Monday, 20 April 2026

Blog

తిరుపతి

తాజ్ హోటల్‌లో ‘లెజెండ్’ బాలకృష్ణను మర్యాదపూర్వక కలిసిన జనసైనికుకు నవీన్ కుమార్.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి నవీన్ కుమార్ టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్.. బాలకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తూనే, రాజకీయాల్లోనూ ప్రజా సేవకు అంకితమైన బాలయ్యను కలవడం పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

బడుగు వర్గాలకు టిడిపిలో ప్రాధాన్యం మరింత బలోపేతం- డా. ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వస్తోందని టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పార్టీ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. టిడిపి జాతీయ, రాష్ట్ర కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించడం శుభపరిణామమని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన డా.జి. దశరథాచారి, యం. సుబ్బయ్యలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించడం ద్వారా బడుగు వర్గాల పట్ల పార్టీ నిబద్ధత మరోసారి రుజువైందన్నారు. శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పక్షపాతిగా నిలుస్తున్నారని, ఈ నియామకాలు దానికి నిదర్శనమని తెలిపారు. అలాగే పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం నాయకత్వం ప్రత్యేకతగా కొనియాడారు. రాష్ట్ర కమిటీలో 185 మంది సభ్యుల్లో 122 మందిని బడుగు వర్గాలకు చెందిన వారిగా ఎంపిక చేయడం ద్వారా సామాజిక సమతుల్యత సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

వెంకటరామయ్య భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు నివాళి

ఏర్పేడు, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పల్లం గొల్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్కుపల్లి వెంకటరామయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటరామయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అంత్యక్రియల్లో మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్‌తో పాటు జనార్దన్ యాదవ్, వెంకటేశ్వర యాదవ్, మునయ్య, కన్నయ్య యాదవ్, రామకృష్ణ, భాస్కర్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఎంజీఎం స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. కిండర్ గార్డెన్ నుండి లోయర్ స్కూల్‌కు, లోయర్ స్కూల్ నుండి హయ్యర్ స్కూల్‌కు ప్రమోషన్ పొందిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్‌లు, టోపీలు ధరించి విద్యా ప్రయాణంలో తొలి మైలురాయిని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చేస్తూ వేడుకలను కోలాహలంగా మార్చారు. గ్రాడ్యుయేషన్ గౌన్‌లు, టోపీలతో చిన్నారులు కొత్త దశలోకి అడుగుపెడుతున్న సందేశాన్ని ప్రతిబింబించారు. కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ..విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ఆ దిశగా అభివృద్ధి చెందేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ వేడుకలో స్కూల్ హెడ్మాస్టర్ ముని రత్నం నాయుడు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

మహిళా రిజర్వేషన్ బిల్లుకు శ్రీకాళహస్తిలో మద్దతు ర్యాలీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ పార్లమెంట్ సభల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బేరి వారి మండపం నుండి నాలుగు వీధుల మీదుగా జరిగిన ఈ ర్యాలీలో ప్రధాన అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ నారీశక్తిగా ఎదుగుతున్న వేళ, చట్టసభలలో వారికి 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కండ్రిగ ఉమ, చాగణం శైలజ, ఉమా సింగ్, అంకమ్మతో పాటు జిల్లా, మండల స్థాయి పదాధికారులు, మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి భక్తులకు శుభవార్త: రూ. 100 లకే రాహు-కేతు పూజ!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యం, స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా రూ.500 రాహు-కేతు పూజను రద్దు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో స్థానిక పేద ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో శ్రీకాళహస్తి పట్టణం, మండల పరిధిలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి బుధవారం కేవలం రూ.100లకే సామూహిక రాహు-కేతు పూజ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే విశిష్ట సేవలలో భాగంగా ఉన్న రూ.5,000 రాహు-కేతు పూజ టికెట్ ధరను రూ.6,000కు సవరించినట్లు పేర్కొన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా దర్శన సమయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడులో పోలీసుల అవగాహన కార్యక్రమం

దుత్తలూరు నందిపాడు Date 16-4-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) నందిపాడు సెంటర్‌లో పోలీసులు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) వెంకటరావు గారు, సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఆదిలక్ష్మి గారు పాల్గొని ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రమాదాల తగ్గుదలకు దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, గ్రామస్తులు పాల్గొని పోలీసుల సూచనలు శ్రద్ధగా విన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

అనకాపల్లి

ఇంటర్‌లో మెరిసిన రేపపోలవరం విద్యార్థులు.. అతిథ్యము హారులతో సత్కారం

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్ ప్రతినిధి): రేపపోలవరం గ్రామానికి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరచి గ్రామానికి గర్వకారణమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు విద్యార్థులను హారాలతో సత్కరించి అభినందించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

News

దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధం – ప్రజలే వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్): దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈసారి స్వీయ నమోదు (Self Enumeration) విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. https://se.census.gov.in⁠� వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. మొబైల్ నంబర్‌కు OTP ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. నమోదు పూర్తయిన తర్వాత ప్రత్యేక ID ఇవ్వబడుతుంది. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అధికారులు అవసరమైన సహాయం అందిస్తారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందని, ఖచ్చితమైన డేటా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

అనకాపల్లి

అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు నిర్లక్ష్యంపై హైకోర్టు ఉగ్రం

అనకాపల్లి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్): అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న రహదారి దయనీయ స్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీఆర్ బాండ్ల ద్వారా కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని న్యాయస్థానం గమనించింది. రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో గుంతలు, దుమ్ము వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. స్థానిక ప్రజలు, వాహనదారులు త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.