Thursday, 9 July 2026

Blog

E-పేపర్

హామీలు అమలయ్యేదేప్పుడు…?

గుండి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా అసంపూర్తి 15 గ్రామాల ప్రజలకు నిత్య యాతన – పనులు పూర్తి చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం: డీవైఎఫ్‌ఐ హెచ్చరిక ఆసిఫాబాద్, జూలై 8: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుండి గ్రామం వద్ద గుండి వాగుపై నిర్మాణంలో ఉన్న హై-లెవెల్ బ్రిడ్జి పనులు దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతూనే ఉండటం పట్ల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో నాబార్డ్ నిధులతో మంజూరైన ఈ వంతెనను 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా, 2026 వచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉండటం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, మొదట ఈ వంతెన నిర్మాణానికి సుమారు ₹8.50 కోట్లు అంచనా వ్యయం నిర్ణయించగా, సంవత్సరాల తరబడి ఆలస్యం కారణంగా వ్యయం ఇప్పుడు ₹14.40 కోట్లకు పెరిగిందన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 11 పిల్లర్లు మాత్రమే నిర్మించారని, వాటిపై కాంక్రీట్ స్లాబ్‌లు వేయాల్సి ఉండగానే పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గుండి వాగుపై శాశ్వత వంతెన లేకపోవడంతో గుండి గ్రామంతో పాటు దాని పరిసర ప్రాంతాల 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్తీక్ తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు గ్రామాలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని, ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నారని అన్నారు. సరైన వంతెన లేక స్థానికులు నాటు పడవలు, థర్మాకోల్ తెప్పలపై ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సమయంలో గర్భిణీలు, వృద్ధులు, ప్రమాద బాధితులను వాగు దాటించేందుకు సరైన మార్గం లేక ప్రాణాల మీద ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంటోందని ఆయన వాపోయారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో, ప్రజలు రోజువారీ అవసరాల కోసం ప్రయాణించే సమయంలో ఈ వాగు ప్రాణాంతకంగా మారుతోందన్నారు. ఎండాకాలంలో స్థానికులు తాత్కాలికంగా మట్టి రోడ్లు వేసుకున్నప్పటికీ, వర్షాలు మొదలైతే అవి కొట్టుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి ఏళ్లుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇంతకాలం వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం పెరిగిందని డీవైఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. గతంలోనే గ్రామస్తులు “వంతెన లేకపోతే – ఓటు లేదు” అంటూ ఎన్నికల బహిష్కరణకు దిగినా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు పదేపదే హామీలు ఇచ్చినా అవి మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ఇకనైనా గుండి వాగుపై వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, లేనిపక్షంలో 15 గ్రామాల ప్రజలను కలుపుకొని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ హెచ్చరించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులకు రాజకీయంగా తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్‌కుమార్, గ్రామ నాయకులు రాహుల్, శంకర్, దిలీప్, సావిత్రి, సోనీ, హారిక, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

గూడూరు

మరవలేని మహా నేత డాక్టర్ వైయస్సార్

పున్నమి ప్రతినిధి : తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరవలేని మహానేతగా చరిత్రలో నిలిచిపోయారని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ నాయకుల ఫయాజ్ పేర్కొన్నారు . వైయస్సార్ జయంతి సందర్బంగా గూడూరు హాస్పిటల్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఏ నాయకుడు చేయని విధంగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో తనదైన ముద్ర వేసిన మహా నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని, అలాగే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోనే కాక భారత దేశంలోనే అనేక మంది నాయకులకు మార్గదర్శకులుగా నిలిచారని ఫయాజ్ పేర్కొన్నారు .

కడప

డ్వాక్రా రుణాల పైన సంయుక్త సమావేశం నిర్వహించిన డిఆర్ డిఏ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు

వేముల మండలం స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జయచంద్ర తో డ్వాక్రా రుణాల మంజూరు పైన సంయుక్త సమావేశాన్ని నిర్వహించిన వెలుగు డిఆర్డిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి డ్వాక్రా సంఘానికి రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.వార్షిక రుణ మరియు జీవనోపాధి ప్రణాళికకు అనుగుణంగా మహిళా సంఘ సభ్యులకి తక్షణమే రుణాలు మంజూరు చేయాలని క్షేత్రస్థాయిలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు డాక్యుమెంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేస్తారని వివరించారు. మహిళా సంఘ సభ్యులు వ్యక్తిగత రుణాలు మంజూరులో ప్రతి బ్యాంకరు లక్ష్యం పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ జ్యోతి జైపాల్ నాగేశ్వరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!*

