Friday, 11 July 2025

Blog

ఆంధ్రప్రదేశ్

శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టు వస్త్రాలను అందించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరులో వెలసి ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా 11-07-2025 నాడు శ్రీ సౌమ్య స్వామి కళ్యాణం సందర్భంగా ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి కి పట్టు వస్త్రాలను *టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టిడిపి నాయకులు శ్రీ మేడా విజయ శేఖర్ రెడ్డి పట్టు వస్త్రాలను సౌమ్యనాథ స్వామి కి సమర్పిచారు తరువాత టిటిడి వారు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య, నందలూరు ex ఎంపీపీ భువన బోయిన లక్ష్మీనరసయ్య, ఎంపిటిసి పెంచలయ్య, సర్పంచ్ చుక్క యానాది, మరియు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది టిడిపి నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడo జరిగింది.

విశాఖపట్నం

అమ్మే నా దేవత

అమ్మంటే ఒక అదృష్టం అమ్మంటేఒక అపురూపం అమ్మంటే ఒక ఆనందం అమ్మంటే ఒక ఐశ్వర్యం అమ్మంటే ఒక అక్షర బీజం అమ్మంటే ఒక అపార శక్తి రూపం అమ్మంటే ఒక అనుబంధం అమ్మంటే ఒక అనురాగం అమ్మంటే ఒక ఔదార్యం అమ్మంటే ఒక ఆప్యాయత అమ్మంటే ఒక అక్షయపాత్ర అమ్మంటే ఒక దివ్య ఔషధం అమ్మంటే ఒక కమ్మని మకరందం అమ్మంటే ఒక అపూర్వ కానుక అమ్మంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ అమ్మంటే ఒక అద్భుతం అమ్మంటే ఒక ఆశీర్వాదం అమ్మంటే ఒక అనంత ప్రేమ అమ్మంటే ఒక విజయ రథసారధి అమ్మంటే ఒక క్షీర సాగరం మదనం అమ్మంటే ఒక అమృత బాండం అమ్మఃటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే ! అమ్మ లేకపోతే అన్నీ ఉన్న ఏమీ లేనట్లే!!

E-పేపర్

ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్

కొత్తపేట,పున్నమి ప్రతినిధి,జూలై10: డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.వారు మాట్లాడుతూ రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నల్లా లతాశ్రీ, నల్లా సత్యవతి (వయస్సు: 17 సంవత్సరాలు), తండ్రి పేరు శ్రీనివాస్ వీరు ఇద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయారనీ వీరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయబడిందనీ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆచూకీ తెలియక పోవడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.ఈ ఇద్దరి గురించి ఏవైనా సమాచారము ఉన్నవారు దయచేసి వెంటనే రావులపాలెం పోలీస్ స్టేషన్కు తెలియజేయగలరాని తెలిపారు. వారు కనిపిస్తే వెంటనే ఫోన్ నంబర్ 9440796567 కు కాల్ చేసి తెలపగలన్నారు.

జయశంకర్ భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి SM లో విషాదం

కొత్తపల్లి SM గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమత్తులు చేస్తుండగా 33/11విద్యుత్ లైన్ తగిలి స్థానిక రైతు మాజీ సర్పంచు అంకేశ్వరపు వెంకటస్వామి అక్కడికి అక్కడే మృతిచెందారు వెంకటస్వామి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు

