Sunday, 19 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.

​-యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారి క్లీనింగ్ -దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కేసరపల్లి ఈఓ ప్రసాద్ గన్నవరం, పున్నమి ప్రతినిధి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి హజ్ యాత్రికులు గన్నవరం అంతర్జాతీయ విమానశ్రయానికి భారీగా తరలివస్తున్న నేపథ్యంలో, విమానశ్రయ సమీప ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కేసరపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను శనివారం నిర్వహించారు.కేసరపల్లి పంచాయతీ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ప్రసాద్ పర్యవేక్షణలో జాతీయ రహదారికి ఇరువైపులా, అలాగే డివైడర్ల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను పొక్లెయిన్ యంత్రాల ద్వారా తొలగించారు. యాత్రికులకు మరియు వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించేలా, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా సిబ్బందికి ఈఓ దిశానిర్దేశం చేశారు.డివైడర్ల వద్ద పేరుకుపోయిన మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలను పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నారు. విమానశ్రయానికి వచ్చే అతిథులకు మన ప్రాంతంపై మంచి అభిప్రాయం కలిగేలా పారిశుధ్య పనులు ముమ్మరం చేశామని ఈఓ ప్రసాద్ తెలిపారు. హజ్ యాత్ర ముగిసే వరకు విమానశ్రయ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుధ్య మేస్త్రీలు, సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

టీడీపీలోకి 60 మంది వైఎస్సార్‌సీపీ నేతలు..

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్): నక్కపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 60 మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పార్టీ కండువాలు ధరించి అధికారికంగా చేరికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా టీడీపీ కృషి చేస్తున్నందునే ప్రజలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీ అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం – భోజనం వడ్డించిన హోంమంత్రి అనిత..

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్): పాయకరావుపేటలో రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర హోంమంత్రి అనిత ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభంతో స్థానికులకు ఉపశమనం లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకయ్య స్వామి ఆలయంలో క్షీరాభిషేకం–అన్నదానం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 18 (జి ఎం కె రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద శనివారం సందర్భంగా క్షీరాభిషేకం నిర్వహించడం జరిగినది స్వామివారికి పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా గంధళ్ళ కృష్ణయ్య అన్నపూర్ణమ్మ గార్లు వ్యవహరించారు ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు

ఆంధ్రప్రదేశ్

*45 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న రాజేంద్రప్రసాద్‌కు పదవి దక్కడం హర్షణీయం*

​ఉయ్యూరు, ఏప్రిల్ 18: పున్నమి ప్రతినిధి సురేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులైన రాజేంద్రప్రసాద్‌ను శనివారం ఉయ్యూరులోని ఆయన నివాసంలో పలు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వాకర్స్ అసోసియేషన్, ఆటోమొబైల్ యూనియన్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు తెదేపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, గత 45 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ, 25 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా ఉయ్యూరు అభివృద్ధికి రాజేంద్రప్రసాద్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా మరియు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఆయన అందించిన సేవలు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసే నాయకుడికి తగిన గుర్తింపు లభించడం ఆనందదాయకమని వారు తెలిపారు. ​ఈ సత్కార కార్యక్రమంలో ఉప్పులూరు పీఏసీ ఛైర్మన్ పడవల మధుసూదన్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బుజ్జులు, కృష్ణాజిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వసంత కుమార్, తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుబ్బారావు పాల్గొన్నారు. అలాగే ఐదో వార్డు టిడిపి అధ్యక్షుడు ఉయ్యూరు గణేష్, సిటీ కేబుల్ శివరామకృష్ణ, అబ్దుల్ ఖదీర్, మహమ్మద్ అన్వర్, అహ్మద్, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోడె సాంబశివరావు, సభ్యులు గోక శ్రీనివాసరావు, అబ్ధుల్ ఖలీల్, డాక్టర్ తిరుమలరావు, నెల్లి రాంబాబు, మురళి, రమేష్ బాబు తదితరులు ఉన్నారు. ​వీరితో పాటు ఉయ్యూరు ఆటోమొబైల్ వెల్ఫేర్ యూనియన్ నాయకులు అబ్దుల్ మబూద్, గఫూర్, ఫజల్, మహమూద్, ఆసిఫ్, అమన్ తదితరులు పాల్గొని రాజేంద్రప్రసాద్‌కు అభినందనలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌లలో సచివాలయాల పనితీరు, సిబ్బంది గైర్హాజరు, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యంపై ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం రామవరప్పాడు-1, 2, 3, ప్రసాదంపాడు-2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ తనిఖీలలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను ఆయన గుర్తించారు. తనిఖీ సమయంలో పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని ఎమ్మెల్యే గమనించారు. సెలవులో ఉన్నవారు మాన్యువల్ రిజిస్టర్ నమోదు చేసినప్పటికీ, ఆన్లైన్ సిస్టమ్ లో ఎందుకు నమోదు చేయలేదని అధికారులను నిలదీశారు. ముఖ్యంగా విజిటర్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, ఇన్‌వర్డ్, అవుట్‌వర్డ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సచివాలయాల్లో విజిటర్స్ రిజిస్టర్ అసలు లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. కేవలం 2,300 ఓట్లు ఉన్న గూడవల్లి వంటి చిన్న గ్రామాల్లో 10 మంది సచివాలయ సిబ్బంది ఉండగా, దాదాపు 23,000 ఓట్లు, 50,000 జనాభా ఉన్న రామవరప్పాడు వంటి పెద్ద గ్రామాలకు కేవలం 25–30 మంది సిబ్బంది మాత్రమే ఉండటాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని హేతుబద్ధీకరించేలా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. 50,000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదని, వెలగలేరు వంటి చిన్న పల్లెటూర్లలో పీహెచ్‌సీ ఉండగా, ఇంత పెద్ద జనాభా ఉన్న రామవరప్పాడు ప్రాంతంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇక్కడ వెంటనే పీహెచ్‌సీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రామవరప్పాడు-2 సచివాలయం నిర్వహిస్తున్న అద్దె భవనం అస్తవ్యస్తంగా ఉందని, పెచ్చులు ఊడిపోయి ప్రమాదకరంగా మారిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. నెలకు రూ. 15,000 అద్దె చెల్లిస్తున్నప్పటికీ, ప్రజలు కూర్చోవడానికి కూడా స్థలం లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆగిపోయిన సచివాలయ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే కొత్త భవనాల్లోకి మారుస్తామని చెప్పారు. మార్చి నెలలో రామవరప్పాడు సచివాలయం-2లో కేవలం 38 మందికి, మరో రెండు సచివాలయాల్లో 28, 35 మందికి మాత్రమే సేవలు అందించడంపై ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో జనాభా ఉన్న చోట ఇంత తక్కువ మందికి సేవలు అందడం అంటే సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేరని అర్థమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఒక ఇంజనీర్‌ను కేటాయించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. గతంలో మండలానికి ఒక ఇంజనీర్ ఉన్నప్పుడే పనులు మెరుగ్గా సాగేవని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ఆస్తిలా ఉండాలి తప్ప, కేవలం సమస్యలకు సాక్షులుగా మిగిలిపోకూడదని అన్నారు. నిబంధనల ప్రకారం రిజిస్టర్లు నిర్వహించని వారికి మెమోలు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వచ్చే వారం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాల్లోని మొత్తం 21 సచివాలయాల సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. విజిటర్స్ రిజిస్టర్, సర్వీస్ రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల కోసం ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచిస్తూ, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా పోలీస్ శాఖలో పారదర్శక బదిలీలు – 212 మంది సిబ్బందికి మార్పులు

ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్.పి. డా. అజిత వెజెండ్ల, ఐపీస్ పారదర్శకంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన కానిస్టేబుల్ నుండి ఏఎస్సై స్థాయి వరకు మొత్తం 212 మంది సిబ్బందికి మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బదిలీలు చేపట్టారు. సీనియారిటీ, సేవా కాలం, పనితీరు ఆధారంగా నిష్పక్షపాతంగా పోస్టింగులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో సిబ్బంది అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పారదర్శక విధానం వల్ల సిబ్బందిలో నమ్మకం పెరిగిందని, శాఖలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నేడు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర సిద్దార్ధ మహిళా కళాశాలలో జాతీయ తెలుగు సాహిత్య సదస్సు

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బీపేట లోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జాతీయ తెలుగు సాహిత్య సదస్సు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ జానపద అకాడమీ తొలి అధ్యక్షులు, కళారత్న పొట్లూరి హరికృష్ణ తెలిపారు. కృత్రిమ మేధస్సు అంటే కేవలం యంత్రాల విజ్ఞానం కాదని, అది మానవ మేధో శక్తి అపరిమిత ఊహలకు ఒక సాంకేతిక ప్రతిబింబమన్నారు. నాడు గంటంతో కావ్యం వ్రాసినా, మరునాడు కీబోర్డుతో అద్భుతాలు ఆవిష్కరించినా, నేడు కృత్రిమ మేధతోడై మానవ మేధో సంపత్తికి సరికొత్త దిశా నిర్దేశం చేస్తోందని . ఈ సాంకేతిక ప్రవాహంలో భాష , సాహిత్య , జానపద కళారూపాల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న జాతీయ తెలుగు సాహిత్య సదస్సుకు సభాధ్యక్షురాలుగా కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ వి. వింధ్యవాసినీ దేవి, సభాధ్యక్షులుగా రాజమహేంద్రవరములోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడు , విశిష్ట అతిధులుగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ ,ఆత్మీయ అతిధులుగా బెనారస్ హిందూ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు . డాక్టర్ భమిడిపాటి విశ్వనాథ, విజయవాడ అర్చక ట్రైనింగ్అకాడమీ పూర్వసంచాలకులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి, వరంగల్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం, పీఠాధిపతి గడ్డం వెంకన్న లు వ్యవహరిస్తున్నారని పొట్లూరి హరికృష్ణ తెలిపారు.నేటి జాతీయ తెలుగుసాహిత్య సదస్సుకు డాక్టర్ కె వి ఎన్ డి వరప్రసాద్ , శ్రీవ్రత వాక్జరీ, ప్రవచన గార్గి డాక్టర్ అయినవోలు మంజుల , ఇందూ జగన్నాథ్ సభా సమన్వయకర్తలుగా వ్యవహారిస్తారని పొట్లూరి హరికృష్ణ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

