Sunday, 19 April 2026

Blog

తిరుపతి

గిరిజన సాధికారతకు టిడిపి బాటలు – సుబ్బయ్యకు ఘన సత్కారం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( అణగారిన వర్గాలను అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ద్వారానే గిరిజన సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు యం. సుబ్బయ్య పేర్కొన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సుబ్బయ్యకు తిరుపతి పార్లమెంటు గిరిజన విభాగం నాయకుడు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్త కోనేరు ఎస్టీ కాలనీలో గిరిజనులు ఘన సత్కారం నిర్వహించారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం సానుకూల పరిణామమని, ఈ నియామకం గిరిజన యువతకు ప్రోత్సాహకరమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన యువ గిరిజన నాయకుడు సుబ్బయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. ఈ కార్యక్రమంలో మిన్నల్ రవి, డా. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, షేక్ నూర్ మొహమ్మద్, తుపాకుల ప్రసాద్, రమేష్, విశ్వనాథం, మునిరాజా, సుబ్బరత్న, మునెమ్మ, గంగా భవాని, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా పరశురామేశ్వరాలయ కుంభాభిషేక మహోత్సవం

ఏర్పేడు, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( ఏర్పేడు మండలంలోని గుడిమల్లం క్షేత్రంలో పురాతనమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కుంభాభిషేకంలో భాగంగా నిర్వహించే ఏడు రోజుల క్రతువులకు తొలిరోజు వేదమంత్రాల సాక్షిగా అంకురార్పణ జరిగింది. కుంభాభిషేక కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు గ్రామ దేవత అయిన శ్రీ ఏకారమ్మ తల్లి ఆజ్ఞ తీసుకొని ఉత్సవాలను మొదలుపెట్టారు. అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. స్వామి, అమ్మవార్ల అనుగ్రహం కోసం చేసే ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ధర్మపత్ని బృందమ్మ స్వామివారికి సంబంధించిన ప్రధాన కలశాలను స్వయంగా ఆలయానికి తీసుకొచ్చి అందజేశారు. అదేవిధంగా, పట్టణ వాస్తవ్యులు అమ్మవారి కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ అధికారులకు సమర్పించారు. కలశాలతో వచ్చిన బొజ్జల కుటుంబ సభ్యులకు మరియు ఇతర భక్తులకు ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం జరుగుతున్న ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు, అధికారులకు సూచించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. రాబోయే ఏడు రోజుల పాటు ఆలయంలో వివిధ హోమాలు, జపాలు, విశేష పూజలు నిర్వహించి, చివరి రోజు మహా కుంభాభిషేకంతో వేడుకలు ముగియనున్నాయి.

తిరుపతి

ఏర్పేడులో రక్తదాన శిబిరం సక్సెస్-33 మంది దాతల ఉదారత

ఏర్పేడు, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( యువత సేవా దృక్పథంతో ముందుకు వస్తే సమాజంలో మార్పు సాధ్యమని ఏర్పేడు ఎస్.ఐ. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏర్పేడు సంత మైదానంలో యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విశేష స్పందనతో విజయవంతమైంది. ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ గానుగ పెంట రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి రూయా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 33 మందికి పైగా యువకులు, స్వచ్ఛంద దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు రమేష్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆదుకోవడమే లక్ష్యంగా గత ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు, సహకరించిన ఎస్.ఐ. కి, సంస్థ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూయా బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ.. సకాలంలో రక్తం అందక ఇబ్బంది పడే పేద రోగులకు ఈ రక్తం ఎంతో ప్రాణదానం చేస్తుందని, ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రూయా సిబ్బంది షీలా, పాపు, స్వాతి, శీనుతో పాటు ట్రస్ట్ సభ్యులు శేషాద్రి, కిషోర్, నరేష్, వంశీ, వెంకటేష్, కిరణ్, ప్రకాష్, హరీష్, మురళీ, వేణు, చందు మరియు పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు.

తిరుపతి

బాల్య వివాహ రహిత జిల్లాగా తిరుపతి-ప్రగతి సంస్థ పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( బాల్య వివాహాలనే మహమ్మారిని రూపుమాపి, తిరుపతి జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రగతి సంస్థ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆదివారం సంస్థ డైరెక్టర్ కేవీ రమణ ఆధ్వర్యంలో పంచాయతీలు, పాఠశాలలు, మత పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సాధారణంగా అక్షయ తృతీయ వంటి పవిత్ర దినాల్లోనే కాకుండా, మహా శివరాత్రి వంటి పర్వదినాల సందర్భాల్లోనూ బాల్య వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ఆ సమయాల్లో అధికారులు, గ్రామస్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని కేవీ రమణ సూచించారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు ముందస్తుగా పాఠశాలలు, గ్రామ స్థాయిల్లో కమిటీలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు. వివాహానికి హాజరయ్యే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా చిన్నపిల్లలకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు భాగస్వాములైతేనే ఈ దురాచారాన్ని అరికట్టగలమని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జనసేన శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు, హోమాలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా చండీ హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించి ఆయన ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. నాయకులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొట్టే సాయి ప్రసాద్, ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ రామిశెట్టి, కుమార్, జయప్రకాశ్, గరికపాటి చంద్ర, మాధవ్ మహేష్, ఈర్ల చిరంజీవి, ఢిల్లీ బాబు, లీలాధర్, మోహన్, తేజ, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించామని, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆయన క్షేమంగా తిరిగి వచ్చి మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