ఆంధ్రప్రదేశ్

శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్

నందలూరు మండల గ్రామ ప్రజలకు, నాయకులకు మరియు మీడియా మిత్రులకు పోలీసు వారి విజ్ఞప్తి* రేపు అనగా శుక్రవారం శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది. పొత్తపి,చెన్నయ్యగారి పల్లి లేబాక గ్రామాల వైపు నుండి నందలూరు టౌన్ కు వచ్చే ప్రజలు నందలూరు గుడి వైపు దారిలో రాకుండా ఈదరపల్లి,దుర్గాపురం మీదుగా నందలూరు టౌన్ లోకి వెళ్ళవలెను, శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణానికి మరియు దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన వెళ్ళవలెను, అదేవిధంగా నందలూరు వైపు నుండి సౌమ్యనాథ స్వామి దర్శనానికి మరియు కళ్యాణానికి వచ్చు భక్తులు నందలూరు షాది ఖానా వద్ద ఉన్న పార్కింగ్ లో వాహనాలు నిలుపుకొని సౌమ్యనాథ స్వామి గుడి వద్దకు కాలినడకన రావలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం దృష్టిలో ఉంచుకొని పై విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది, కావున నందలూరు మండల ప్రజలు, నాయకులు మరియు మీడియా మిత్రులు పోలీస్ వారికి సహకరించాలని ఎస్సై, నందలూరు వి. మల్లికార్జున రెడ్డి కోరారు.

E-పేపర్

గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గురు పౌర్ణమి ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. కవి గంగనపల్లి వెంకటరమణ అలాగే అరవపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు వరలక్ష్మి ఉపాధ్యాయులు సుండుపల్లి వెంకటరమణ లను సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని తద్వారా ఎంతోమంది విద్యార్థులకు బంగారు బాట వేసే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చిన వరమన్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాల్లో కీలక బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. అలాంటి గురువులను గౌరవించే అదృష్టం తనకు లభించడం అదృష్టం అన్నారు. ఉపాధ్యాయుల మాట విన్న వారు ఎవరు చెడిపోలేదని సమాజంలో వారికి లభించే గౌరవం ఎనలేనిది అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బెస్త సుబ్రహ్మణ్యం స్కూల్ కమిటీ చైర్మన్ తిరుపాల్ రాంబాబు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గురు పౌర్ణమి ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. కవి గంగనపల్లి వెంకటరమణ అలాగే అరవపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు వరలక్ష్మి ఉపాధ్యాయులు సుండుపల్లి వెంకటరమణ లను సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని తద్వారా ఎంతోమంది విద్యార్థులకు బంగారు బాట వేసే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చిన వరమన్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాల్లో కీలక బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. అలాంటి గురువులను గౌరవించే అదృష్టం తనకు లభించడం అదృష్టం అన్నారు. ఉపాధ్యాయుల మాట విన్న వారు ఎవరు చెడిపోలేదని సమాజంలో వారికి లభించే గౌరవం ఎనలేనిది అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బెస్త సుబ్రహ్మణ్యం స్కూల్ కమిటీ చైర్మన్ తిరుపాల్ రాంబాబు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*రైల్వే వ్యాగన్ వర్క్ షాపు ఎదుట ఎంప్లాయీస్ సంఘ్ ధర్నా*

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం లోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎన్ఎఫ్ఐఆర్ అండ్ ఎస్ సిఆర్ఈఎస్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య పిలుపు మేరకు గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్ షాపు గేటు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ, బ్రాంచ్ కార్యదర్శి గద్దా సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ, కార్మికుల న్యాయపరమైన కోర్కెలను తీర్చకుండా తుంగలో తొక్కి కాలయాపన చేస్తుందని విమర్శించారు. దీనివల్ల భవిష్యత్ తరాల కార్మిక లోకానికి మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ పే కమిషన్ ను వెంటనే నియమించాలని, కేడర్ రీష్ప్యరింగ్ అమలు చేయాలని, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి కార్మికుల పై పనిభారాన్ని తగ్గించాలని, రైల్వే ఉద్యోగులందరికీ ఓపిఎస్ ను అమలు పరచాలని, రైల్వేల ప్రవేటికరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి బ్రాంచి అధ్యక్షుడు పామర్తి శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వర్కింగ్ చైర్మన్ దాసరి డేవిడ్ రాజు, కోశాధికారి పి.విమల్ సాయి, గూడవల్లి సుధాకర్, ఎస్.బోయాజ్, కె.ఎల్.నాయక్, ఎం.డి.రబ్బానీ, ఆర్.ఎన్.మద్ధయ్య, కునిబిల్లి శంకరరావు, మహిళా కార్మికులు, బ్రాంచి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.