Sunday, 19 April 2026

Blog

ఖమ్మం

ఖమ్మంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని

ఖమ్మంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సునీత గారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో బిఏ, బీకాం(కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్), బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్ సిఎస్, బిజెడ్ సి, ఎంబిజెడ్ సి గ్రూపులలో సీట్లు ఉన్నాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండవ సంవత్సర చదివిన అర్హత గల విద్యార్థినులు ఏప్రిల్ 15 నుండి మే 7వ తేదీలోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో ( SSC Memo, TC, Inter memo, Caste, Income,Aadhar card xerox, 3 color Photos) కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7995010677, 8096408154, 9505389305 మొబైల్ నంబర్లను సంప్రదించాలన్నారు.

తిరుపతి

గుడిమల్లం ఆలయాభివృద్ధికి రూ. 5 లక్షల విరాళం-బృందమ్మ ఆధ్వర్యంలో చెక్కు అందజేత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని ఏర్పేడు మండలంలో గుడిమల్లం వున్నటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ పరశురామేశ్వర స్వామి (గుడిమల్లం) దేవస్థాన అభివృద్ధికి ప్రముఖులు ఉదారత చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ శనివారం ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. బొజ్జల బృందమ్మతో పాటు చెరుకూరి కృష్ణమూర్తి (విష్ణు కెమికల్స్ అధినేత), మంజుల, కృష్ణమూర్తి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో రూ. 5 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరి నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ)కి అందజేశారు.దాతల సహకారంతో ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆలయ అధికారులు తెలిపారు. విరాళం అందజేసిన ప్రముఖులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఇదే క్రమంలో త్వరలో నిర్వహించ తలపెట్టిన ఆలయ మహా కుంభాభిషేకము మహోత్సవానికి విశిష్ట అతిథులుగా విచ్చేయవలసిందిగా దేవస్థాన అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించారు.

తిరుపతి

చిన్నారి ప్రాణరక్షణకు లోకేష్ సహాయం… తప్పుడు ప్రచారంపై చర్యలు కోరిన టీడీపీ నేతలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA టైప్-1) వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక వైద్యానికి మంత్రి నారా లోకేష్ అందించిన ఆర్థిక సాయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేష్ కుమార్ కుమార్తె పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజెక్షన్ అవసరమైంది. ప్రజల సహకారంతో రూ.10 కోట్లు సమీకరించగా, మిగిలిన రూ.6 కోట్లు మంత్రి నారా లోకేష్ స్వయంగా అందిస్తానని హామీ ఇచ్చి సహాయం చేశారు. అనంతరం అమెరికా నుంచి జోల్ జెన్ స్మా జీన్ థెరపీ ఇంజెక్షన్ తెప్పించి హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చిన్నారికి అందించారు. ఈ సేవాపరమైన చర్యపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమని నేతలు పేర్కొన్నారు. ఈ నిధులు సీఎంఆర్ఎఫ్ లేదా ఇతర ప్రభుత్వ వనరుల ద్వారా కాకుండా, పూర్తిగా వ్యక్తిగతంగా సమీకరించినవేనని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలను కూడా విమర్శించడం అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విశ్వబ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి,వన్నెకుల క్షత్రియ సంక్షే, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,రాష్ట్ర కార్యదర్శి మరియు గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

‘మన ఊరి బడి – అందరి బడి’- గిరిజన కాలనీలో ‘ప్రగతి’ స్వచ్ఛంద సంస్థ విద్యా చైతన్య యాత్ర

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి రూరల్ మండలం బి.వి. పురం గిరిజన కాలనీలో బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలనే లక్ష్యంతో ‘ప్రగతి’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం భారీ ఎన్రోల్మెంట్ (నమోదు) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటా తిరిగి, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అందుతున్నాయని వివరించారు. ప్రతి బిడ్డను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. విద్యతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు విద్యే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.”ఎక్కడికో ఎందుకు దండగ.. మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా”, “ఆడపిల్లల చదువు – దేశానికి వెలుగు” వంటి ప్లేకార్డులు చేతబట్టి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కరపత్రాల ద్వారా ప్రభుత్వ విద్యా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కో-కన్వీనర్ రామచంద్ర, బి.వి. పురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయ కుమారి, ఉపాధ్యాయులు మధుసూదన్, అంగన్వాడీ టీచర్ పద్మ, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

