Monday, 20 April 2026

Blog

అనకాపల్లి

విజయవాడలో టీడీపీ శిక్షణ తరగతులు

విజయవాడ, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్): రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు విజయవాడలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించాలని నాయకులు సూచించారు. కార్యకర్తలు ప్రజలతో మమేకమై పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గోదావరి గట్టు రోడ్డు పై చెత్త సంచుల గుట్టలు – ప్రమాదానికి నాంది పలుకుతున్న ప్రక్కిలంక మలుపు

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి ప్రక్కిలంక, ఏప్రిల్ 16: ప్రక్కిలంక గ్రామంలో ఆంజనేయస్వామి గుడి సమీపంలోని మలుపు వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన కిందకు దిగే ప్రాంతంలో చెత్త సంచులు గుట్టలుగా పేరుకుపోవడంతో అక్కడి పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది.ముందుగా ఎటువంటి ప్రమాదం జరగకూడదని స్థానికుల సమాచారం ప్రకారం, రోడ్డు మలుపు వద్దనే ఈ సంచులు గుట్టలు ఉండడం వల్ల వాహనదారులకు దృష్టి మాయమవుతూ ప్రమాదాలకు అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు పక్కన గట్టుగా పేరుకున్న సంచులు, వ్యర్థాలు ఎప్పుడైనా కిందకు జారిపడే ప్రమాదం కూడా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతూ, ఈ చెత్తను తక్షణమే తొలగించి రహదారిని శుభ్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం

మట్టి ముద్దును చూసి మనిషి నేర్చుకోవలసిన జీవిత సత్యం.

మట్టి లేకుండా మనిషికి నిలబడే స్థానం లేదు అనే గర్వం తనకు ఉండదు, కానీ అదే సమయంలో కంఫర్ట్‌లోనే ఉండిపోవడం సరికాదు. మట్టిముద్ద మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది—అది తన స్థలం వదిలి, ఎవరైతే మలుస్తారో వారి చేతిలోకి వెళ్లి, ఎంత కష్టాలు పెట్టినా భరిస్తూ, తనను కొత్త రూపంలోకి మార్చుకుంటుంది. ఆ సహనం, మార్పు వల్లనే అది కుండలు, పాత్రలు, పూలదానాలుగా మారి మనకు ఆనందాన్ని అందిస్తుంది. ఆ పాత్రల్లో పూలను చూసినప్పుడు మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం కలుగుతుంది. బయటకు సాధారణంగా కనిపించినా, వాటి వెనుక ఉన్న కష్టం వాటి విలువను తెలియజేస్తుంది. మనం వాటిని ఎంత ప్రేమిస్తామో, అవి అంతకాలం మన జీవితాన్ని ఆనందంతో నింపుతాయి.

రాజన్న సిరిసిల్ల

ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ

ఇల్లంతకుంట. ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినధి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలానికి వచ్చే వేలాది మంది ప్రజలు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు BTR (Bendram Thirupati Reddy) ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మజ్జిగ తీసుకుని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న కుమార్, బొల్లం రాంసాగర్, కమల్ల ఎల్లెష్, మ్యకల మల్లేశం, దూది వెంకట్ రెడ్డి, చిత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

11వ వార్డులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం!

11వ వార్డులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం! కొత్త మోటారు ఏర్పాటు – కాలనీ ప్రజల కష్టాలకు ముగింపు పున్నమి న్యూస్ ప్రతినిధి 16 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త లో 11వ వార్డులో చాలా కాలంగా నెలకొన్న నీటి కొరత సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కోసం రోజూ గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై పలుమార్లు స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ప్రజల బాధలను అర్థం చేసుకున్న 11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర్ & జంగయ్య సమస్యను సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టారు. కాలనీ పరిస్థితిని పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లు చేసి కొత్త మోటారు ఏర్పాటు చేయించారు. ఈ కొత్త మోటారు ఏర్పాటు వల్ల ఇప్పుడు కాలనీకి సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. చాలా కాలంగా నీటి కోసం పడిన కష్టాలు ఒక్కసారిగా తీరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ – “ఇంత త్వరగా స్పందించి మా సమస్యను పరిష్కరించిన మా వార్డు సభ్యులకు కృతజ్ఞతలు” అని తెలిపారు. వారి సేవాభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. “ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపే నాయకత్వం ఇదే!” 11వ వార్డు ప్రజల తరఫున వంగూరి మనోహర్ & జంగయ్య కి హృదయపూర్వక ధన్యవాదాలు

రాజన్న సిరిసిల్ల

బీసీ సాధికారిక సంఘం జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా నాళ్ల చారి నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినిధి బీసీ సాధికారిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా నాళ్ల చారిని నియమించినట్లు స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా నాళ్ల చారి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పొలాస నరేందర్, మెంగని మనోహర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత కోసం సోషల్ మీడియా వేదికగా పనిచేస్తూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. మెంగని మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టి, వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. బీసీ హక్కుల కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, కోడే శ్రీనివాస్, అక్కపెల్లి సంతోష్, విద్యాధర్, తుమ్మనపల్లి శేఖర్, సంజీవ్, సుద్దాల దేవయ్య, సురోజుల నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

