Sunday, 19 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

*చిన్న ఆవుటపల్లిలో ‘జలధార – జల హారతి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర,విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*

*స్వయంగా పలుగు, పారా పట్టి నీటి గుంతలు తవ్విన మంత్రి కొల్లు, ఎమ్మెల్యే యార్లగడ్డ* గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం నియోజకవర్గం చిన్న ఆవుటపల్లి గ్రామంలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా “జలధార – జల హారతి” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వయంగా పలుగు, పారా పట్టి నీటి గుంతలను తవ్వారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జల మట్టాన్ని సగటున 6 మీటర్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్షపు బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఎంక్వైరీ చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని, దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గన్నవరం అభివృద్ధినే అజెండాగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల కారణంగా చెరువుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని 36 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, మైనింగ్ నిధుల ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలు తమ పొలాలు, ఇళ్ల స్థలాలు మెరక చేసుకునేందుకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా మట్టిని తరలించుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గన్నవరం ప్రాంతంలో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సుమారు 9 వేల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేంద్ర నిధులతో సీ-డాక్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీవో 30 ద్వారా మంగళగిరి తరహాలో గన్నవరంలో 900 మందికి ఇళ్ల పట్టాలు అందజేసి, మరింత మందికి పంపిణీకి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పి నైనవరం గ్రామంలో కృష్ణ యూనివర్సిటీ కోసం భూమి కేటాయించినట్లు, నియోజకవర్గవ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

*చిన్న ఆవుటపల్లిలో ‘జలధార – జల హారతి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర,విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*

*స్వయంగా పలుగు, పారా పట్టి నీటి గుంతలు తవ్విన మంత్రి కొల్లు, ఎమ్మెల్యే యార్లగడ్డ* గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం నియోజకవర్గం చిన్న ఆవుటపల్లి గ్రామంలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా “జలధార – జల హారతి” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వయంగా పలుగు, పారా పట్టి నీటి గుంతలను తవ్వారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జల మట్టాన్ని సగటున 6 మీటర్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్షపు బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఎంక్వైరీ చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని, దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గన్నవరం అభివృద్ధినే అజెండాగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల కారణంగా చెరువుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని 36 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, మైనింగ్ నిధుల ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలు తమ పొలాలు, ఇళ్ల స్థలాలు మెరక చేసుకునేందుకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా మట్టిని తరలించుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గన్నవరం ప్రాంతంలో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సుమారు 9 వేల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేంద్ర నిధులతో సీ-డాక్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీవో 30 ద్వారా మంగళగిరి తరహాలో గన్నవరంలో 900 మందికి ఇళ్ల పట్టాలు అందజేసి, మరింత మందికి పంపిణీకి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పి నైనవరం గ్రామంలో కృష్ణ యూనివర్సిటీ కోసం భూమి కేటాయించినట్లు, నియోజకవర్గవ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

*హజ్ యాత్రికులకు పచ్చజెండా ఊపి వీడ్కోలు పలికిన మంత్రులు ఎన్.ఎం.డి.ఫరూఖ్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు*

గన్నవరం నియోజకవర్గ పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయల్దేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులను నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. గన్నవరం ఎస్.ఎం. కన్వెన్షన్ హాల్‌లో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఎన్.ఎం.డి. ఫరూఖ్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం పచ్చ జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మక్కా యాత్రను జీవితంలో ఒక్కసారైనా చేయాలనే కోరిక కలిగి ఉంటారని తెలిపారు. అలాంటి హజ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారు 1,987 మంది యాత్రకు బయల్దేరగా, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి 353 మంది వెళ్ళటం ఆనందకరమన్నారు. మైనార్టీల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఇమామ్‌లు మరియు మౌజంలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఆర్థిక పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలో హజ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, అల్లా కృప రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్

*నగరాభివృద్ధిపై చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులు సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు లంకా గోవిందరాజులు ఆగ్రహం.*

