Monday, 20 April 2026

Blog

తిరుపతి

టౌన్ ఫస్ట్ నుంచి స్టేట్ ర్యాంకుల దాకా.. ఎంజీఎం విద్యార్థుల విజయపతాకం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీకాళహస్తి ఎంజీఎం కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి అద్భుత ఫలితాలను సాధించారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విభాగాల్లో పలువురు విద్యార్థులు స్టేట్ ర్యాంకులు, టౌన్ ఫస్ట్‌లు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జూనియర్ ఎంపీసీ విభాగంలో షేక్ హప్ ఫ్షా 466/470 మార్కులతో టౌన్ ఫస్ట్‌తో పాటు స్టేట్ ర్యాంక్ సాధించింది. ఎం.ధరణి, కే.స్వాతి తలో 464 మార్కులతో ప్రతిభ చాటారు. జూనియర్ బైపీసీ విభాగంలో జి.అనుప్ డానియల్ 441/455, వి.గాయత్రి మరియు బి.నికిత తలో 439 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. జూనియర్ సీఈసీ విభాగంలో జి.తనూజ 488/500 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించగా, వి.పద్మావతి, కే.జ్ఞానేంద్ర కుమార్ తలో 476 మార్కులు సాధించారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో వెంకటాచలపతి 474/500, మీనాక్షి 464/500 మార్కులతో మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సీనియర్ ఎంపీసీ విభాగంలో సి.యశస్విని 988/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, బి.ఓజస్విని 986, ఎస్.సానియా 985 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో కె.జ్యోతి కుమార్ హాసిని ప్రియ మరియు ఎం.సుమశ్రీ తలో 983 మార్కులు సాధించగా, ఎం.భవ్య శ్రీ 980 మార్కులు సాధించింది. సీనియర్ సీఈసీ విభాగంలో జి.కిషోర్ 982, వి.కామేష్ 966 మార్కులతో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఎంజీఎం విద్యాసంస్థలు డిజిటల్ బోధన విధానాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ విజయాలు సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ వి.ఎస్. రత్నం, లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు.

తిరుపతి

గోపాలకృష్ణారెడ్డి జన్మదినం.. తొట్టంబేడులో సేవా కార్యక్రమాల వెల్లువ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడులో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 78వ జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రమణ్యం, తంగేళ్లపాలెం సింగిల్ విండో బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తొట్టంబేడు పంచాయతీ చంద్రబాబు నాయుడు ఎస్టీ కాలనీలో నివసిస్తున్న గిరిజనులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. గోపాలకృష్ణారెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పథాన్ని ఆయన తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమర్థంగా కొనసాగిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దశరథచారి, గాలి చలపతి నాయుడు, గాలి మురళి నాయుడు, మిన్నల్ రవి, ఉమేష్ రావు, కిషోర్, సుబ్బయ్య, కోట చంద్రశేఖర్, బి. వెంకటేశ్వర్లు, హరి, హేమభూషణ్, భూపాల్, చందు, కృష్ణయ్య, భార్గవ్ కుమార్, బాలాజీ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతిలో ‘బొజ్జల’ – ‘లోకేష్’ సందడి-రూ.15 కోట్లకు పైగా క్రీడా అభివృద్ధి పనులకు శ్రీకారం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు భారీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను వీరు ప్రారంభించారు. తిరుపతి గొల్లవానిగుంటలో రూ. 10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం’, క్రికెట్ స్టేడియం మరియు పెవిలియన్‌ను మంత్రి లోకేష్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీనితో పాటు యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ వంటి ప్రత్యేక అకాడమీలను కూడా అందుబాటులోకి తెచ్చారు. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ. 5.35 కోట్లతో ఏర్పాటు చేసిన ‘కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ’ని ప్రారంభించడం ద్వారా క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ లభిస్తుందని వారు తెలిపారు. అలాగే గూడూరు, సూళ్లూరుపేట, రేణిగుంట ప్రాంతాల్లో కొత్తగా నిర్మించనున్న ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాల’కు సైతం శిలాఫలకాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వంలో యువతకు ఉపాధితో పాటు ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారిని మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం కృషి చేస్తాం. నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా అడుగులు వేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం అవుతామని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి

