Saturday, 14 February 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జాతీయ మ్మాథ్స్ కాంపిటేషన్ లో ప్రథమ స్థానం

14 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి) అప్పారావు. శ్రీరామానుజన్ మ్మాథ్స్ కాంపిటేషన్ లో నల్లజర్లకు చెందిన టీడీపీ నాయకులు కొయ్యలమూడి నాగార్జున గారి మనవరాలు తాతినేని హర్షిణి సర్ సీ.ఆర్.రెడ్డి స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతూ కాంపిటేషన్ లో పాల్గొని నూటికి నూరు శాతం మార్కులు సాధించిన సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు గారు, మండల టీడీపీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరా కన్నయ్య, పుసులూరి శ్రీను, రావూరి వెంకటరమణ, బేతిన దుర్గారావు, సవలం రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం

సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ( బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ ప్రతిపాదన మేరకు కొత్తగూడెం మేయర్ పదవి ని కైవసం చేసుకుంటా మని కొత్త గూడెం శాసన సభ్యులు కూనం నేని సాంబ శివ రావు తెలిపారు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడగా, సీపీఐ ఒప్పుకుంటే తమ మద్దతుతో మేయర్ పదవి ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. దీంతో కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

కడప

ప్రొద్దుటూరు: నెహ్రూ రోడ్డులో దారుణ హత్య

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నెహ్రూ రోడ్డులో మద్యం మత్తులో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ చివరికి హత్యకు దారి తీసిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులోని నాగుల కట్ట వీధికి చెందిన వినయ్, సుబ్బులు ఇద్దరు స్నేహితులు. ఈరోజు మధ్యాహ్నం మద్యం సేవించడానికి వినయ్ ఇంటికి వెళ్లిన సుబ్బు ఇద్దరు కలిసి సాయంత్రం వరకు ఫుల్ గా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇరువురికి మాటా మాటా పెరిగి గొడవపడ్డారు. దీంతో వినయ్ సుబ్బును మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వినయ్ భార్య అక్కడి పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలాన్ని ప్రొద్దుటూరు ఏ ఎస్ పి విభూక్రిష్ణ త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. ముద్దాయి వినయ్ ను అదుపులోకి తీసుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తిరుపతి

తిరుప‌తి అభివృద్ధికి స‌హ‌క‌రించండిః ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆర‌ణి వినతి

తిరుప‌తి , పున్నమి ప్రతినిధి తిరుప‌తి న‌గ‌రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విన‌తి ప‌త్రం శుక్ర‌వారం అందించారు. పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా న‌గ‌రం విస్త‌రించింద‌ని కావున మౌళిక స‌దుపాయాలు జ‌నాభాకు త‌గ్గ‌ట్టు మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు వివ‌రించారు. మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిపాల‌న భ‌వ‌నం( సిటీ ఆప‌రేష‌న్ సెంట‌ర్ భ‌వ‌నం ) ప‌నులు గ‌త ప్ర‌భుత్వ నిర్వాకంతో నిలిచిపోయాయ‌ని దీన్ని పూర్తి చేసేందుకు యాభై కోట్ల రూపాయ‌లు మంజూరు చేయించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. అలాగే ఆర్టీసి సెంట్ర‌ల్ బ‌స్టేష‌న్ స్థానంలో ఈపిసి విధానంలో ఇంటర్ మోడల్ స్టేషన్ నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కోరారు. న‌గ‌రంలో ముప్ప‌య్ ఏళ్ళ‌క ముందు నిర్మించిన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి వ్య‌వ‌స్థ నిత్యం లీకేజీల‌తో మురుగునీరు రోడ్ల‌పై ప్ర‌వ‌హించే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఎమ్యెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. జ‌న‌భా పెరుగుద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అమృత్ 2.0 ప‌థ‌కం కింద నూత‌న యూజిడి వ్య‌వ‌స్థ కోసం 284 కేంద్రంతో చ‌ర్చించి నిధులు ఇప్పించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. తిరుప‌తి కార్పోరేష‌న్ లో తాగునీటి స‌ర‌ఫ‌రా నెట్వ‌ర్క్, నిల్వ సామర్థ్యాల బ‌లోపేతానికి ఎన‌భై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. అలాగే కార్పోరేష‌న్ లో స‌మ‌గ్ర వ‌ర్ష‌పు నీటి డ్రైనేజీ వ్య‌వ‌స్థ కోసం 101 కోట్లు ముంజూరు చేయించాల‌ని ఆయ‌న విజ్జ‌ప్తి చేశారు. కాగా తిరుప‌తి న‌గ‌రంలో కేవ‌లం టిటిడికి చెందిన జూనియ‌ర్, డిగ్రీ కాలేజీలు మాత్ర‌మే ఉన్నాయ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్ళారు. కాబ‌ట్టి పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ఉప‌యోగ‌ప‌డేలా జూనియ‌ర్, డిగ్రీ కాలేజీలు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విజ్జ‌ప్తి చేశారు. తిరుప‌తి అభివృద్ధికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు తెలిపారు.

