Thursday, 9 July 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SIR ఫారాలను పూర్తి చేయండి: ఆర్డీవో

ఆత్మకూరు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఆత్మకూరు ఆర్డీవో బి. పావని క్షేత్రస్థాయిలో పర్య టిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఏఎస్పేట మండలంలోని పెద్ద అబ్బిపురం, అనుమసముద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఎల్ఎల పనితీరును పరిశీలించి, ఓటర్ల దరఖాస్తుల ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే దరఖాస్తులు అందుకున్న ఓటర్లు వాటిని త్వరగా పూర్తి చేసి బీఎల్దలకు అందజేయాలని ఆర్డీవో కోరారు.

News

సుజల గ్రామం లక్ష్యంగా తాగునీటి చర్యలు

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు కొత్త మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నీటి కొరత ఉన్న గ్రామాలను గుర్తించి అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

News

అక్రమ భూకబ్జాలపై అధికారుల దృష్టి

జిల్లాలో అక్రమ భూకబ్జాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలనలు చేపట్టారు. భూసర్వే ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలను తొలగించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ భూములను ఆక్రమించకుండా సహకరించాలని, ఎలాంటి అక్రమ నిర్మాణాల సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

E-పేపర్

కాలేశ్వర ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు .ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వర నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు అవగాహనరాయిత్యం మరియు అసమర్ధ విమర్శ బట్టబయలైందని అన్నారు.స్వంత ఖర్చులతో చీరలు కొన్న బిల్ స్లిప్పులు మరియు కాలేశ్వరం బ్యాగులను సారీస్ దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడడం జరిగింది శ్రీధర్ బాబు గారు సొంతంగా సామాన్య ప్రజలకు ఒక లడ్డు ఒక గంగాజలం బాటిల్ పెట్టి భక్తులకు ఇవ్వడం జరిగింది. నీ యొక్క క్యారీ బ్యాగ్ పై ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పోలోగ్రామ్ గాని ముఖ్యమంత్రి ఫోటో గాని ఎండోమెంట్ శాఖ మంత్రి సురేఖ గారి ఫోటో గాని పుట్ట మధు మీడియాకు చూపెట్టిన బ్యాగులపై ఫోటోలు లేవు ఇచ్చినటువంటి బ్యాగుపై ఎలాంటి ఫోటోలు లేకుండా కేవలం శ్రీధర్ బాబు గారి యొక్క ఫోటో వారి తండ్రిగారు శ్రీపాద రావు గారి యొక్క ఫోటో పెట్టి అవి భక్తులకు వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు పంపించడం జరిగింది తప్ప కాలేశ్వరం ముక్తేశ్వరాలయం సంబంధించినటువంటి ఎలాంటి నిధులు గాని ఎలాంటి శారీస్ గాని శ్రీధర్ బాబు గారు వాటి దుర్వినియోగం చేయలేదని ఈ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది. శ్రీధర్ బాబుపై విషం చీమ్ముతున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. వరుస ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెబుతున్న మదులో మార్పు రాకపోవడం శోచనీయం అని,అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుతున్న పుట్ట మధుకు రాబోవు ఎన్నికల్లో ప్రజల చేతిలో మరోసారి గుణపాఠం తప్పదని అన్నారు. డిసిసి అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య,టౌన్ ప్రెసిడెంట్ దేవన్,వైస్ చైర్మన్ శ్రీనివాస్,డిసిసి ఉపాధ్యక్షులు సుందర్, మహిళా, యూత్ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:( పున్నమి న్యూస్ )జులై 8 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పుట్ట మధుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ తదితరులతో కలిసి మాట్లాడిన కర్ణాకర్, కాలేశ్వరం నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. శ్రీధర్ బాబు తన సొంత ఖర్చులతో చీరలు కొనుగోలు చేసి, భక్తులకు ఒక లడ్డు, గంగాజలం బాటిల్ అందజేశారని తెలిపారు. భక్తులకు పంపిణీ చేసిన క్యారీ బ్యాగులపై ప్రభుత్వ హోలోగ్రామ్, ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి ఫోటోలు లేవని, కేవలం శ్రీధర్ బాబు, ఆయన తండ్రి శ్రీపాదరావు ఫోటోలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఆలయ నిధులు లేదా ఆలయ వస్తువుల దుర్వినియోగం జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తూ విషం చిమ్ముతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని బట్టు కర్ణాకర్ హితవు పలికారు. వరుస ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్నా పుట్ట మధులో మార్పు రాకపోవడం విచారకరమని, అసత్య ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి తగిన సమాధానం చెబుతారని అన్నారు.ఈ సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, టౌన్ అధ్యక్షుడు దేవన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షుడు సుందర్‌తో పాటు మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సామాజిక న్యా యానికి ఫూలే‌విగ్రహం స్ఫూర్తి

పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ రవీంద్ర…. సామాజిక న్యాయం చేకూర్చడంలో జ్యోతిరావు పూలే విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పట్నం రవీంద్ర బాబు పేర్కొన్నారు. కలిగిరి తహాశీల్దార్ ఆఫీస్ కార్యాలయం సెంటర్ లో ఏర్పాటు చేస్తున్న మహాత్మ పూలే విగ్రహం కు ట్రస్ట్ తరఫున 50 వేల రూపాయలు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా రవీంద్ర బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విద్యాపరంగా ఎన్నో పోరాటాలు చేసిన పూలే ఆశయాలు నేడు ఫలిస్తున్నాయ ని పేర్కొన్నారు నాడు ఆయన చేసిన పోరాటం తో నేడు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు విద్యలో విజయాలు సాధించి సమాజంలో అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారని బాబు తెలిపారు విద్య ద్వారానే విజయం లభిస్తుంది అన్న పూలే లక్ష్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని ఆశయంతో తన సొంత మండలం అయిన కలిగిరిలో ఏర్పాటు చేస్తున్న పూలే విగ్రహానికి ఉడత భక్తిగా తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతటి అవకాశాన్ని తనకు లభించడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ మేరకు 50 వేల రూపాయల నగదును తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య ఎమ్మార్పీఎస్ లీడర్ వెంగళరావు ఆధ్వర్యంలో విగ్రహ కమిటీకి అందజేశారు యువకుడైన పట్నం రవీంద్ర స్వచ్ఛందంగా విగ్రహ ఏర్పాటు అభినందనీయమని ఆయన ఆశయాలను ఒకరికి చెప్పడమే కాక ఆచరణలో పాటిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు రవీంద్రను అభినందించారు. కార్యక్రమం లో ట్రస్ట్ ప్రతినిధులు ఉదయ్, క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు

జనగాం

*🔥 పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుని పరామర్శించిన తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి*

పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మోకు దెబ్బ రాష్ట్ర కోఆర్డినేటర్, విహార్ ట్రస్ట్ నాయకులు మొగులూరి యాకయ్య గారి తండ్రి మొగులూరి వీర సోములు గారు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న వీర సోములు గారిని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి గారు చెన్నూరులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.* *ఈ సందర్భంగా వీర సోములు గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.* *ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న హనుమాండ్ల నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపిటిసి బొమ్మగాని భాస్కర్, పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కామారపు సునీల్, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భైరి భార్గవ్, తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.*

జనగాం

మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 07-07-2026 రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనకు సంబంధించి నిందితుడు చీపురి రాహుల్ (22), తండ్రి: యాకస్వామి, నివాసం: బొమ్మెర గ్రామం, పాలకుర్తి మండలంను పాలకుర్తి పోలీసులు అరెస్ట్ చేసి, నేడు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. దర్యాప్తులో భాగంగా, 07-07-2026 సాయంత్రం సుమారు 7:15 గంటలకు పాలకుర్తి మండలంలోని గుడివాడ చౌరస్తా వద్ద నిందితుడు TS/TG-08-AR-1911 నంబర్ గల ఇన్నోవా కారును మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి స్ప్లెండర్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పెంతల వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుండి ఆగకుండా పరారైన నిందితుడు, అదే కారుతో కొద్ది సేపటికే గూడూరు గ్రామం వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వడ్లకొండ రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో ప్రమాదం అనంతరం కూడా నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించగా, స్థానిక గ్రామస్తులు వెంటాడి బొమ్మెర గ్రామ సమీపంలో పట్టుకుని పాలకుర్తి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో నిందితుడు మద్యం సేవించినట్లు గుర్తించారు. పాలకుర్తి సీఐ జానకి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి నేడు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.

