Monday, 20 April 2026

Blog

తిరుపతి

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాకు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆమెకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా మాజీ భాజపా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా డాక్టర్ చంద్రప్ప దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను ఆమెకు వివరించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని ఆమెకు బహుకరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వచ్చిన ఆమెకు పలువురు నాయకులు, ప్రముఖులు విమానాశ్రయంలో శుభాకాంక్షలు తెలియజేశారు.

తిరుపతి

సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ మార్గమే దారి- జనసైనికులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలో పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఘననివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత పోరాటం ఆయన ఆశయాలను జనసైనికులు స్మరించుకుటూ… చిన్న వయసులోనే అనేక కష్టాలను ఎదుర్కొని, కుల వివక్షతను అనుభవిస్తూ కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్న అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, కుల వివక్ష లేని సమాజం నిర్మాణమే ఆయన లక్ష్యమని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని, ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ పనిచేస్తుండటం గర్వకారణమని తెలిపారు. ఇదే ఏప్రిల్ 14 తేదీన 28 సంవత్సరాల క్రితం స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని స్మరించారు. అదే తేదీన ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహం వద్ద సుందర వాతావరణం ఏర్పడటం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బందికి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

తిరుపతి

సేవకు నిలువెత్తు రూపం ‘అమ్మ ఆశ్రమం’-25 ఏళ్ల ప్రస్థానంపై ఎమ్మెల్సీ ప్రశంసలు

తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలంలోని శివనాథపురంలో వున్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సృష్టిలో అంతులేని అనురాగాన్ని కరుణను కురిపించేది కేవలం అమ్మ మాత్రమేనని, అలాంటి మాతృమూర్తి సేవలకు ప్రతిరూపం ‘అమ్మ ఆశ్రమం’ అని గత 25 ఏళ్లుగా నిరంతర కృషితో, సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు భూలక్ష్మి మేడమ్ సేవలను అభినందిస్తూ ఆమెను ఘనంగా దుశ్శాలువాతో సత్కరించారు. అమ్మ ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదని, అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఈ ఆశ్రమం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు రత్నం రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కంట ఉదయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆశ్రమ సేవలను కొనియాడారు.

తిరుపతి

మహిళా సాధికారతకు బాటలు-శ్రీకాళహస్తిలో 16న భారీ ‘మహిళా రిజర్వేషన్’ మద్దతు ర్యాలీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తెలిపారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ చారిత్రాత్మక బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చ జరగనున్న నేపథ్యంలో, దీనికి సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన గురువారం ఉదయం 8 గంటలకు స్థానిక బేరి వారి మండపం నుండి ర్యాలీ ప్రారంభమై పట్టణంలోని నాలుగు మాడ వీధుల గుండా సాగనుంది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఎన్డీఏ కూటమి సభ్యులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోలా ఆనంద్ కోరారు.

తిరుపతి

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి-అంబేద్కర్ జయంతిలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, సామాజిక న్యాయం అందాలనే గొప్ప లక్ష్యంతో బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నం రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కంట ఉదయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

సేవా కార్యక్రమాలకు సమాజం తోడ్పాటు అవసరం-బృందమ్మ

తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలం శివనాదపాలెం గ్రామంలోని “అమ్మ అనాధ వృద్ధ మహిళల ఆశ్రమం” స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమ నిర్వహణను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. తోడు లేని వృద్ధ మహిళలకు ఈ ఆశ్రమం ఒక నిలువెత్తు నీడగా నిలుస్తూ, వారికి ఉచిత భోజనం, సంరక్షణ అందించడం అభినందనీయం అని అన్నారు. ఆశ్రమంలోని వృద్ధులను స్వయంగా పలకరించిన బృందమ్మ, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రశంసిస్తూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సేవా భావం కలిగిన దాతలు పాల్గొన్నారు.

తిరుపతి

సమాజ ఐక్యతకు బలిజ భవనం కేంద్రం కావాలి-గోపి రాయల్

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న బలిజ భవనాన్ని జాతీయ కాపు ప్రచార కార్యదర్శి గోపి రాయల్ ఆధ్వర్యంలో కాపు సంఘం కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనుల నాణ్యతపై నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా గోపి రాయల్ మాట్లాడుతూ బలిజ భవనం సమాజానికి ఐక్యతను పెంపొందించే కేంద్రంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కాపు సంఘం నాయకులు కూడా భవనం నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. సమాజ అభివృద్ధికి ఇలాంటి వసతులు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్, ఏటీఎస్, సిద్ధుల ప్రసాద్, ముత్యాల పార్థసారథి, చక్రాల మురళి, మగరాల గణేష్, దుమ్ము రాయల్, ముని తదితర బలిజ సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

అంబేద్కర్ ఆశయ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం-నివాళులర్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తొట్టంబేడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ (MPDO) కార్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల మధ్య బాబాసాహెబ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన మండల అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

రెడ్ క్రాస్ – MGM ఆధ్వర్యంలో వైద్య శిబిరం విజయవంతం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి టెంపుల్ న్యూస్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పుత్తేరి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు MGM హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మంది గ్రామస్తులు పాల్గొని తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య సలహాలు పొందారు. MGM హాస్పిటల్స్‌కు చెందిన నిపుణుల బృందం చిన్నపిల్లలు, స్త్రీల ఆరోగ్యం, ఎముకలకు సంబంధించిన సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డా. ఉమా మహేశ్వర్ రావు, డా. ముని లక్ష్మి, డా. కార్తిక్, ఎమర్జెన్సీ వైద్యుడు డా. పవన్ పాల్గొని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో పుత్తేరి గ్రామ సర్పంచ్ రామమూర్తి, పంచాయతీ కార్యదర్శి నాగార్జున, డిజిటల్ ఇంజనీర్ హరీష్, ANM నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు సేవలు అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, MGM హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

సామాజిక సమానత్వానికి అంబేద్కర్ మార్గం-మిద్దెల హరి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామ సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (SKIIMS) కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14న వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ మిద్దెల హరి, ప్రిన్సిపాల్ డాక్టర్ గీతా దేవి, విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో అంబేద్కర్ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు కేక్ కటింగ్ నిర్వహించి జయంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ.. అంబేద్కర్ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు, గొప్ప సంఘ సంస్కర్తగా దేశానికి అపార సేవలు అందించారని తెలిపారు. అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషి అపారమని, స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అంబేద్కర్ జీవితం, రాజకీయ తత్వం, సమాజ సేవ దృక్పథంపై అవగాహన పెంపొందించుకొని స్ఫూర్తి పొందారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.