Sunday, 23 August 2026

Blog

పల్నాడు

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు 71 వా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

*ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు* ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండల ప్రతినిధి ఆగస్టు 22. రాజుపాలెం . పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన రాజుపాలెం గ్రామంలో శనివారం ఘనంగా జరిగాయి. సర్పంచ్ పులిబండ్ల అశోక్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చీ భారీ కేకును కోసి చిన్నారులకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పగడాల శ్రీనివాసరావు, సఖినాల ధర్మారావు, కేదారి రమేష్, చిట్టెంశెట్టి గోపి, చంద్రశేఖర్ నాయక్, చొక్కా మల్లికార్జున రావు, పెమ్మా చిన చెన్నయ్య, వసంతపు చిన వెంకటేశ్వర్లు, పులిబండ్ల అంకమ్మరావు, సమారి సైదారావు, ఆకుల కోటేశ్వరరావు, మొర్రిబోయిన రామాంజనేయులు, కాంట్రగుంట వెంకటేశ్వర్లు, పోతంశెట్టి వెంకట్రామయ్య, గుబిలి కోటేశ్వరరావు వందలాది చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

తిరుపతి

తుమ్మలగుంటలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం.. పాల్గొన్న చెవిరెడ్డి కుటుంబీకులు తిరుపతి రూరల్ ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్‌:తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు కొనసాగనున్నాయి. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబీకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే కైంకర్యాల్లో తెలియక జరిగే దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. నాలుగు రోజులూ వైదిక కార్యక్రమాలు పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, వేదపఠనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో పుట్టమట్టితో అంకురార్పణ చేపట్టారు. ఆదివారం పవిత్ర ప్రతిష్ఠ, సోమవారం పవిత్ర సమర్పణ, మంగళవారం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ప్రతిరోజూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభం

విశాఖపట్నం: (పున్నమి ప్రతినిది )ఆగస్టు 22 విశాఖపట్నం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వేదికగా డ్రాగన్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ సీయోన్ సీహెచ్. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కరాటే ఛాంపియన్‌షిప్‌లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారులు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడంతో స్టేడియం క్రీడా సందడితో మార్మోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాంశీ సుమన్ తల్వార్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. “కరాటే కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదు.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగే మార్గాన్ని చూపించే గొప్ప క్రీడ” అని ఆయన పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే హాంశీ రాజేష్ అగర్వాల్, కరాటే రంగ ప్రముఖులు కా ర్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కరాటే క్రీడకు విశాఖలో మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో డ్రాగన్స్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా కొనసాగుతోంది.

తిరుపతి

*ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.*

*హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్.* తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి నగరంలోని హోటల్స్ నందు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు హోటల్స్ లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కపిల తీర్థం వద్దగల A 2B హోటల్ ను తనిఖీ చేశారు. అందులో సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, వారి హోటల్ లోని కాలువల్లో విచ్చలవిడిగా వ్యర్థాలను వేయడం వలన వెస్ట్ వాటర్ ప్రవాహనికి ఆటంకం కల్గి దుర్వాసన రావడం, హోటల్ నుండి వచ్చే వ్యర్థాల వలన మునిసిపల్ డ్రైనేజీ బ్లాక్ అవడం మరియు ఆహరపదార్దాలు నిలువవుంచే ప్రిజ్ తుప్పు పట్టి ఉండడం గమనించి మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ను అనుసరించి వారికి పెనాలిటీ వేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ముందర వున్న హోటల్స్ ను ఆర్టీసీ బస్టాండ్ ముందున్న హోటల్స్ ను తనిఖీ చేశారు. అందులో పలు హోటల్స్ నందు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మరియు వండి మిగిలిన ఆహార పదార్థాలు ఫ్రిజ్లో సరైన ఉష్నోగ్రత పాటించక నిలువ చేసి ఉండడం, హోటల్స్ నందు కుక్కలు, పిల్లులు తిరుగుతుండడం గుర్తించారు. అవి అపరిశుభ్రతను కలిగించి, ప్రజా వినియోగానికి పనికిరానివిగా గుర్తించారు. సదురు హోటల్ లలో రైల్వె స్టేషన్ వద్ద పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించని పంజాబీ డాబా, ఇతర ఫాస్ట్ ఫుడ్ హోటళ్ళను సీజ్ చేశారు. మరో నాలుగు హోటల్స్ పై ఫుడ్ సెప్టీ అధికారులు కేసులు పెట్టడం జరిగినది మొత్తంగా 500 కేజీల పాడైనా ఆహర పదార్దాలను స్వాదినం చేసుకున్నారు. మిగతా హోటల్స్ అన్నింటికీ లోపాలను సరి చేసుకోవలసిందిగా తెలియజేస్తూ నోటీసులు జారీ చేసి, పెనాల్టీ విధించారు. వారికి ఇచ్చిన గడువు లోపల వారి లోపాలను సరి చేయకపోయినట్లయితే తదుపరి నోటీసు ఇవ్వకుండానే హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతి యాత్ర స్థలమైనందున భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా నిత్యం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఎం. జయకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వున్ననందున అనేకమంది యాత్రికులు ప్రతిరోజు దైవదర్శనానికి వచ్చి వారి తొందరలో ఏదో ఒక చోట తిని పోదాం అనుకుంటున్న సమయంలో యాత్రికులకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను సరఫరా చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. వంట తయారీకి మంచి సరుకులు వినియోగించి కల్తీ లేని నూనెలు వినియోగించి నాణ్యమైన ఆహార పదార్థాలను వేడివేడిగా సరఫరా చేయవలసిందిగా ఆదేశించారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి ప్రజలకు యాత్రికులకు నాణ్యమైన ఆహారపదార్థలు అందించాలని ఆదేశించారు. నగరంలో నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగం విషయంలో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిన హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకొని వారి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ననుసరించి చర్యలు తీసుకొన కనబడునని హెచ్చరించారు. తదుపరి కూడా రెగ్యులర్గా అన్ని హోటల్స్ నందు నాణ్యత పరిమాణాల విషయంలో రాజీ లేకుండా తనిఖీలు నిర్వహించడం,లోపాలు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకొని యాత్రికులకు, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరుపతి

*శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ*

తిరుమల ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. —————— టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

నంద్యాల

స్వచ్ఛ నంద్యాలకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు మంత్రి ఫరూక్‌ పిలుపు

నంద్యాల : నూనెపల్లిలోని పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో నంద్యాల పురపాలక సంఘం, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ నంద్యాల’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్వచ్ఛత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని, పరిశుభ్రమైన, పచ్చని నంద్యాల నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్ ఈ నాగభూషణం రెడ్డి. మెప్మా పీడీ వెంకట దాసు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్. శభరిష్. శానిటేషన్ సూపరైజర్ లక్ష్మినారాయణ. శివ ప్రసాద్ రెడ్డి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలో సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వాగతం*

విశాఖపట్నం: బ్రిక్స్ సమావేశానికి విశాఖ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన విశాఖ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే వంశీకృష్ణను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలను వంశీకృష్ణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాలలో తైక్వాండో పోటీలు రాయలసీమ జోనల్ స్థాయి పోటీలు ప్రారంభం

నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, టోర్నమెంట్ స్పాన్సర్ ఎం.బి.టీ. బాబుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్స్‌లో గుర్తింపు పొందిన క్రీడని, విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. బాలికలు ఆత్మరక్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని ఎం.బి.టీ. బాబు సూచించారు. ఆదివారం విజేతలకు బహుమతులు అందజేస్తామని రాష్ట్ర కార్యదర్శి ఎల్.టి. చంద్రమౌళి తెలిపారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు, కోచ్‌లు, 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.

నంద్యాల

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు నంద్యాలలో అభిమానుల సందడి

నంద్యాల పట్టణంలోని కాపురాక్స్ కార్యాలయం నందు మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో అభిమానుల సందడి నెలకొంది. కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. చిరంజీవి సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.చిరంజీవి నటన, సేవా కార్యక్రమాలు, అభిమానుల పట్ల చూపించే ఆప్యాయత తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అభిమానులు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్. సభ్యులు కామిని, మల్లికార్జున, చెన్నంశెట్టి శ్రీనివాసులు, సింహాద్రి, సురేష్‌బాబు, శ్రీహరి, శ్రీనివాసులు, మురళీమోహన్, సాయికుమార్, రాము, లింగం, మహేష్, సుబ్బరాయుడు, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో అభిమానులు ఉత్సాహంగా పాల్గొని చిరంజీవి జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.

నంద్యాల

స్వచ్ఛతకు ప్రజల సహకారం : జిల్లా కలెక్టర్

నంద్యాల: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ ఆవరణలో శ్రమదానం చేపట్టారు.ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, కాటన్‌ సంచులను ఉపయోగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్, డీఆర్వో రామునాయక్‌ తదితరులు శ్రమదానంలో పాల్గొని పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.