Wednesday, 8 July 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వీరరామ పురం లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

హనుమంతుని పాడు జూలై 8 (కె టి సి పున్నమి ప్రతినిధి): మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం వీరరామపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకుడు ఉప్పుటూరి గురుస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన ప్రజా సంక్షేమ పాలన, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసి జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు గవదకట్ల కార్తిక్ యాదవ్, వైఎస్సార్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ దొడ్ల వెంకటేష్, గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివ, మాజీ సర్పంచ్ ఆలా శివ, ఆలా నాగేశ్వరరావు, ఉప్పుటూరి గుంటయ్య, గవదకట్ల వెంకటేశ్వర్లు, బత్తుల రాములు, ఉప్పుటూరి ఏడుకొండలు యాదవ్, ఉప్పుటూరి శ్రీను యాదవ్, మచ్చా బ్రదర్స్, మేడిబోయిన గణేష్, వైఎస్సార్సీపీ యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి కార్యకర్త ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సాదర వాతావరణంలో ముగిసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

నర్రవాడలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాల ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో బాణసంచా పేలుస్తుండగా చేతిలోనే పేలడంతో బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన విజయకుమార్ చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ఆయనను నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు: కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి గ్రామంలో కుక్కల దాడిలో ఓ చుక్కల దుప్పి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన దుప్పిని వీధికుక్కలు వెంటాడి దాడి చేయడంతో అది చనిపోయింది. ఘటనాస్థలాన్ని డీఆర్డి శ్రీనివాసరావు పరిశీలించి, సుమారు ఐదేళ్ల వయస్సు గల దుప్పి గర్భవతి అని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి, అటవీ జంతువుల సంరక్షణకు అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

భక్తి

దేవాలయాల్లో భక్తుల రద్దీ

జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, క్యూలైన్లు, భద్రతా చర్యలు, ప్రసాదాల పంపిణీ వంటి సేవలను మరింత విస్తరించారు. సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు ప్రశాంతతను అందించడంతో పాటు స్థానిక వ్యాపారాలకు కూడా ఊతమిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Others

గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

పరిశుభ్రమైన గ్రామాల లక్ష్యంతో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేశారు. చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు. గ్రామపంచాయతీలు ప్రత్యేక శానిటేషన్ బృందాలను ఏర్పాటు చేశాయి. పారిశుద్ధ్యం మెరుగుపడితే అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

News

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీటి పొదుపు సాంకేతికతలు, మెరుగైన విత్తనాలు, యాంత్రీకరణపై నిపుణులు సూచనలు అందిస్తున్నారు. పంట దిగుబడిని పెంచేందుకు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ యంత్రాల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ఆధునిక వ్యవసాయం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సాహితీ

మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం

మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. దీంతో మహిళలు చిన్న పరిశ్రమలు ప్రారంభించే అవకాశాలు పెరుగుతున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబనతో కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని అధికారులు తెలిపారు.

నాగర్‌కర్నూల్

నాగులపల్లి గ్రామం లో ‘ ఎస్ ఐ ఆర్ ‘ ఫారం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి? నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో ఓటర్ల క్రమబద్ధీకరణ కోసం నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ఫారాల నింపే ప్రక్రియలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగులపల్లి గ్రామపంచా 03వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగులపల్లి గ్రామంలో చాలామంది ప్రజలకు ఈ ఫారాలను ఎలా నింపాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ఇదే సమయంలో వివరాల సేకరణ కోసం వస్తున్న బీఎల్ఓ లపై కూడా పని ఒత్తిడి, ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున స్థానిక తహసిల్దార్ తక్షణమే స్పందించి, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు నాగులపల్లి గ్రామంలో ఒక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఓటర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా ముగుస్తుందని ఆయన సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SIR ఫారాలను పూర్తి చేయండి: ఆర్డీవో

ఆత్మకూరు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఆత్మకూరు ఆర్డీవో బి. పావని క్షేత్రస్థాయిలో పర్య టిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఏఎస్పేట మండలంలోని పెద్ద అబ్బిపురం, అనుమసముద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఎల్ఎల పనితీరును పరిశీలించి, ఓటర్ల దరఖాస్తుల ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే దరఖాస్తులు అందుకున్న ఓటర్లు వాటిని త్వరగా పూర్తి చేసి బీఎల్దలకు అందజేయాలని ఆర్డీవో కోరారు.

News

సుజల గ్రామం లక్ష్యంగా తాగునీటి చర్యలు

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు కొత్త మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నీటి కొరత ఉన్న గ్రామాలను గుర్తించి అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.