అకస్మాత్తు ప్రమాదంలో మృతిచెందిన మహిళ కుటుంబానికి ముదిరాజ్ సంఘం చేయూత

ముస్తాబాద్, ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామానికి చెందిన రాళ్లపాట లక్ష్మీ గారు దుబ్బాక ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని కలిగించింది. మృతురాలి కుటుంబం చాలా పేదరికంలో ఉండి, ఇల్లు మరియు భూమి లేని కటిక పేదరికంలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి చెందిన మహిళ మృతి చెందిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం స్పందించింది. మృతురాలి కూతురు పోతిరెడ్డి పద్మ, అల్లుడు పోతిరెడ్డి దేవయ్య గారిని పరామర్శించి, వారి తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంఘం అధ్యక్షుడు పిట్ల విట్టల్ గారి ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జాల బిక్షపతి, గీస బిక్షపతి (సి.డబ్ల్యూ.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు), పిట్ల రాజు (అవునూరి గ్రామ అధ్యక్షుడు), బోయిన్ గంగాధర్, దేవరాజు గోపాల్, వెంకట్, శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, వెంకటేష్, బోయిన్ బిక్షపతి, గోపన్న గారి వెంకట్, జక్కుల గిరి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో ఈ ఆర్థిక సహాయంను అందజేయడం జరిగింది.

అన్నమయ్య

మల్లెంపల్లెలో గంగమ్మ తల్లి పూజలు ఘనంగా – ఐక్యతతో ఊరంతా కలిసి పొంగళ్ళు సమర్పణ

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం మల్లెంపల్లె గ్రామంలో గురువారం నాడు గంగమ్మ తల్లి పూజలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామస్థులందరూ కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో ఒక్కటై గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పొంగళ్ళు పెట్టి తమ భక్తిని చాటుకున్నారు. గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొని, ప్రతి ఇంట్లోనూ ఆనందం వెల్లివిరిసింది.ఉదయం వేళ నుంచే గ్రామంలో పూజా కార్యక్రమాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మహిళలు ఇంటింటా ముంగిట మగ్గులతో ముగ్గులు వేసి, పూలతో అలంకరించారు. పండుగకు తగిన విధంగా గ్రామ దేవాలయం శోభాయమానంగా అలంకరించబడింది. భక్తులు కొత్త బట్టలు ధరించి కుటుంబ సమేతంగా దేవాలయానికి తరలివచ్చి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలోని మహిళలు కలసికట్టుగా పొంగళ్ళు వండడం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాలు, బెల్లం, కొత్త బియ్యంతో సంప్రదాయ పద్ధతిలో వండిన పొంగళ్ళను గంగమ్మ తల్లికి సమర్పించి గ్రామాభివృద్ధి, వర్షాభివృద్ధి, కుటుంబాల సౌఖ్యం కోసం ప్రార్థనలు చేశారు. పూజలు నిర్వహించే సమయంలో భక్తులు హారతులు ఇస్తూ, మంగళహారతులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉద్ధృతం చేశారు. గ్రామ పెద్దలు, యువకులు కలిసి పూజా కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. శ్రద్ధతో ఏర్పాట్లు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేశారు. చిన్నారులు కూడా ఆనందంగా పాల్గొని పండుగకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అందరూ కలిసి ప్రసాదాలను పంచుకోవడం ద్వారా పరస్పర స్నేహభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సౌభ్రాతృత్వం, సామాజిక సమగ్రత స్పష్టంగా ప్రతిఫలించాయి.ఈ వేడుక గురించి గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఇలాంటి సంప్రదాయ పూజలు గ్రామ ప్రజలను ఒకటిగా కట్టిపడేస్తాయి. గంగమ్మ తల్లి కృపతో గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొంటాయి” అని పేర్కొన్నారు. యువత కూడా సంప్రదాయాలను కొనసాగించడంలో ముందుండటం హర్షణీయమని వారు అభిప్రాయపడ్డారు.మల్లెంపల్లెలో ప్రతి సంవత్సరం ఈ విధంగా గంగమ్మ తల్లి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ వేడుక గ్రామ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తూ, భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని అందిస్తున్నదని వారు పేర్కొన్నారు.మొత్తానికి, గంగమ్మ తల్లి పూజలు మల్లెంపల్లెలో భక్తి, ఐక్యత, ఆనందాల సమ్మేళనంగా ఘన విజయాన్ని సాధించాయి.

తిరుపతి

బొజ్జల ఆశయాల బాటలో కార్యకర్తలు-జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి 78వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ భీమాల మునికృష్ణ మరియు పట్టణ యువత ఉపాధ్యక్షుడు వంకాయల సిద్దలయ్య ఆధ్వర్యంలో స్థానిక భిక్షాల గాలిగోపురం వద్ద భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు, భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన బాటలోనే నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గట్టిపూడి విజయకుమార్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, తిరుపతి పార్లమెంట్ కోశాధికారి కంఠా రమేష్, మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్, బాలాజీ రెడ్డి, ఖాదర్, పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

ప్రతి 90 రోజులకు ఒక జాబ్ మేళా.. స్థానిక యువతే నా ప్రాధాన్యత-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలోని JNTUA-SKIT కళాశాలలో ప్రజా నాయకుడు, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, వారి ధర్మపత్ని శ్రీమతి రిషితా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 40కి పైగా ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన 1163 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన 582 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వయంగా నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా మన నియోజకవర్గ యువతకు అండగా ఉంటాం. ప్రతి 90 రోజులకు ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం” అని ప్రకటించారు. నేటి మేళాలో ఎంపిక కాని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ..ఎవరూ నిరాశ చెందవద్దని, వారికి త్వరలోనే ఉచిత నైపుణ్య శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తన తండ్రి గారి జయంతి నాడు ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.