తిరుపతి

కళాకారుల అభ్యున్నతికి క్లస్టర్ విధానం – దశరధాచారి సూచనలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( విజయవాడ నగరంలోని చిట్టినగర్ సొరంగం రోడ్డులోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘాల ఐక్యత కోసం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి కూర్మాచారి అధ్యక్షత వహించగా, రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. గుమ్మడిపూడి దశరధాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలు అన్నీ ఏకమై ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పంచవృత్తులకుకు చెందిన కళాకారులు తమ తమ సంఘాలుగా ఉన్నప్పటికీ, అన్ని సంఘాలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సదుపాయాలు, రుణాలు వంటి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతి జిల్లాలో క్లస్టర్లు ఏర్పాటు చేసి, సెక్షన్-8 కంపెనీల ద్వారా కార్పెంటర్లు, దారుశిల్పులు, రాతి శిల్పులు తదితర చేతివృత్తి కార్మికులను ఒక వేదికపైకి తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది డైరెక్టర్లు తమ తమ జిల్లాల్లో తొలి దశగా గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విశ్వబ్రాహ్మణులను బలోపేతం చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోడి నరసింహాచారి, పావులూరి హనుమంతరావు, రామస్వామి, కర్రీ వేణుమాధవ్, తాటికొండ రంగబాబు, ప్రసాద్, చిన్నబాబు, ధనుంజయులు, సత్యనారాయణ తదితర నాయకులు, అలాగే స్వర్ణకారులు, కార్పెంటర్లు, ఇనుప పనివారు మరియు ఇతర కళాకారులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం…. హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం…. హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జి 19 ఏప్రిల్ 2026 కేవలం 5000 అటెండెన్స్ ఫీజు కట్టకపోవడంతో విద్యార్థికి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఇవ్వని శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో బీటేక్ – 3rd Year చదివే ప్రణీత్ (22)అనే విద్యార్థి ఎప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణతతో ప్రధమ శ్రేణిలో ముందేడే విద్యార్థి…హాల్ టికెట్ ఇవ్వకపోవటంతో ఇక ఎగ్జామ్స్ రాయలేనని తీవ్ర మాస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీ ఇందు కళాశాల ముందు పలు విద్యార్థి సంఘాల ఆందోళన….. విద్యార్థిని కాలేజీ యజమాన్యం అటెండెన్స్ ఫీజు వేధింపుతోనే ఆత్మీహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మీడియా ముందు బోరున విలపించిన తల్లిదండ్రులు అటెండన్స్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వకపోవడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుని తల్లిదండ్రులు పోస్టుమార్టం చేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పమని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపి కేపీవీ.రాజు, సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు

E-పేపర్

స్నేహితుని మృతి… కుటుంబానికి ఆర్థిక సహాయం

*తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు* పున్నమి న్యూస్ ప్రతినిది తెలంగాణ ఇంచార్జి : రంగారెడ్డి జిల్లా యాచారం ఏప్రిల్ 19 పదో తరగతి బ్యాచ్‌మేట్‌ చనిపోవడంతో అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆసరాగా నిలిచారు తోటి స్నేహితులు.యాచారం మండలం,మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన మంద లింగం గత నెలలో మృతి చెందాడు.దీంతో నాటి పదో తరగతి బ్యాచ్ స్నేహితులు అంతా కలిసి జమ చేసిన రూ.23 వేల 500 రూపాయల నగదును మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అందజేశారు.మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పల్లపు విజయ్,రామలింగం,రాజు,శేఖర్,నాగరాజు,మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెళ్ళు విరిసిన మానవత్వం

E-పేపర్

ప్రైవేట్ కళాశాల వల్ల ఓ విద్యార్థి మృతి.. ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీ ఇందు కళాశాల ఫీజుల కోసం పీడుస్తున్న కళాశాల యాజమాన్యం..

ప్రైవేట్ కళాశాల వల్ల ఓ విద్యార్థి మృతి.. పున్నమి న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీ ఇందు కళాశాల ఫీజుల కోసం పీడుస్తున్న కళాశాల యాజమాన్యం.. హాల్ టికెట్ ఇవ్వలేదని బిటెక్ విద్యార్థి 3 వ సం..చదువుతున్న మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) హయత్ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. శ్రీ ఇందు కలశాలలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 30 నిమిషాల పాటు నిల్చోపెట్టి ఫీజు కట్టవలసిందే అని బెదిరింపులకు గురిచేసాడని ప్రణీత్ తండ్రి ఆరోపణ. మనస్థాపానికి చెంది ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు. హయత్ నగర్ పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తను పరామర్శించిన ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్

ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తను పరామర్శించిన ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమని చిరువెల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ స్పందించి, మండల బాధ్యులు బీవీ రమణ ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లి బాధిత కార్యకర్తను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయాన్ని అందించారు. స్థానిక నేత షేక్ కరిముల్లా విజ్ఞప్తి మేరకు U R THE POWER ఫౌండేషన్ సహకారంతో తోట పరమేశ్వరులు, కంటే శ్రీనివాస్ భరత్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.