Thursday, 9 July 2026

Blog

కృష్ణా

విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 విజయవాడ.. నాలుగు గంటలుగా విజయవాడలో కొనసాగుతున్న NIA సోదాలు. విజయవాడలో సోహైల్ బెగ్ నివాసంలో ముగిసిన NIA సోదాలు. సోహైల్ బెగ్ తల్లి,తండ్రుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న NIA అధికారులు. తల్లి తండ్రుల స్టేట్మెంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించిన NIA అధికారులు. మహమ్మద్ దానిష్, మహమ్మద్ రహంతుల్లా నివాసంలో ఇంకా కొనసాగుతున్న సోదాలు. భారీ భద్రత నడుమ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న NIA అధికారులు… ISIS,IQIS తో సంబంధాలు ఉన్నాయనె కోణంలో ఇప్పటికీ ఇదే కేసులో 12 మందిపై కేసు నమోదు కాగా 11 మంది అరెస్టు… నిందితులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.. END

తూర్పు గోదావరి

రైతాంగానికి ఊరట కల్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి తూర్పుగోదావరి జిల్లా జులై 8: తాళ్లపూడి మండల పరిధిలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఖరీఫ్ పంటకు నీటి విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు పండితులు వేద మంత్రాలు చదువుతుండగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల ద్వారా కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు, ప్రముఖులు మరియు విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనివల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు (ఈఈ) బి. యేసు బాబు, (డిఈ) ఎన్. రామేశ్వర్ నాయుడు, టి.అప్పారావు, (ఎఈఈ) వై. హర్షవర్ధన్, ఈ. శ్రీనివాసులు, సి హెచ్. భార్గవ్ శంకర్ నాయకులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్ల వెంకట రాజు, బొరగం శ్రీనివాస్,తాళ్లపూడి ఏం.ఆర్.ఓ లక్ష్మీ లావణ్య,రాజమండ్రి పార్లమెంటరీ అధికార ప్రతినిధి నామన పరమేశ్వరరావు,తాళ్లపూడి మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు సిద్ధ దుర్గారావు,కైకాల శ్రీనివాస్, సూరపనేని చిన్ని, గన్నిన సత్తిబాబు, కొప్పాక కోట్నిస్, తాళ్లపూడి ఏం.ఆర్.ఓ లక్ష్మీ లావణ్య,నామా నరేంద్ర కుమార్, కందుల నాగు, అనపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల కావడంతో ఖరీఫ్ పంట సాగుకు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేసి మంత్రికి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాకినాడ

విపత్తుల యజమాన్యం పై అవగాహన కలిగి ఉండాలి

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో బుధవారం వరదలు మరియు తుఫానుల నుంచి తప్పించుకునేందుకు విపత్తుల యజమాన్యంపై అర్థ సంవత్సర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న ఝాన్సీ మాట్లాడుతూ విపత్తుల యజమాన్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త జి రామయ్య శెట్టి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు ముందస్తు సిద్ధపాటు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తవిటికి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ముందు,ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో,ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనంతరం చేపట్టవలసిన పలు చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని స్త్రీ, పురుషులు పాల్గొన్నారు.

కాకినాడ

విపత్తుల యజమాన్యం పై అవగాహన కలిగి ఉండాలి

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో బుధవారం వరదలు మరియు తుఫానుల నుంచి తప్పించుకునేందుకు విపత్తుల యజమాన్యంపై అర్థ సంవత్సర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న ఝాన్సీ మాట్లాడుతూ విపత్తుల యజమాన్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త జి రామయ్య శెట్టి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు ముందస్తు సిద్ధపాటు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తవిటికి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ముందు,ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో,ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనంతరం చేపట్టవలసిన పలు చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని స్త్రీ, పురుషులు పాల్గొన్నారు.

కాకినాడ

విపత్తుల యజమాన్యం పై అవగాహన కలిగి ఉండాలి

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో బుధవారం వరదలు మరియు తుఫానుల నుంచి తప్పించుకునేందుకు విపత్తుల యజమాన్యంపై అర్థ సంవత్సర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న ఝాన్సీ మాట్లాడుతూ విపత్తుల యజమాన్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త జి రామయ్య శెట్టి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు ముందస్తు సిద్ధపాటు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తవిటికి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ముందు,ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో,ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనంతరం చేపట్టవలసిన పలు చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని స్త్రీ, పురుషులు పాల్గొన్నారు.

కాకినాడ

మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలి

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జెండర్ కమిటీ సభ్యులకు మరియు మహిళా పీర్ గ్రూప్ సభ్యులకు చట్టాలు,ప్రయోజనాలు మరియు పరిష్కార యంత్రాంగంపై అర్థ సంవత్సర సమర్థతల నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలని,తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా గృహహింస నిరోధక చట్టం, ఫోక్సో చట్టం,వరకట్న నిరోధక చట్టం,బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజిత మాట్లాడుతూ చట్టాల ఫలితంగా లభించే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విమల,జ్యోతి మాట్లాడుతూ మహిళా సమస్యలు పరిష్కార యంత్రాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని స్త్రీ పురుషులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గోదావరికి ఎట్టకేలకు వరద..!

ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం. దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.

రాజన్న సిరిసిల్ల

SIR-2026 ఓటర్ల జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించిన బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు కొమ్ము బాలయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్, జూలై 8: SIR-2026 కార్యక్రమంలో భాగంగా గ్రామాలతో పాటు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. బీఎల్‌ఓలతో కలిసి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఓటర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు, మార్పులు, చేర్పులు లేదా తొలగింపులు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు అభ్యంతరాలు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు మరియు మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

అనకాపల్లి

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్.. ఘనంగా 77వ జయంతి వేడుకలు…!

ఏటికొప్పాకలో విగ్రహానికి నివాళులు.. కేక్ కట్ చేసి సేవలను స్మరించిన నాయకులు… అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి, జూలై 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చింతలపాటి వెంకట సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం రంగాల్లో వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా ఆయనను స్మరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

ఆదిలాబాదు

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కరోనా ఓపీ ఎదుట బుధవారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధ్యక్షుడు నల్ల శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రే చందు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేసి కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడాది పాటు నిరంతరంగా పనిచేసే ప్రతి కార్మికుడికి ఒక నెల వేతనానికి సమానమైన బోనస్ ఇవ్వాలని, పండుగ సెలవులు, ఆర్జిత సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ శానిటేషన్ కార్మికులకు పేషెంట్ కేర్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని కోరారు. కొత్త కాంట్రాక్టర్‌ను నియమించడంతో పాటు కార్మికులకు యూనిఫాంలు, నెలనెలా వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితర హక్కులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎండి ముజీబ్, ఎస్.కె. ఇక్బాల్, దత్తాత్రి దాస్, పెందూర్ దిలీప్, నిట్టెడి నగేష్, ఇప్ప శ్రీను, జి. సంగీత, నర్సమ్మ, కమల, పద్మ, బి. లక్ష్మి, ఇర్ఫాన్, వెంకటేష్, విఠల్, సురేష్, రమేష్, పులి సునీత, రమతో పాటు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.