తివంతమైన విజయ సూత్రంగా మారుస్తాయి. ప్రతి ఉదయం మీకు ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులను సరిదిద్దుకోవడానికి, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి, మీ కలల వైపు మరో అడుగు వేయడానికి ఇది సరైన సమయం. ఉదయం 5 గంటలు మీ జీవితంలో అత్యంత విలువైన సమయం, ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రపంచాన్ని మార్చలేకపోయినా, మీ జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా మార్చగలరు.

సాహితీ

ఉదయం 5 గంటలు మీ జీవితంలో అత్యంత విలువైన సమయం

ఉదయం 5 గంటలు కేవలం గడియారంలో కనిపించే సమయం మాత్రమే కాదు; అది మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే బంగారు అవకాశం. ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారు తమ జీవితాన్ని మరింత క్రమబద్ధంగా, ఉత్పాదకంగా, విజయవంతంగా మార్చుకోగలరు. ఈ ఒక గంటలో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా మారుతుంది. ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది. రోజు లక్ష్యాలను రాసుకుంటే పనిలో స్పష్టత వస్తుంది. ఈ నాలుగు అలవాట్లు కలిసి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. చాలామంది రోజు ప్రారంభమైన తర్వాత సమయాన్ని వెంబడిస్తారు. కానీ ఉదయం 5 గంటలకు లేచే వారు సమయాన్ని నియంత్రిస్తారు. అందుకే వారు ఒత్తిడిని తగ్గించుకుని, మంచి నిర్ణయాలు తీసుకుని, ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేయగలుగుతారు. ఈ అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం మీరు మీకు ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవడం ద్వారా మీపై మీకున్న నమ్మకం మరింత బలపడుతుంది. అయితే, ఉదయం 5 గంటలకు లేవడం మాత్రమే విజయానికి హామీ కాదు. తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యమైనది. రాత్రి సరైన సమయంలో నిద్రపోయి, శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇచ్చిన తర్వాతే ఈ అలవాటు నిజమైన ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర, క్రమబద్ధమైన దినచర్య, స్పష్టమైన లక్ష్యాలు—ఈ మూడు కలిసి 5 AM అలవాటును శక్తివంతమైన విజయ సూత్రంగా మారుస్తాయి. ప్రతి ఉదయం మీకు ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులను సరిదిద్దుకోవడానికి, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి, మీ కలల వైపు మరో అడుగు వేయడానికి ఇది సరైన సమయం. ఉదయం 5 గంటలు మీ జీవితంలో అత్యంత విలువైన సమయం, ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రపంచాన్ని మార్చలేకపోయినా, మీ జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా మార్చగలరు.

తూర్పు గోదావరి

బలభద్రపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పుగోదావరి జిల్లా  బిక్కవోలు, జూలై 8: అనపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల (ఇరిగేషన్) శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రూడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంగళవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రామవరంలో డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్లపై అవగాహన, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, జూలై 7: అనపర్తి మండలం రామవరంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనంతరం అనపర్తి, బిక్కవోలు మండలాల భారతీయ జనతా పార్టీ BLA-2లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ శిక్షణ సర్టిఫికెట్ల ఉపయోగాలు, వాటి ద్వారా యువతకు కలిగే అవకాశాలపై ఎమ్మెల్యే వివరించారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి, బిక్కవోలు మండలాల బీజేపీ నాయకులు, BLA-2లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రామవరంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, జూలై 6: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాదం కోసం చేసిన సేవలను ఎమ్మెల్యే నల్లమిల్లి కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, బిక్కవోలు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.