ఆంధ్రప్రదేశ్
హనుమంతుని పాడు జూలై 8 (కె టి సి పున్నమి ప్రతినిధి): మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం వీరరామపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకుడు ఉప్పుటూరి గురుస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన ప్రజా సంక్షేమ పాలన, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసి జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు గవదకట్ల కార్తిక్ యాదవ్, వైఎస్సార్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ దొడ్ల వెంకటేష్, గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివ, మాజీ సర్పంచ్ ఆలా శివ, ఆలా నాగేశ్వరరావు, ఉప్పుటూరి గుంటయ్య, గవదకట్ల వెంకటేశ్వర్లు, బత్తుల రాములు, ఉప్పుటూరి ఏడుకొండలు యాదవ్, ఉప్పుటూరి శ్రీను యాదవ్, మచ్చా బ్రదర్స్, మేడిబోయిన గణేష్, వైఎస్సార్సీపీ యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి కార్యకర్త ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సాదర వాతావరణంలో ముగిసింది.