రాజీవ్ నగర్‌కు ‘రెగ్యులర్ వీఆర్వో’ను నియమించండి-తహశీల్దార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వినతి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి మండల పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఎదురవుతున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ రవీంద్ర శనివారం శ్రీకాళహస్తి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన రాజీవ్ నగర్‌కు గత ఏడాది కాలంగా రెగ్యులర్ విఆర్వో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంకటగిరి మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి ఇక్కడ అదనపు బాధ్యతలు అప్పగించారని, ఆయన దూర ప్రాంతంలో ఉండటం వల్ల స్థానిక సమస్యలకు సకాలంలో స్పందించలేకపోతున్నారని రవీంద్ర వివరించారు. దీనివల్ల ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యమవుతోందని, అత్యవసర సమయాల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ ప్రాంతంలో భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టి వంటి అక్రమాలు పెరుగుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం సమీప ప్రాంత అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాల్సి ఉన్నా, ఆ విధానం అమలు కాకపోవడంతో పరిపాలన కుంటుపడుతోందని పేర్కొన్నారు.ప్రస్తుత ఇన్‌చార్జ్ అధికారిని బాధ్యతల నుంచి విముక్తి కల్పించి, రాజీవ్ నగర్‌కు వెంటనే రెగ్యులర్ వీఆర్వోను నియమించాలని లేదా సమీప సచివాలయ అధికారినికైనా బాధ్యతలు అప్పగించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలపై ప్రత్యేక విచారణ జరిపి ప్రజలకు తక్షణ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రవీంద్ర రెవెన్యూ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

గ్రంథాలయానికి 200 పోటీ పరీక్షల పుస్తకాల విరాళం-ఎస్.ఎస్.ఆర్ అకాడమీ ఉదారత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయానికి ఎస్.ఎస్.ఆర్ అకాడమీ ప్రతినిధి జి. మంజునాథ్ సుమారు 200 పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి చేతుల మీదుగా శనివారం ఈ పుస్తకాలను గ్రంథాలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ గురవారెడ్డి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు మంజునాథ్ చేసిన ఈ సాయం ఎంతో దోహదపడుతుందన్నారు. మంజునాథ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు దాతలు గ్రంథాలయాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా ‘సీఎస్ఆర్’ (CSR) నిధుల ద్వారా గ్రంథాలయాలకు అవసరమైన మౌలిక వసతులు, పుస్తకాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28 నుంచి గ్రంథాలయంలో ప్రారంభం కానున్న ‘సమ్మర్ క్యాంప్’ (వేసవి శిక్షణ తరగతులు) గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు తమ సెలవులను వృధా చేసుకోకుండా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పుస్తక దాత మంజునాథ్‌ను చైర్మన్ దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు ఎన్.ఎస్. లావణ్య, ఎ. హరికృష్ణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

తిరుపతి

హిందీ పరీక్షల్లో తొండమనాడు విద్యార్థుల ఘనత-100 కి 98 మార్కులతో రికార్డు!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ (హైదరాబాద్) ఇటీవల నిర్వహించిన హిందీ పరీక్షల్లో తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో జయకేతనం ఎగురవేశారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంగా జరిగిన ప్రథమ, మధ్యమ స్థాయి పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు అద్భుత మార్కులు సాధించి మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. పాఠశాలకు చెందిన వింధ్య, వంశీ, యోషిత అనే విద్యార్థులు 100 మార్కులకు గాను 98 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే గీతిక, మోక్షాయిని 93 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. కేవలం టాప్ ర్యాంకులే కాకుండా, ఈ పరీక్షలకు హాజరైన వారిలో మొత్తం 25 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణి (ఫస్ట్ క్లాస్)లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. కృష్ణయ్య ప్రత్యేకంగా అభినందించి, వారికి ధ్రువపత్రాలను అందజేశారు. విద్యార్థులను ఇంతటి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన హిందీ ఉపాధ్యాయురాలు పద్మావతి, ఉపాధ్యాయులు నాగరాజ్‌లను ఆయన అభినందించారు. విద్యార్థుల ఈ విజయంతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది.

