Thursday, 14 May 2026

Blog

తిరుపతి

త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి విశేష పూజలు

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల పూజలు బుధవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోష వేళలో ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారితో పాటు నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, విభూతి, పన్నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో షోడశోపచార పూజలు నిర్వహించి స్వామివారిని బిల్వపత్రాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అలాగే నందీశ్వరుడికి విశేష అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుపతి

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై ఎంవీఐ తనిఖీలు

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ది స్కూల్‌కు చెందిన బస్సులను గురువారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. దామోదర నాయుడు తనిఖీ చేశారు. రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సుల ఫిట్‌నెస్, కండీషన్‌తో పాటు సంబంధిత పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్కూల్ యాజమాన్యానికి సూచించిన ఆయన, బస్సుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. అలాగే విద్యార్థులతో ప్రయాణించే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వేసవి సెలవుల సమయంలోనే బస్సులకు అవసరమైన మరమ్మతులు, సాంకేతిక తనిఖీలు పూర్తి చేసి కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధం చేయాలని ఎంవీఐ సూచించారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

గుమ్మడి వెంకటయ్య మృతికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నివాళి

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి బాలకృష్ణయ్య సోదరుడు గుమ్మడి వెంకటయ్య ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి విషయమై సమాచారం అందుకున్న వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శనివారం వెంకటయ్య పార్థివ దేహాన్ని సందర్శించారు. వెంకటయ్య భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీవారి సురేష్, కుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు.

తిరుపతి

జనసేన ఆధ్వర్యంలో 81వ వారం అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 81వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రయాణికులకు ఉచిత భోజన వసతి కల్పించి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, డాక్టర్ నక్కా ప్రసాద్, దినేష్, లక్ష్మణ్, కల్లిపూడి వెంకటేష్, నవీన్, మహర్షి రెడ్డి, ముని చంద్ర, చందు, సాయి, వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, శకుంతలమ్మతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

ప్రవేశ పరీక్షల్లో విద్యార్థి దక్షిత్ ప్రతిభ

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎస్‌ఎస్‌ఆర్ అకాడమీకి చెందిన విద్యార్థి ఆకుల దక్షిత్ వివిధ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వరుస విజయాలు సాధించాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏపీ పాలిసెట్-2026లో 102 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 2150వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఏపీఆర్‌జేసీ ఇంటర్ ప్రవేశ పరీక్షలో 112 మార్కులతో రాష్ట్రస్థాయిలో 755వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. అదేవిధంగా నవోదయ విద్యాలయ 11వ తరగతి ప్రవేశ పరీక్షలో 53 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 13వ స్థానం పొందాడు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో కూడా 562 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థి దక్షిత్‌తో పాటు అతని తల్లిదండ్రులు ఆకుల దినేష్, ఆకుల హిమబిందులను అకాడమీ అధ్యాపకులు జి. మంజునాథ్, కృష్ణశ్రీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

తిరుపతి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం శ్రీకాళహస్తిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా గ్రీవెన్స్’ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. వ్యక్తిగత, గ్రామీణ సమస్యలకు సంబంధించిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పింఛన్లు, తాగునీటి సమస్యలు, భూ వివాదాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన వినతులను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్

డెహ్రాడూన్‌లో యమ్ .పి బీదమస్తాన్ రావు యాదవ్

ఓబీసీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు డెహ్రాడూన్ చేరుకున్న రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారికి ఘన స్వాగతం రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు ఓబీసీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత కమిటీ అధికారులు మరియు స్థానిక ప్రతినిధులు సంప్రదాయ సాంస్కృతిక పద్ధతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్తరాఖండ్ సాంప్రదాయ కళారూపాలు, వాయిద్యాలతో కూడిన ఆత్మీయ స్వాగత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమిటీ సభ్యులు మరియు అధికారులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సమావేశంలో ఓబీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం ఉపయోగకరంగా నిలుస్తుందని శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు పేర్కొన్నారు. –