*అమరావతి : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!* *సంక్షేమ శాఖలపై మంత్రులతో సమీక్షలో, ప్రస్తుత మెస్ ఛార్జీలపై 10% పెంపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.* *MJP గురుకులాల శాశ్వత భవనాల కోసం రూ.500 కోట్లకు ఆమోదం.* *హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.* *మెస్ ఛార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత jనాణ్యమైన పౌష్టికాహారం అందుతుందని, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో సొంత ఇంటి వాతావరణం కల్పించడమే ప్రభుత్వజేజేలక్ష్యమని తెలిపిన మంత్రి సవిత.*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాట్రేనికోన ఉన్నతపాఠశాలలో దాతలు నిర్మించిన డైనింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సత్యవతి మెమోరియల్ డైనింగ్ హాల్‌ను శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తమ తల్లి సత్యవతి స్మారకార్థం ఆమె కుమారులు రూ.10 లక్షల వ్యయంతో ఈ డైనింగ్ హాల్‌ను నిర్మించి విద్యార్థులకు అంకితం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజ సేవా దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ, దాతలు మరియు సేవాభావం కలిగిన కుటుంబాలు ముందుకు వచ్చి విద్యాసంస్థల అభివృద్ధికి తోడ్పడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. సమాజంలో స్థిరపడిన ప్రతి ఒక్కరూ తమ గ్రామాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ఈ డైనింగ్ హాల్ ద్వారా విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేసే అవకాశం కలుగుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరావు,ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, సీనియర్ నాయకులు వనచర్ల నాగేశ్వరరావు,వెసింగి రంగారావు వర్మ,వెంట్రు సుధీర్,ఇసుకపట్ల రాంబాబు,దండుప్రోలు సత్యం, మోకా అప్పాజీ,మోకా బాల ప్రసాద్, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఘనంగా వైఎస్సార్ జన్మదిన వేడుకలు.

ఘనంగా వైఎస్సార్ జన్మదిన వేడుకలు. జులై 8 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సెంటర్ లో గల వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదే వైయస్సార్ సీఎంగా పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఆయన హయంలోనే పల్లెలు, పట్టణాలు సస్సోమ్లంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్.నాయకులు మేడ ధర్మారావు, భూక్య లాలు నాయక్,భూక్య చందులాల్, గాలిబ్ సాహెబ్, ముక్తి వెంకటేశ్వర్లు, మాలోత్ నరసింహారావు, పూర్ణకంటి మైసరావు, గుర్రం రవి, పఠాన్ మజీద్ ఖాన్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, దానసరి నవీన్, చందమామ నరసింహారావు,ఆది నరసింహారావు, భూపతి వెంకటేష్, అజ్మీర సురేష్, పెద్దబాబు, నిమ్మల నరేందర్, షేక్ నన్నే ఖాన్, పంతగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఘనంగా వైఎస్సార్ జన్మదిన వేడుకలు.

ఘనంగా వైఎస్సార్ జన్మదిన వేడుకలు. జులై 8 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సెంటర్ లో గల వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదే వైయస్సార్ సీఎంగా పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఆయన హయంలోనే పల్లెలు, పట్టణాలు సస్సోమ్లంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్.నాయకులు మేడ ధర్మారావు, భూక్య లాలు నాయక్,భూక్య చందులాల్, గాలిబ్ సాహెబ్, ముక్తి వెంకటేశ్వర్లు, మాలోత్ నరసింహారావు, పూర్ణకంటి మైసరావు, గుర్రం రవి, పఠాన్ మజీద్ ఖాన్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, దానసరి నవీన్, చందమామ నరసింహారావు,ఆది నరసింహారావు, భూపతి వెంకటేష్, అజ్మీర సురేష్, పెద్దబాబు, నిమ్మల నరేందర్, షేక్ నన్నే ఖాన్, పంతగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా

విజయవాడలో సోహైల్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 విజయవాడ.. నాలుగు గంటలుగా విజయవాడలో కొనసాగుతున్న NIA సోదాలు. విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు. తల్లి తండ్రుల స్టేట్మెంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన NIA అధికారులు. మహమ్మద్ దానిష్, మహమ్మద్ రహంతుల్లా నివాసంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు. భారీ భద్రత నడుమ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న NIA అధికారులు… ISIS,IQIS తో సంబంధాలు ఉన్నాయనె కోణంలో ఇప్పటికీ ఇదే కేసులో 12 మందిపై కేసు నమోదు కాగా 11 మంది అరెస్టు… నిందితులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.. END

కృష్ణా

విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 విజయవాడ.. నాలుగు గంటలుగా విజయవాడలో కొనసాగుతున్న NIA సోదాలు. విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు. తల్లి తండ్రుల స్టేట్మెంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన NIA అధికారులు. మహమ్మద్ దానిష్, మహమ్మద్ రహంతుల్లా నివాసంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు. భారీ భద్రత నడుమ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న NIA అధికారులు… ISIS,IQIS తో సంబంధాలు ఉన్నాయనె కోణంలో ఇప్పటికీ ఇదే కేసులో 12 మందిపై కేసు నమోదు కాగా 11 మంది అరెస్టు… నిందితులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.. END

కృష్ణా

విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 విజయవాడ.. నాలుగు గంటలుగా విజయవాడలో కొనసాగుతున్న NIA సోదాలు. విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు. తల్లి తండ్రుల స్టేట్మెంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన NIA అధికారులు. మహమ్మద్ దానిష్, మహమ్మద్ రహంతుల్లా నివాసంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు. భారీ భద్రత నడుమ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న NIA అధికారులు… ISIS,IQIS తో సంబంధాలు ఉన్నాయనె కోణంలో ఇప్పటికీ ఇదే కేసులో 12 మందిపై కేసు నమోదు కాగా 11 మంది అరెస్టు… నిందితులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.. END

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.