సేవా పథంలో కోల ఆనంద్ తనయుడు-అనాథల మధ్య వేదాంత పుట్టినరోజు వేడుకలు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ చిన్న కుమారుడు కోల వేదాంత పుట్టినరోజు వేడుకలు అత్యంత అర్థవంతంగా, సేవా దృక్పథంతో జరిగాయి. ఆడంబరాలకు పోకుండా, సమాజంలోని అభాగ్యుల మధ్య ఈ వేడుకలను నిర్వహించడం ద్వారా కోల కుటుంబం తన ఉదారతను చాటుకుంది. రేణిగుంట ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ‘అక్షయ క్షేత్రం’లో ఉన్న మానసిక వికలాంగులు, అనాథలు మరియు అభాగ్యుల మధ్య వేదాంత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదాంత అనాథ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశారు. వారి చిరునవ్వుల మధ్య జరిగిన ఈ వేడుక అక్కడి వారిలో ఎంతో సంతోషాన్ని నింపింది. పుట్టినరోజును పురస్కరించుకుని సుమారు వంద మంది అభాగ్యులకు హృదయపూర్వకంగా అన్నదానం చేశారు. ఒకరి పుట్టినరోజు పదిమందికి మేలు చేసేలా ఉండాలన్న ఉన్నత ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల ఆనంద్ కుమారులు, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కూరకాల్వ వేణు ముదిరాజ్, రాజారాయల్, హరీష్, కోల అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్న వేదాంతను పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు అభినందిస్తూ దీవెనలు అందజేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో వైభవంగా ప్రదోష కాల పూజలు-నందీశ్వరుడి సేవలో తరించిన భక్తులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశి, మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రదోష కాల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుదాహవారం నాడు సాయంత్రం ప్రదోష వేళలో ఆలయ వేద పండితులు, అర్చకులు స్వామివారికి, నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, విభూతి, పన్నీరు వంటి షోడశోపచార ద్రవ్యాలతో అభిషేకం చేసి, అనంతరం బిల్వ పత్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రదోష పూజలో భాగంగా నందీశ్వరుడిని విశేషంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మాస శివరాత్రి సందర్భం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ పూజలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఖమ్మం

కాలుష్యంపై గళమెత్తిన ప్రజలు – తక్షణ చర్యలకు డిప్యూటీ సీఎం హామీ

అంబేద్కర్ నగర్ మరియు బీసీ కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న కాలుష్య సమస్యపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ నరుకుల రాజేశ్వరి అప్పారావు ఆధ్వర్యంలో ప్రజలు కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఇప్పటికే ఎమ్మెల్యే రాగమయి దయానంద సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సమస్యను పరిశీలనలో ఉంచామని, త్వరలోనే పరిష్కారం కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్పందించిన అధికారులకు, ప్రజల తరఫున సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

E-పేపర్

విధి కుక్కల స్వైర విహారం, ఒక వ్యక్తి పరిస్థితి విషమం పట్టించుకోని అధికారులు

*విధి కుక్కల స్వైర విహారం, ఒక వ్యక్తి పరిస్థితి విషమం పట్టించుకోని అధికారులు* పున్నమి న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడలో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ ఎన్ను జయపాల్ రెడ్డి(75), పరిస్థితి విషమం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు పట్టించుకోని అధికారులు

తూర్పు గోదావరి

క్రికెట్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకోవద్దు: తాళ్లపూడి ఎస్.ఐ రామకృష్ణ హెచ్చరిక

తాళ్లపూడి, ఏప్రిల్ 15 (పున్నమి ప్రతినిధి): ​ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న తరుణంలో యువత క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగ్ వంటి వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తాళ్లపూడి ఎస్.ఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. ​జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కీలక అంశాలు: ​చట్టపరమైన చర్యలు: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా యువత నేరుగా గానీ లేదా వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా గానీ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ​కుటుంబానికి క్షోభ: క్షణికావేశంలో బెట్టింగ్‌లు కాసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని.. తద్వారా తల్లిదండ్రులకు తీరని వేదన మిగల్చవద్దని హితవు పలికారు. ​సమాచారం అందించండి: తాళ్లపూడి మండల పరిధిలో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ​రహస్యంగా వివరాలు: సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ప్రజలు నిర్భయంగా పోలీసులకు సహకరించాలని ఎస్.ఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ​గమనిక: క్రికెట్ ఒక వినోదం మాత్రమే. బెట్టింగ్ అనేది మీ సామాజిక మరియు ఆర్థిక భద్రతకు ముప్పు. అప్రమత్తంగా ఉండండి!