1,999కే లివర్ టెస్ట్ – నెల్లూరులో అపోలో ఆఫర్

ఫ్యాటీ లివర్ ( కాలేయంలో కొవ్వు చేరడం ) అనేది ప్రాథమిక దశలో అంత ప్రమాదకరం అనిపించకపోయినా, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ హిమ బిందు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి. వి హెచ్చరించారు. ఈనెల 19వ తేదీనా ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అపోలో హాస్పిటల్ లో డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి. వి మీడియాతో మాట్లాడారు. ప్రారంభ దశలోనే ప్యాటీ లివర్ ను గుర్తిస్తే దానికి సంభందించిన వ్యాధులను నివారించడం చాలా సులువు అని చెప్పారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతోనే అది సాధ్యమన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అపోలో సంస్థ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టిందన్నారు. 4,400/- రూపాయల విలువైన లివర్ స్క్రీనింగ్ పరీక్షలను కేవలం 1,999/- రూపాయలకే చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ( CBC ), లివర్ ఫంక్షన్ టెస్ట్ ( LFT ), కొలెస్ట్రాల్ పరీక్ష ( Cholesterol ), లివర్ స్కాన్ ( Fibroscan ) పరీక్షలు నిర్వహించి, నిపుణులైన వైద్యుల సూచనలు, సలహాలు ( Gastro Consultation ) ఉంటాయన్నారు. ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ మే నెల 18వ తేదీ వరకూ కొనసాగుతుందని డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపాయింట్‌మెంట్ కోసం 0861-666 7 333 / 235 8 333 ఈ నంబర్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో భాగంగా ఫ్యాటీ లివర్ వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ హిమ బిందు, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి తెలియజేశారు. కొవ్వు పెరగడం వల్ల కాలేయం వాపుకు గురౌతుందని, దీర్ఘకాలం పాటు కొవ్వు పేరుకుపోవడం కారణంగా కాలేయం గట్టిపడి, శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతే కాకుండా దీనివల్ల టైప్-2 డయాబెటిస్, రక్తపోటు (BP) మరియు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని, చివరకు కాలేయం పూర్తిగా పనిచేయలేని పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలో వేయించిన పదార్ధాలు, జంక్ ఫుడ్, మిఠాయిలను తినడం తగ్గించుకోవాలని, పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు మరియు తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేర్చుకుని తినాలని సూచించారు. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే కాలేయంపై ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుందని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని వెల్లడించారు. క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ పరీక్ష తప్పనిసరి అని సూచించారు. ఈ మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.

విజయవాడ: పున్నమి ప్రతినిధి సురేష్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ డీలిమిటేషన్ పేరుతో దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలనే కుట్ర జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడిన రాజకీయ నాటకం లోక్‌సభలో పూర్తిగా బట్టబయలై అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అబద్ధాలు, కుట్రలు, రహస్య అజెండాలతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలన్న మోదీ సర్కార్ యత్నానికి పార్లమెంట్ గట్టి సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దేశ సమగ్రతకు, రాష్ట్రాల సమానత్వానికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు జనాభా ప్రమాణాల పేరుతో పార్లమెంట్ ప్రతినిధిత్వాన్ని తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రాష్ట్రానికి రావాల్సిన రాజకీయ హక్కులను కోల్పోయేలా చేసే ఈ చర్యకు మద్దతు తెలుపుతున్న ఎన్డీఏ కూటమి, వైఎస్సార్సీపీ నాయకత్వం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రమాదకర నిర్ణయమని స్పష్టం చేశారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కనిపించే బాడుగ కన్నీళ్లు కర్చే “రుదాయలి” సంప్రదాయం మాదిరిగా, ప్రజల బాధలను నాటకంగా మార్చి రాజకీయ లాభాల కోసం నకిలీ కన్నీళ్లు కారుస్తున్న పాలక వర్గాల ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారాలు ఇవ్వకుండా భావోద్వేగాలతో మోసం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనీ,ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం సీపీఐ నిరంతరం పోరాటంలో ముందుంటునదని గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ సంద్భంగా ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు అధిక చార్జీలు వసూలు చేయడం, అవసరం లేని పరీక్షలు చేయించడం, రోగులను దోపిడీ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కొంతమంది వైద్యులు, ఆసుపత్రుల అక్రమ చర్యల వల్ల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. నకిలీ వైద్యులు, అనధికారిక క్లినిక్‌లు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తక్షణం అరికట్టకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30 తేదిన డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు, జిల్లా వైద్యాధికారుల కార్యాలయాల ముందు భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలి,నకిలీ వైద్య సేవలను పూర్తిగా నిర్మూలించాలి,ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి ఉచిత, నాణ్యమైన సేవలు అందించాలి, ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్.సుభహని ఆఫీస్ బేరర్స్ కొంగర శ్రీనివాసులు,వై.బాబీ, కొన్న శ్రీనివాస్ లంకా గోవిందరాజులు పోతుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.