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బాబు రాకతో తీరం బ్యాలెన్స్ అయ్యేనా.. బిఎంఆర్ హాజరుపై ఆసక్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుమ్మలపెంట పర్యటన ఖరారు కావడంతో తీర ప్రాంతంలో మరల కొత్త ఆలోచనల తాకిడి ఎక్కువైంది. మత్స్యకారులకు క్రాప్ హాలిడే ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మలపెంటలో 19వ తేదీన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది విశేషమే. రెండు నెలల క్రితం జరిగిన బోట్ల అపహరణ సంఘటన ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న తరుణంలో ఏరి కోరి చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేక విశేషంగా మారింది. పడవల విషయంలో నష్టపరిహారం నిర్ణయిస్తూ పంచాయతీ అయినా, బాధ్యులను పట్టుకోవడంలో పడవలను తెప్పించడంలో అధికారులు చొరవ తీసుకోలేదనే ఆవేదన మత్స్యకారులలో కొనసాగుతోంది. మత్స్యకార గ్రామాలతో మమేకమైన మస్తాన్రావుకు ఊహించని విధంగా ఈ సంఘటన ఇబ్బంది పెట్టినా,ఆయన ఎన్నో విధాలుగా తన విజ్ఞప్తులను మత్స్యకార ప్రతినిధులకు మత్స్యకారులకు తెలుపుతూ వస్తున్న క్రమంలో పడవల సంఘటన క్రమంగా మరుపుకు గురి అవుతోంది. అదేవిధంగా మత్స్యకార సంక్షేమాన్ని కాంక్షిస్తూ జిల్లాకు మంత్రి రవీంద్రను పలుమార్లు రప్పించి తమిళ జాలర్ల నుంచి రక్షించే విధంగా తీసుకుంటున్న చర్యలను జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర విస్తృతంగా తెలపడంతో మత్యకారులలో కూడా కొంత ఆగ్రాహావేషాలు చల్లబడ్డాయి. అయితే ఈ సంఘటనపై జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నెలో సభ ఏర్పాటు చేసి వెళ్లిన అనంతరం పరిణామాలు తెలుగుదేశం వర్గాలు అధ్యయనం చేశాయా లేదా అన్నది అంతుచిక్కడం లేదు. అంతర్గతంగా మత్స్యకారులలో పడవల విషయం అంతర్లీనంగా రగులుతోందన్నది బహిరంగ సత్యమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు మేలు అన్నది పార్టీ వర్గాలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం ప్రస్తుతం కొత్తది ఏమీ కాదు సాధారణంగా వారికి ఇస్తూ వస్తున్నదే. దీనికోసం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మళ్ళీ మత్స్యకారులలో లేనిపోని అలజడి కలిగించినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది. రాజకీయాలకతీతంగా పడవల తరలింపు విషయంలో పోరాడుతామని మత్స్యకారుల కాపులు నిర్ణయించినా జగన్ సభకు భారీగానే తరలివచ్చారు. దురాయి ప్రచారం చేసినా, మత్స్య కారులు ‌హాజరుకారని ప్రకటనలు గుప్పించినా,. తీరంలో స్పందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సభకు కూడా మత్స్యకారులు అదే స్థాయిలో హాజరు కాకుండా పోయే ప్రశ్న లేకపోయినా సభలో పడవల తరలింపు విషయం బాధ్యులపై చర్యల విషయం అలజడి రేపుతోందనేది నిఘా వర్గాలు కూడా పసి కట్టాయా లేదా అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలతో పోలిస్తే మత్స్యకారుల ది విభిన్న శైలి కావడమే కారణం. పోతే బాబు సభకి కావలి ప్రాంతనేతగా రాజ్యసభ సభ్యుడు మస్తాన్రావు జిల్లా అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర హాజరు కాక తప్పదు .వారు హాజరైన సభలో మత్స్యకారుల వైఖరి ఎలా ఉంటుందనేది కూడా సందేహంగా మారింది. మరో పది రోజుల్లో కావలి వద్ద మహానాడు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు రాక అనేది అవసరమా ? ప్రశాంతంగా ఉంటున్న మత్స్యకార ప్రాంతంలో సభ ఏ మేరకు అనుకూలమొ అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరోపక్క వైసీపీ ఈ విషయంలో వ్యవరించే వైఖరి కూడా మత్స్యకారుల మనోభావాలను పై ఏ మేరకు అన్నది బీదా అభిమానులలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది.పడవల తరలింపు సంఘటన నుంచి ఇప్పటి వరకు మస్తాన్ రావు తనకు ఇష్టమైన తీరం టచ్ చేసిన దాఖలాలు లేవు, క్రమంగా కోలుకుంటున్న తరుణంలో చంద్రబాబు సభ బీద ప్రజలకు ఏ మేరకు లాభమో, నష్టమో కాలం నిర్ణయించాల్సి ఉంది.

