కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో బుధవారం వరదలు మరియు తుఫానుల నుంచి తప్పించుకునేందుకు విపత్తుల యజమాన్యంపై అర్థ సంవత్సర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న ఝాన్సీ మాట్లాడుతూ విపత్తుల యజమాన్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త జి రామయ్య శెట్టి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు ముందస్తు సిద్ధపాటు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తవిటికి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ముందు,ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో,ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనంతరం చేపట్టవలసిన పలు చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని స్త్రీ, పురుషులు పాల్గొన్నారు.

విపత్తుల యజమాన్యం పై అవగాహన కలిగి ఉండాలి
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో బుధవారం వరదలు మరియు తుఫానుల నుంచి తప్పించుకునేందుకు విపత్తుల యజమాన్యంపై అర్థ సంవత్సర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న ఝాన్సీ మాట్లాడుతూ విపత్తుల యజమాన్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త జి రామయ్య శెట్టి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు ముందస్తు సిద్ధపాటు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తవిటికి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ముందు,ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో,ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనంతరం చేపట్టవలసిన పలు చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని స్త్రీ, పురుషులు పాల్గొన్నారు.