తిరుపతి

తిరుప‌తి అభివృద్ధికి స‌హ‌క‌రించండిః ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆర‌ణి వినతి

తిరుప‌తి , పున్నమి ప్రతినిధి తిరుప‌తి న‌గ‌రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విన‌తి ప‌త్రం శుక్ర‌వారం అందించారు. పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా న‌గ‌రం విస్త‌రించింద‌ని కావున మౌళిక స‌దుపాయాలు జ‌నాభాకు త‌గ్గ‌ట్టు మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు వివ‌రించారు. మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిపాల‌న భ‌వ‌నం( సిటీ ఆప‌రేష‌న్ సెంట‌ర్ భ‌వ‌నం ) ప‌నులు గ‌త ప్ర‌భుత్వ నిర్వాకంతో నిలిచిపోయాయ‌ని దీన్ని పూర్తి చేసేందుకు యాభై కోట్ల రూపాయ‌లు మంజూరు చేయించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. అలాగే ఆర్టీసి సెంట్ర‌ల్ బ‌స్టేష‌న్ స్థానంలో ఈపిసి విధానంలో ఇంటర్ మోడల్ స్టేషన్ నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కోరారు. న‌గ‌రంలో ముప్ప‌య్ ఏళ్ళ‌క ముందు నిర్మించిన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి వ్య‌వ‌స్థ నిత్యం లీకేజీల‌తో మురుగునీరు రోడ్ల‌పై ప్ర‌వ‌హించే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఎమ్యెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. జ‌న‌భా పెరుగుద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అమృత్ 2.0 ప‌థ‌కం కింద నూత‌న యూజిడి వ్య‌వ‌స్థ కోసం 284 కేంద్రంతో చ‌ర్చించి నిధులు ఇప్పించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. తిరుప‌తి కార్పోరేష‌న్ లో తాగునీటి స‌ర‌ఫ‌రా నెట్వ‌ర్క్, నిల్వ సామర్థ్యాల బ‌లోపేతానికి ఎన‌భై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే కోరారు. అలాగే కార్పోరేష‌న్ లో స‌మ‌గ్ర వ‌ర్ష‌పు నీటి డ్రైనేజీ వ్య‌వ‌స్థ కోసం 101 కోట్లు ముంజూరు చేయించాల‌ని ఆయ‌న విజ్జ‌ప్తి చేశారు. కాగా తిరుప‌తి న‌గ‌రంలో కేవ‌లం టిటిడికి చెందిన జూనియ‌ర్, డిగ్రీ కాలేజీలు మాత్ర‌మే ఉన్నాయ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్ళారు. కాబ‌ట్టి పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ఉప‌యోగ‌ప‌డేలా జూనియ‌ర్, డిగ్రీ కాలేజీలు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విజ్జ‌ప్తి చేశారు. తిరుప‌తి అభివృద్ధికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు తెలిపారు.

తిరుపతి

కన్నుల పండుగగా వాహన సేవలు: రావణాసుర మయూర వాహనలపై పరమేశ్వరుడు పార్వతీదేవి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. భక్తజన సందోహం మధ్య స్వామి, అమ్మవార్లు విశేష వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రావణాసుర వాహన సేవ: శివ భక్తుడైన రావణాసురుని వాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు గంభీరంగా కొలువుదీరారు. తన భక్తితో కైలాసాన్నే ఎత్తడానికి ప్రయత్నించిన రావణుడి గర్వాన్ని అణిచి, తిరిగి అనుగ్రహించిన స్వామి వారి లీలను స్మరిస్తూ ఈ సేవ నిర్వహించారు. మయూర వాహనంపై అమ్మవారు: జ్ఞానప్రసూనాంబ అమ్మవారు అందమైన మయూర (నెమలి) వాహనంపై అధిష్టించి భక్తులను మురిపించారు. నెమలి వాహనంపై అమ్మవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మంగళవాయిద్యాలు, భజన బృందాల కోలాహలం, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ మాడవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ముక్తిప్రదాతగా కొలువబడే వాయులింగేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