కడప

*నందలూరుశ్రీసౌమ్యనాథస్వామివార్షికబ్ర‌హ్మోత్స‌వాలగోడపత్రికలు,ఆవిష్కరణ*.నందలూరు (పున్నమి విలేఖరి)జూలై 8.

*నందలూరుశ్రీసౌమ్యనాథస్వామివార్షికబ్ర‌హ్మోత్స‌వాలగోడపత్రికలు,ఆవిష్కరణ*.నందలూరు (పున్నమి విలేఖరి)జూలై 8. భక్తులకు పటిష్ట ఏర్పాట్లు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర . జూలై 21 నుండి 31 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు జూలై 22న ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం కడప జిల్లా నందలూరులో వెలసిన ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశం మందిరంలో బుధ‌వారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూలై 21 నుండి 31 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, జూలై 21వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 22న ధ్వజారోహణం, జూలై 26న గరుడసేవ, జూలై 28న ఉద‌యం కల్యాణోత్సవం, జూలై 29న రథోత్సవం, జూలై 30న చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయ‌న్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజు వాహన సేవల సందర్భంగా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అదనంగా మొబైల్‌ మరుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, వాహన పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేపట్టాలని సూచించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో కోరారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ. శరత్, సిఈ . టి.వి. సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్ తదితరులుపాల్గొన్నారు. ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం జూలై 28వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. *ప్రతిరోజూఆధ్యాత్మిక, సాంస్కృతికకార్యక్రమాలు* బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తనున్నారు. *ఆల‌య ప్రాశ‌స్యం* ఎర్ర రాతితో నిర్మించిన సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు చోళ సంస్కృతి మరియు వాస్తుశిల్పాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు ఇది ఒక ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. ఇక్కడి విగ్రహం తిరుమల కొండల్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది, ప్రధాన విగ్రహం ‘అభయ హస్తం’లో ఉండగా, తిరుమలలో భగవంతుడు ‘కటి వరద హస్తంపోస్టులో ఉన్నాడు. ఈ ఆలయానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే, ఆలయానికి ఎటువంటి ప్రకాశవంతమైన కాంతి వనరులు లేకుండా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం రెండింటిలోనూ దేవత స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి, మీరు ప్రవేశ ద్వారం నుండే దేవతను చక్కగా చూడవచ్చు. ఆలయ పైకప్పుపై భారీ చేప చెక్కబడి ఉంది, ఒక రోజు ఈ చేప సజీవంగా మారి సముద్రంలో ఈదుతుందని నమ్మకం. *కోరిన కోర్కెలు తీర్చే దేవ‌దేవుడు :* శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం ప్రజల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా పేరుగాంచింది. గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. కోరిన కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు, 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆలయ గోడలపై 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయం పాండ్యులు, కాకతీయులు మరియు విజయనగర రాజవంశాల కాలంలో పునర్నిర్మాణానికి గురైంది. ఈ ఆలయంలో 2 చెరువులు ఉన్నాయి- ఒకటి ఆలయ ప్రాంగణం లోపల మరియు మరొకటి ఆలయం వెలుపల. మహాకవి అన్నమయ్య తన 16 సంకీర్తనలతో శ్రీ సౌమ్యనాథ స్వామిని స్తుతించాడు. ఆలయానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మండపం (వరండా) స్తంభాలు ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా స్తంభానికి దిగువన సింహాల తలలు ఉంటాయి, ఇది స్తంభానికి పైన ఉంటుంది. ఈ కారణంగానే ఈ ఆలయం కింద మరో ఆలయం ఉందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.