విజయవాడ : పున్నమి ప్రతినిధి సురేష్ శుక్రవారం 29వ డివిజన్ నేతాజీ రోడ్, మధురానగర్‌లోని చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో గోగా కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన సిపిఐ పార్టీ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎంపీని ప్రజలు ఎంతో నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపిస్తే, నేడు నగర ప్రజల ఆకాంక్షలను వారు తుంగలో తొక్కుతున్నారు అని విమర్శించారు. ఇప్పుడున్న ​విజయవాడను ‘గ్రేటర్ విజయవాడ’గా మారుస్తామని పాలకులు దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమయ్యారు. దీనికి అధికారికంగా చట్టబద్ధత కల్పించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రేటర్ హోదా లేకపోవడం వల్ల కేంద్రం నుండి వచ్చే భారీ నిధులను నగరం కోల్పోతోందని, తక్షణమే చట్టబద్ధత కల్పించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ​ ​అమరావతి అభివృద్ధిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే, రాజధాని ప్రాంతానికి వేల కోట్లు కేటాయిస్తూ, దానికి ప్రధాన కేంద్రమైన విజయవాడను విస్మరించడం ఎంతవరకు సమంజసం? కేంద్రం ఇచ్చే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి, విజయవాడకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నగర నిధుల కోసం ఎందుకు గొంతు ఎత్తడం లేదని నిలదీశారు. ​2024లో బుడమేరు వరదలు నగర ప్రజలను నిలువునా ముంచాయి. మళ్లీ వర్షాకాలం సమీపిస్తున్నా, ముంపు నివారణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు. ​29వ డివిజన్ కార్యదర్శి యాదల శివ మాట్లాడుతూ, నగరంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. ​ విజయవాడ నగరం తన ప్రాశస్త్యాన్ని కోల్పోకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, తక్షణమే అభివృద్ధి నిధులు విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని లంకా గోవిందరాజులు స్పష్టం చేశారు. ​ఈ సమావేశంలో సిపిఐ డివిజన్ సహాయ కార్యదర్శులు ఎస్.కె. సుభాని, గోగా నవీన్, కమిటీ సభ్యులు ఎస్.కె. షాదిక్, నివగాని కుమార్, ఒంగోలు రాజు, యారాబటి జగదీష్, పి. శ్రీనివాసరావు, సగ్గుర్తి రామకృష్ణ, మణెమ్మ, భారతి, లక్ష్మి, సుంకర దుర్గ, సింహాచలం మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: గన్నవరం సి.ఐ.

​పొట్టిపాడు (గన్నవరం నియోజకవర్గం): పున్నమి ప్రతినిధి సురేష్ స్థానిక గ్రామంలో పొట్టిపాడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిఖిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖులు ఘనంగా ప్రారంభించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సేవా స్ఫూర్తితో, యలమర్తి అర్లప్ప మరియు గుడ్డేటి సుధాకర్ జ్ఞాపకార్థం తో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ సతీష్ బాబు, ఉంగుటూరు మండల అధ్యక్షులు కొలుసు రవీంద్ర, కుందేటి చంద్రశేఖర్, PACS చైర్మన్ అట్లూరి జోషి మధు, గుడ్డేటి సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి నిఖిల్ ముందుండి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాల్గొన్న వారు: గ్రామ పార్టీ అధ్యక్షులు ఈసరి రవి, మహిళా అధ్యక్షురాలు పొదిలి మధులత, విద్యా కమిటీ చైర్మన్ కాండ్రు రమేష్, ఎక్స్ ఎంపీటీసీ కడియాల శ్రీను, ఎక్స్ సర్పంచ్ గుండపనేని శ్రీధర్, సర్పంచ్ కత్తుల బోస్, సీతయ్య, తమలం నాని మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చందనోత్సవం మీడియా పాసులపై ఎల్‌ఎన్‌ఏ వినతి అన్ని పత్రికలకు పాసులు – దర్శనానికి అవకాశం కల్పించాలి

విశాఖపట్నం, పున్నమి ప్రతినిధి (ఏప్రిల్‌ 18): శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా మీడియా పాసులను దినపత్రికలతో పాటు పిరియాడికల్స్‌కు కూడా జారీ చేయాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్‌ఎన్‌ఏ) ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎం. ఆబిశక్త్ కిషోర్‌ను కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి, మీడియా పాసులు కేవలం కవరేజ్‌కే పరిమితం చేసి దర్శనానికి అనుమతి లేదనే ప్రచారం జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్, మీడియా పాసులు అందరికీ జారీ చేస్తామని, దర్శనం కోసం ప్రత్యేకంగా ఉచిత టికెట్లు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్లు వెంటనే జారీ చేయాలి ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో స్థానిక పత్రికలకు అన్యాయం జరుగుతోందని ఎల్‌ఎన్‌ఏ ఆరోపించింది. పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్లను తక్షణమే జారీ చేయాలని మరో వినతి పత్రంలో కోరింది. ఎంక్వైరీ కమిటీ రద్దు చేయాలి నేషనల్ న్యూస్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విచారణ కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తప్పుడు ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదని పేర్కొంది. అక్రిడిటేషన్ కమిటీ మెజారిటీ సభ్యులకు కూడా దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరగా, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఎన్‌ఏ అధ్యక్షుడు పి. సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే గాజువాక అధ్యక్షుడు కె. పరశురాం, జాప్ జిల్లా అధ్యక్షుడు కె.ఎం. కీర్తనరావు, ఏఎస్‌ఎంఎన్‌ఐ మొల్లి కమల్ కుమార్‌తో పాటు పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పల్లాకు అభినందనల వెల్లువ రాష్ట్ర నలుమూలల నుంచి శుభాకాంక్షలు