తిరుపతి

సామాన్య భక్తులకు పూజలను దూరం చేయొద్దు-శ్రీకాళహస్తి ఈఓకు బీజేపీ నేతల డిమాండ్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సామాన్య భక్తుల కోసం అమలులో ఉన్న ₹500 రాహుకేతు పూజలను యధాతథంగా కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు శనివారం ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) బి.కె. వెంకటేశులుకు వినతి పత్రం సమర్పించారు. రెండు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.500 పూజా టికెట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాహుకేతు పూజలకు నిలయమైన శ్రీకాళహస్తిలో సామాన్యులకు పూజలు దూరం చేయడం సరికాదని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం పేద, మధ్యతరగతి, ధనిక వర్గాల కోసం వేర్వేరు ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో సామాన్యులకు భారమయ్యే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు సామాన్య భక్తుల ప్రయోజనాల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్. హరీష్ రెడ్డి, చిలకా రంగయ్య, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, జీవీ అమర్నాథ్, భరత్ నాయుడు, ఢిల్లీ కుమార్ రెడ్డి, వాసు యాదవ్, మోహన్, కృష్ణారెడ్డి, రవి, చెందు, యశ్వంత్, భార్గవ్ పాల్గొన్నారు.

E-పేపర్

నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధనే లక్ష్యం -ప్రతి రెండునెలలకోసారి జాబ్ మేళా .. ఏడాదికొకసారి మెగా జాబ్ మేళా -మార్గాని భరత్ రామ్ జాబ్ సెంటర్ నిరంతర ప్రక్రియ ఇది -వెబ్ సైట్ కూడా పెడుతున్నాం .. అందులో నమోదు కావచ్చు -ఆయా కంపెనీల నుంచి ట్రైనర్స్ కూడా రప్పించి శిక్షణ ఇప్పిస్తాం -వచ్చే మూడేళ్ళలో 15వేలనుంచి 20వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం -జాబ్ మేళా సందర్బంగా మాజీ ఎంపీ భరత్ వెల్లడి రాజమహేంద్రవరం, ఏప్రిల్ 18: నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. ప్రతిరెండు నెలలకొకసారి జాబ్ మేళా, ఏడాది కొకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు శనివారం స్థానిక వి.ఎల్.పురం మార్గాని ఎస్టేట్స్ ,లో జాబ్ మేళా నిర్వహించారు. ఈసందర్బంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ నిరుద్యోగరహిత రాజమహేంద్రవరం లక్ష్యంగా ,రాజమహేంద్రవరం పార్లమెంట్ నిరుద్యోగ యువతకోసం జనవరి నెలలో సుమారు 75 కంపెనీలతో మంజీరా కన్వెన్షన్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయిందని గుర్తుచేసారు. ఈ జాబ్ మేళాలు నిరంతరం జరిగే ప్రక్రియ గా ఆరోజునే ప్రకటించామన్నారు. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నామని తెలిపారు. అందుకే ఇది మార్గాని భరత్ రామ్ జాబ్ సెంటర్ గా నడుస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా మార్గాని భరత్ పేరుతొ ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభిస్తున్నామని భరత్ తెలిపారు. ఇందులో నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ విద్యార్హతలను బట్టి ఈ వెబ్ సైట్ లో నమోదు కావచ్చని ఆయన సూచించారు. ప్రతిరెండు నెలలకొకసారి జరిగే జాబ్ మేళాకు ఇది దోహద పడుతుందని ఆయన తెలిపారు. అలాగే ఏ ఐ, మాన్యుఫాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ-కామర్స్ లాంటి కంపెనీల నుంచి ట్రైనర్స్ కూడా రప్పించి నిరుద్యోగులకు ఓరియెంటేషన్ శిక్షణ కూడా అందించేలా చూస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని వచ్చే మూడేళ్ళలో కనీసం 15వేల నుంచి 20వేల మందికి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని మాజీ ఎంపీ భరత్ చెప్పారు. గత జనవరిలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు సదరు కంపెనీ నుంచి ఇంటర్యూలు నిర్వహించడానికి ఇంఛార్జిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతమందికి వీలయితే అంతమందికి ఉపాధి కల్పించడానికి కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈసందర్బంగా హెచ్ ఆర్ కో డాట్ కంపెనీ హెచ్ ఆర్ సుష్మిత మాట్లాడుతూ గతంలో మార్గాని భరత్ రామ్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొంది, ఇప్పుడు ఆయన నిర్వహించే జాబ్ మేళాకు నేను పనిచేసే కంపెనీ నుంచి ఇంటర్యూ నిర్వహించడానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాగా ఈ జాబ్ మేళాలో సుమారు 500మందికి మాజీ ఎంపీ మార్గాని భరత్, మార్గాని నాగేశ్వరరావు తో పాటు ముఖ్య అతిధులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డా గూడూరి శ్రీనివాసరావు, డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. END