E-పేపర్

మా బతుకులు ఆగం చేసే వైన్ అండ్ బార్ షాపులు శని ఆదివారాల్లో బంద్ చేయాలి

మా బతుకులు ఆగం చేసే వైన్ అండ్ బార్ షాపులు శని ఆదివారాల్లో బంద్ చేయాలి పున్నమి న్యూస్ తెలంగాణ ఇంచార్జి మే 2026 ప్రస్తుతం పెట్రోల్ బంకులు ప్రతి శని, ఆదివారాల్లో బంద్ చేయాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, సామాన్య ప్రజల నుంచి మరో కీలక ప్రశ్న వినిపిస్తోంది. ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తూ, కుటుంబాల్లో కలహాలకు కారణమవుతూ, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న వైన్ షాపులు మరియు బార్‌లను కూడా వారాంతాల్లో మూసివేయాలని పలువురు సామాజికవేత్తలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెట్రోల్ బంకులు బంద్ చేస్తే ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతారు. కానీ మద్యం దుకాణాలు తెరిచి ఉండటం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీలు సంపాదించిన డబ్బు అంతా మద్యం కోసం ఖర్చవుతుండటంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని అంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి వీధిలోనూ వైన్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల యువత మద్యం బారిన పడుతోందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, దేవాలయాలు, కాలనీల సమీపంలో కూడా బార్‌లు నడవడం వల్ల సామాజిక వాతావరణం దెబ్బతింటోందని ప్రజలు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, కుటుంబ హింస, నేరాలు పెరగడానికి మద్యం ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కనీసం శని, ఆదివారాల్లో అయినా వైన్ షాపులు మరియు బార్‌లను బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని చాలా మంది మద్యం దుకాణాల వద్ద గడుపుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పెట్రోల్ లేకపోతే ఒకరోజు ఇబ్బంది పడతాం… కానీ మద్యం వల్ల జీవితాంతం కుటుంబాలు నష్టపోతున్నాయి” అంటూ పలువురు మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలంటే మద్యం నియంత్రణపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారాంతాల్లో వైన్ అండ్ బార్ షాపులను బంద్ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామానాయుడి కష్టం వారసులకు వద్దు .. బీదా రవిచంద్ర

దగదర్తి రాజకీయాలలో ప్రత్యేకతను పొందిన మాలెపాటి రామానాయుడు జీవితమంతా కష్టాలతో గడిచిందని ఆ తర్వాతి తరానికి చెందిన వారు ఆయన ఆశయాలు కొనసాగిస్తూ సమస్యలను ఎదుర్కొనే నేపథ్యంలో తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర పేర్కొన్నారు రామానాయుడు తో పోలిస్తే రవీంద్ర ,సుబ్బానాయుడు పరిస్థితి కొంత మెరుగని నేటి యువతరం వాటిని అధ్యయనం చేసుకుంటూ తమ సేవలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యం మరువలేనిదని సుబ్బానాయుడు లాంటి స్నేహితుడిని తాను అకాలంగా కోల్పోవడం ఎంతో వేదనకు గురిచేసిందని రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తాత్కాలికమని ఆవేశాలకు గురికాకుండా ప్రజలతో మమేకమైనప్పుడు దక్కాల్సింది దక్కకుండా పోదని కూడా ఆయన లొకేష్, నరేష్ లకు సూచిస్తూ దగదర్తిలో మాలెపాటి రాజకీయ అధికారానికి ఎలాంటి డోకా ఉండదని మండలంలో వారి మనుగడ యధావిధిగా కొనసాగుతుందని రవిచంద్ర సుబ్బానాయుడు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మాలేపాటి సుబ్బానాయుడు 61వ జయంతి సందర్భంగా దగదర్తి వెలుపోడు రోడ్డు సెంటర్లోని సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వైద్య శిబిరం ను రవిచంద్ర ప్రారంభించారు. కంచర్ల సునీల్, సుధాకర్ నాయుడు, నరేష్, లోకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు ఫియోనిక్స్ హాస్పిటల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో వందలాది సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచితంగా మందులు అందుకున్నారు. మాలేపాటి లోకేష్, నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనందంగా జరుపుకునే కానీ ఈరోజున వారి జయంతి జరుపుకోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నారు., సుబ్బానాయుడు గారు తమకు దైవంతో సమానమని, ఆయన లేకపోయినా నడిపిస్తున్న పెదనాన్న రవీంద్ర నాయుడు ఎప్పటికీ ఆదర్శమే అని పేర్కొన్నారు.. ఈ కష్ట కాలంలో ప్రతి విషయంలో తమకు సహాయ సహకారాలు అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ బీద రవిచంద్ర ల సాయం మరువలేనిదని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తన తండ్రి సుబ్బానాయుడు లా అహర్నిశలు కృషి చేస్తానని, అండగా నిలబడుతున్న దగదర్తి మండల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడతానని లోకేష్ ఈ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం దగదర్తి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటి వంశ అభిమానులు జోహార్ మాలేపాటి సుబ్బానాయుడు , అమర్ రహే మాలేపాటి సుబ్బానాయుడు అని నినాదాలు చేస్తూ తీవ్ర ఉద్వేగంతో ఆయన లేని లోటు పై కన్నీళ్లు పెట్టుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.