గాజువాక, ఏప్రిల్ 18 (పున్నమి ప్రతినిధి): రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ సీనియర్ నేతలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గాజువాక పార్టీ కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కే. రత్నకుమారి, నూకాంబిక ఆలయ కమిటీ డైరెక్టర్ పొలిమేర ఆనంద్ కుమార్ తదితరులు పల్లాను ఘనంగా సన్మానించారు. బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగి రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థాయికి చేరుకోవడం ఉమ్మడి విశాఖ జిల్లాల ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని నేతలు పేర్కొన్నారు. నిగర్వి, సౌమ్య స్వభావంతో నిస్వార్థ రాజకీయాలకు నిలువుటద్దంగా నిలుస్తూ ప్రజలకు అండగా ఉంటున్న పల్లా సేవలు అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని పల్లాకు అందజేశారు. కార్యక్రమంలో కాయల ప్రసన్న, కురాకుల భారతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గాజువాక మహిళా పరిరక్షణ విభాగ చైర్మన్‌గా జాగరపు హరిత నియామకం

విశాఖపట్నం గాజువాక ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 73వ డివిజన్ సనత్‌నగర్‌కు చెందిన జాగరపు హరిత (బి.టెక్)ను గాజువాక నియోజకవర్గ మహిళా పరిరక్షణ విభాగ చైర్మన్‌గా నియమిస్తూ ఏఐహెచ్‌ఆర్పీ ఫౌండర్ శ్రీ సిరాజుద్దీన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళా సంఘాల ఫోరం జిల్లా, రాష్ట్ర సభ్యులు హరితను అభినందించారు. మహిళల భద్రత, గౌరవం కాపాడటంలో ఈ నియామకం కీలకమని అభిప్రాయపడ్డారు. హరిత మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలను అరికట్టడం అత్యవసరమని తెలిపారు. మహిళలకు న్యాయం జరిగేలా, వారి హక్కులు రక్షించబడేలా కృషి చేస్తానన్నారు. యువతిలో అవగాహన పెంచడం, మహిళల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తన లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, అవసరమైన చోట చట్టపరమైన సహాయం అందించేందుకు ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఈ నియామకంపై స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హరితకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సేవలతో సమాజంలో మహిళల భద్రత మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతి

సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాణశాలలో శనివారం నాడు హైదరాబాద్ చెందిన హెటిరో డ్రగ్స్ సంస్థ బి. ఫార్మసీ మరియు యం. ఫార్మసీ విద్యార్థులకు ప్రొటెక్షన్, నాణ్యత నిర్ధారణ మరియు ఔషధ నాణ్యత పరీక్ష అను విభాగాలలో ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. ఈ నియామకాలలో హెటిరో డ్రగ్స్ సంస్థ తరపున హెచ్ ఆర్ మేనేజర్ అడవి రాముడు పాల్గొని విద్యార్థులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారాం 20 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ తరపున 2.8 లక్షలు వార్షిక వేతనంగా అందజేయనున్నట్లు కళాశాల అకడమిక్ డైరెక్టర్ లక్ష్మయ్య తెలిపారు. ఈ నియామకాలలో సుమారు 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను అందచేసారు. ఈ కార్యక్రములో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజు, ప్లేస్మెంట్ కో-ఆర్డినేటర్ పవన్ కుమార్ పాల్గొన్నారు .

ఖమ్మం

పరీక్ష ఫలితం స్టేజ్ దాటడానికి మాత్రమే… జీవితం కాదు!

ఇంటర్‌ ఉత్తీర్ణతలో ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు రావడం వల్ల విద్యార్థులు నిరాశ చెందొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు జీవితంలో ఒక భాగమే కానీ భవిష్యత్తుకు ముగింపు కాదని పేర్కొన్నారు. మార్క్‌షీట్‌లో పడిన కొన్ని సంఖ్యలు మన ప్రతిభను నిర్ణయించవని తెలిపారు. ఓటమిని పాఠంగా తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తే విజయాలు సాధ్యమని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై ఒత్తిడి చేయకుండా ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉందని, ఒక పరీక్ష ఫలితంతో జీవితాన్ని అంచనా వేయరాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. సహనం, పట్టుదలతో ముందుకు సాగితే మంచి అవకాశాలు ఎదురవుతాయని తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.