తిరుపతి

మార్కెట్ కమిటీ బకాయిలను వెంటనే చెల్లించాలి…చైర్మన్ రంగినేని

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులతో మార్కెట్ కమిటీ అధ్యక్షులు రంగినేని చెంచయ్య నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి, నిధుల సమీకరణే లక్ష్యంగా జరిగిన ఈ భేటీలో ఆయన పలు కీలక సూచనలు గూర్చి మాట్లాడుతూ…. మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన పాత బకాయిలను రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు వెంటనే చెల్లించాలని, ఆలస్యం చేయకుండా కమిటీకి సహకరించాలని కోరారు. ప్రతి నెలా జరిగే కొనుగోళ్లకు సంబంధించిన నివేదికలను క్రమం తప్పకుండా, గడువులోగా కార్యాలయానికి సమర్పించాలని స్పష్టం చేశారు. వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తూ, మార్కెట్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడకుండా చూడాలని మార్కెట్ కమిటీ అభివృద్ధి చెందితే రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని, ఇందుకు వ్యాపారస్తులందరూ తమ వంతు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ రైస్ మిల్లర్లు మరియు వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆలయానికి ఔషదాలు మంచినీటి బాటల్స్ వితరణచేసిన ఆర్య వైశ్య సంఘం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ కాళహస్తి కెమిస్ట్రీ ఆండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్, ఆర్య వైశ్య సంఘం తరపున మెడిసిన్, వాటర్‌ బాటల్స్ ను స్తానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, సతీమణి బొజ్జల రీషితా రెడ్డి చేతుల మీదుగా ఆలయ ఆవరణలో ఆలయ డిప్యూటీ ఇ.ఒ ఎన్ ఆర్ కృష్ణా రెడ్డికి అందజేశారు.

తిరుపతి

పేద కుటుంబానికి ఆసరాగ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తి తపాలా శాఖలో బీమా తీసుకోవడం వలన పేద కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ కథనం వివరాలు అకస్మాత్తుగా పాలసీదారుడు మరణించడంతో ఓ పేద కుటుంబానికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎల్ఐ) ఆదుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ గుడి కాలనీకి చెందిన వి వెంకటాద్రి తపాలా శాఖలో జూలై 22వ సంవత్సరంలో 20 లక్షలు పాలసీ తీసుకున్నాడు. ఏడాదికి రూ. 1,28,040 చొప్పున రెండు సంవత్సరాలు రూ. 2,56,080 లక్షలు ప్రీమియం చెల్లించాడు. అయితే అతను అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అతని భార్య పిల్లలు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. జీవనం గడవడం కూడా కష్టతరంగా మారింది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ, శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ రాంబాబు మృతిని భార్య అలేఖ్యకు శ్రీకాళహస్తి తపాలా శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు రూ. 23,02,001 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు భార్య అలేఖ్య మాట్లాడుతూ.. తమ భర్త తపాలా శాఖలో పాలసీ వేయడం వలన నేడు తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా తోడ్పడిందని ఆమె తెలిపారు. అనంతరం తపాలా శాఖ ఐపీఓ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో పి ఎల్ ఐ కానీ ఆర్ పి ఎల్ ఐ బీమా తీసుకోవడం వలన వారి కుటుంబానికి అండగా ఉంటుందని గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో తమ సిబ్బందిని కలిస్తే పూర్తి సమాచారం అందిస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుపతి

భక్తుల సేవలో జనసేన- లక్ష నీటి బాటిళ్లను అందజేసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ భారీ విరాళంతో ముందుకొచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆయన లక్ష (1,00,000) మంచినీటి బాటిళ్లను ఈ మంచినీటి బాటిళ్లను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్కి అజయ్ విరాళంగా అందజేశారు. దాతలసేవలుఅభినందనీయం-ఆలయచైర్మన్: ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించిన అజయ్ ని, జనసేన నాయకులను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఇలాంటి దాతల సహకారం మరింత స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు, స్థానికులు కొనియాడారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.