Sunday, 19 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పండుగలా

సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆత్మకూరులో పండుగలా ఆత్మకూరు పట్టణంలో ఈనెల 20న ఉదయం 8 గంటల నుండి సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైదికులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి బూత్, గ్రామ, మండల కమిటీ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ – నేరాలకు చెక్, పీడీ యాక్ట్ హెచ్చరిక

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని అధికారులు స్పష్టంగా సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజల సహకారం పోలీసులకు కీలకమని పేర్కొంటూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజా భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.

ఖమ్మం

రేపు చలివేంద్రం ప్రారంభం

ఖమ్మం, ఏప్రిల్ (పున్నమి జిల్లా ఇంచార్జీ ) భారతీయ జనతా పార్టీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ మరియు డి.వి.ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లో ఏప్రిల్ 20 సోమవారం సాయంత్రం చలివేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, ఇవి రమేష్, బీజేపీ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పేర్కొన్నారు.

ఖమ్మం

విజయానికి విద్య ఉత్తమ సాధనం

విద్య మనిషి జీవితాన్ని మార్చే గొప్ప సాధనం. విజయాన్ని చేరుకోవడానికి, మంచి జీవితం గడపడానికి విద్యే ప్రధాన మార్గం. చదువు ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్య ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకుని సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మంచి ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, ఉన్నత జీవన ప్రమాణాలు విద్య వల్ల సాధ్యమవుతాయి. అలాగే విద్య మనిషిలో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టి లక్ష్య సాధనకు కృషి చేయాలి. విద్యతోనే వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ ప్రగతి, దేశ అభ్యున్నతి సాధ్యమవుతాయి. అందుకే విద్య విజయానికి ఉత్తమ సాధనం.

ఖమ్మం

ఖమ్మం సర్వజ్ఞ జూనియర్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు

ఖమ్మం, ఏప్రిల్‌ 19: రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఖమ్మం సర్వజ్ఞ జూనియర్ కళాశాల విద్యార్థులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే. రవిబాబు అభినందించారు. ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించిన వై. వెన్నెల, ఎన్. సాయిమణికంఠర్‌, బి. తరుణ్‌, వై. అనితలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే 466 మార్కులు సాధించిన జె. అనన్య వెంకట్‌, జి. జానకీరామ్‌, వై. గీత మాధురిలను అభినందించారు. బైపీసీ విభాగంలో ఐ. సాయిదివ్యనాథ్‌ (437), జ్ఞానప్రసూనాంబి (435), ఎన్‌. అభినందిత (434) ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కళాశాల చైర్మన్ ఆర్వీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ, రెండుదశాబ్దాలుగా ఉత్తమ విద్యాబోధనతో సర్వజ్ఞ క్యాంపస్ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్‌, ఫిజిక్స్ ఫ్యాకల్టీ జార్జ్‌, కళాశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఖమ్మం

సింగరాయపాలెంలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం

సింగరాయపాలెం గ్రామంలోని PM SHRI జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ నెల 23-04-2026 తేదీన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, మార్కులు, ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, పిల్లల బలాలు మరియు మెరుగుపరచాల్సిన అంశాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించనున్నారు. అలాగే వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా చదువు కార్యక్రమాలు, సృజనాత్మక అభిరుచులు, శారీరక వ్యాయామాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధి కోసం ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా హాజరుకావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు.

E-పేపర్

శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం

శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం పున్నమి న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా రేపు 20.04.2026 సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది ఈ పవిత్ర కార్యక్రమం బ్రహ్మశ్రీ ప్రవీణ్ కుమార్ శర్మ పౌరోహిత్యంలో శాస్త్రోక్త మార్గదర్శకత్వంలోనిర్వహించబడుతుంది. ఈ శుభ సందర్భంలో గ్రామ భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమ వివరాలు ముహూర్తం: ఉదయం 7:30 గంటలకు వేదిక: నక్కర్త హనుమాన్ దేవాలయ ప్రాంగణం పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ జరుగును మన గ్రామ దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో మనమందరం భాగస్వాములై స్వామి వారి కృపకు పాత్రులమవుదాం ఇట్లు హనుమాన్ దేవాలయ కమిటీ&గ్రామ పెద్దలు

E-పేపర్

శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం

శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం పున్నమి న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా రేపు 20.04.2026 సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది ఈ పవిత్ర కార్యక్రమం బ్రహ్మశ్రీ ప్రవీణ్ కుమార్ శర్మ పౌరోహిత్యంలో శాస్త్రోక్త మార్గదర్శకత్వంలోనిర్వహించబడుతుంది. ఈ శుభ సందర్భంలో గ్రామ భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమ వివరాలు ముహూర్తం: ఉదయం 7:30 గంటలకు వేదిక: నక్కర్త హనుమాన్ దేవాలయ ప్రాంగణం పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ జరుగును మన గ్రామ దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో మనమందరం భాగస్వాములై స్వామి వారి కృపకు పాత్రులమవుదాం ఇట్లు హనుమాన్ దేవాలయ కమిటీ&గ్రామ పెద్దలు

E-పేపర్

శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం

శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన (భూమి పూజ) మహోత్సవం పున్నమి న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా రేపు 20.04.2026 సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది ఈ పవిత్ర కార్యక్రమం బ్రహ్మశ్రీ ప్రవీణ్ కుమార్ శర్మ పౌరోహిత్యంలో శాస్త్రోక్త మార్గదర్శకత్వంలోనిర్వహించబడుతుంది. ఈ శుభ సందర్భంలో గ్రామ భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమ వివరాలు ముహూర్తం: ఉదయం 7:30 గంటలకు వేదిక: నక్కర్త హనుమాన్ దేవాలయ ప్రాంగణం పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ జరుగును మన గ్రామ దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో మనమందరం భాగస్వాములై స్వామి వారి కృపకు పాత్రులమవుదాం ఇట్లు హనుమాన్ దేవాలయ కమిటీ&గ్రామ పెద్దలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు

SPS నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ అమలు చేయడం, నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.