తూర్పు గోదావరి

వచ్చే మూడేళ్ళలో 15వేల నుంచి 20వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని  వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు.  ప్రతిరెండు నెలలకొకసారి జాబ్ మేళా, ఏడాది కొకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు   శనివారం స్థానిక వి.ఎల్.పురం  మార్గాని ఎస్టేట్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈసందర్బంగా  ఎంపీ భరత్ మాట్లాడుతూ నిరుద్యోగరహిత రాజమహేంద్రవరం  లక్ష్యంగా, రాజమహేంద్రవరం పార్లమెంట్ నిరుద్యోగ యువతకోసం  జనవరి నెలలో సుమారు 75 కంపెనీలతో మంజీరా కన్వెన్షన్ లో నిర్వహించిన  మెగా జాబ్ మేళా విజయవంతం అయిందని గుర్తుచేసారు. ఈ జాబ్ మేళాలు  నిరంతరం జరిగే ప్రక్రియ గా  ఆరోజునే  ప్రకటించామన్నారు. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నామని తెలిపారు. అందుకే ఇది మార్గాని భరత్ రామ్ జాబ్ సెంటర్ గా నడుస్తుందని ఆయన తెలిపారు.   అదేవిధంగా మార్గాని భరత్ పేరుతొ ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభిస్తున్నామని భరత్ తెలిపారు. ఇందులో నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ విద్యార్హతలను బట్టి ఈ వెబ్ సైట్ లో నమోదు కావచ్చని ఆయన సూచించారు. ప్రతిరెండు నెలలకొకసారి జరిగే జాబ్ మేళాకు ఇది దోహద పడుతుందని ఆయన తెలిపారు.  అలాగే ఏ ఐ,  మాన్యుఫాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ-కామర్స్ లాంటి   కంపెనీల నుంచి ట్రైనర్స్ కూడా రప్పించి నిరుద్యోగులకు ఓరియెంటేషన్ శిక్షణ కూడా అందించేలా  చూస్తామని ఆయన ప్రకటించారు.   ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని వచ్చే మూడేళ్ళలో కనీసం 15వేల నుంచి 20వేల మందికి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు  ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని  మాజీ ఎంపీ భరత్ చెప్పారు. గత జనవరిలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు సదరు కంపెనీ నుంచి   ఇంటర్యూలు నిర్వహించడానికి ఇంఛార్జిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతమందికి వీలయితే అంతమందికి ఉపాధి కల్పించడానికి కృషి కొనసాగుతుందని తెలిపారు.   ఈసందర్బంగా హెచ్ ఆర్ కో డాట్ కంపెనీ హెచ్ ఆర్  సుష్మిత  మాట్లాడుతూ గతంలో మార్గాని భరత్ రామ్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొంది, ఇప్పుడు ఆయన నిర్వహించే జాబ్ మేళాకు నేను పనిచేసే కంపెనీ నుంచి ఇంటర్యూ నిర్వహించడానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.   కాగా ఈ జాబ్ మేళాలో సుమారు 500మందికి మాజీ ఎంపీ మార్గాని భరత్, మార్గాని నాగేశ్వరరావు తో పాటు ముఖ్య అతిధులు  మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,  డా గూడూరి శ్రీనివాసరావు, డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.