అన్నమయ్య

జాతీయ స్థాయి ఇస్రో యువికా-2026 కార్యక్రమానికి చిట్వేల్ విద్యార్థి ఎంపిక

అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండల కేంద్రంలోని పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చిల్లావాండ్లపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి కుశాల్ అనే ప్రతిభావంతుడు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన “యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా-2026)”కు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా మండలానికి, జిల్లాకు గర్వకారణమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం మొత్తం 456 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కావడం విశేషం. ఆ ఎంపికలో చిట్వేల్ ప్రాంతానికి చెందిన విద్యార్థి కుశాల్ స్థానం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ప్రతి సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల కోసం యువికా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. భారతదేశం అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచ అగ్రదేశాలకు పోటీగా ఎదుగుతూ, వందలాది విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేస్తోందని, ఈ విజయాలను విద్యార్థులకు చేరవేసి వారిలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ యువికా-2026 కార్యక్రమం మే 11 నుండి మే 22 వరకు దేశంలోని 7 ప్రధాన ఇస్రో కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులకు ఉపగ్రహాల నిర్మాణం, రాకెట్ సాంకేతికత, అంతరిక్ష ప్రయోగాలు, గ్రహాల పరిశోధన వంటి అనేక శాస్త్రీయ అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా, ప్రముఖ శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా కల్పించడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణం, భోజనం, వసతి వంటి అన్ని సౌకర్యాలను ఇస్రో సంస్థే భరిస్తుంది. రెండు వారాల పాటు జరిగే ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులు స్పేస్ సెంటర్లను సందర్శించి, అక్కడి ఆధునిక సాంకేతిక పరికరాలను పరిశీలించే అవకాశం పొందుతారు. సప్తగ్రహ కూటమి, అంతరిక్ష విశేషాలు, భూమి-గ్రహాల గమనాలు వంటి ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు సులభంగా వివరించి విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు.మే 22న జరిగే ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెంపొందించి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుందని ప్రధానోపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇస్రో యువికా-2026కు ఎంపికైన రామిశెట్టి కుశాల్‌ను పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివనారాయణ గౌడ్, తిరుమల విశ్వనాథం, సోఫియా, లక్ష్మీకళావతి, సుహాసిని, సునీత కుమారి, సుభాష్ చంద్రబోస్, నవీన్ కుమార్, రాజశేఖర్, వెంకట రమణ, ప్రవీణ్ కుమార్ తదితరులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది విద్యార్థి కుశాల్ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ

జీడీసీ భైంసా లెక్చరర్ గుంత సుధాకర్‌కు పీహెచ్.డి – ఘన సన్మానం

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (GDC Bhainsa)కు చెందిన లెక్చరర్ గుంత సుధాకర్ గారు ఆర్థిక బాధ్యత చట్టం మరియు ఆర్థిక లోటు ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వ అప్పులపై దాని ప్రభావం అనే అంశంపై పరిశోధన చేసి సమగ్ర నివేదిక తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమర్పించగా సంతృప్తి చెంది డాక్టరేట్ (Ph.D) పట్టా పొందిన సందర్భంగా కళాశాలలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పరిశోధనను రిజిస్ట్రార్ డా. యాదగిరి గారి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ గారు మాట్లాడుతూ, గుంత సుధాకర్ గారి పట్టుదల, కృషి మరియు విద్యాపట్ల అంకితభావం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. యు. రవి కుమార్ గారు మాట్లాడుతూ, ఆయన సాధించిన ఈ ఘనత కళాశాల ప్రతిష్టను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. సీనియర్ అధ్యాపకులు డా. భీమరావు, డా. పవన్ కుమార్, డా. ఎం. శంకర్, ఆర్. రాజు, డా. ఓంప్రకాశ్, డా. కె. సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని గుంత సుధాకర్ గారిని పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.