Wednesday, 22 April 2026

Blog

E-పేపర్

కొత్తపల్లి గ్రామంలోని UGD డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలి..

కొత్తపల్లి గ్రామంలోని UGD డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలి… కొత్తపల్లి గ్రామంలో గత నెల మెన్ రోడ్డు UGD పనులు ప్రారంభించడం జరిగింది కాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని వార్డు సభ్యులు తెలిపారు.పనులు ఆలస్యం కారణంగా రాకపోకలకు ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నం ఆమనగల్ వెల్లే బస్సు,రాత్రి దొడ్లపాడు వెల్లే బస్సు రాకపోవడం వల్ల తండా వాసులు,గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు,రైతులు పొలాలకి వెళ్లిరవడానికి,అత్యవసర సేవలు అందక,వెళ్లడానికి గ్రామం నుండి మరొక్క పెద్ద రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుందని,ఇండ్ల ముందు పోవడానికి కూడా వీలు లేకుండా నెలల తరబడి గుంతలు తీసి పెట్టారు,పెద్దవాళ్లు,చిన్న పిల్లలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉందన్నారు.ఇంజనీర్ ఏఈ కూడా పరిస్థితులను గమనించి కాంటాక్ట్ తో మాట్లాడి ఈవారంలో డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలని వారితో మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాలే.అనిత,వార్డు సభ్యులు వంగ.సంజీవ రెడ్డి,కంబాలపల్లి. కుమార్,మహేశ్వరం.వినోద, పోలే.శివ కుమార్, అరవింద్ గ్రామస్థులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చాటిన విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరిజిల్లా గోకవరంలోని విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ ఒలింపియాడ్ పరీక్షల్లో విశేష విజయాలు సాధించారు. గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, జీకే వంటి విభాగాల్లో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని, గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పతకాలను అందుకున్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, పతకాలతో పాటు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా విద్యార్థి పవన్ సాయి తన అద్భుత ప్రతిభతో రూ.2,500 నగదు బహుమతిని అందుకోవడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు కూడా “లిటిల్ స్టార్స్ ఒలింపియాడ్” పరీక్షల్లో పాల్గొని గణితం, ఇంగ్లీష్, సైన్స్, జీకే విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను సాధించారు. వీరికి పతకాలతో పాటు సర్టిఫికెట్లు, గిఫ్ట్‌లు, ఇతర బహుమతులు కూడా ప్రదానం చేయబడ్డాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విజేతలకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. END

తూర్పు గోదావరి

స్వయంగా జనగణన-2027లో వివరాలు నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మంత్రి దుర్గేష్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమహేంద్రవరందేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన-2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. గురువారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేశారు. నమోదు అనంతరం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియ విజయవంతంగా పూర్తయినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన వసతులు, సేవలు అందించేందుకు జనగణన ముఖ్య దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల ఖచ్చితమైన సంఖ్య తెలిసినప్పుడే ప్రభుత్వం సమర్థవంతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించగలదని వివరించారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. “నేను జనగణనలో పాల్గొని నా వివరాలు నమోదు చేసుకున్నాను… మీరు కూడా ముందుకు వచ్చి పాల్గొనండి” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలు నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రణాళికలు సిద్ధం కావడానికి సహకరించాలని ఆయన ఆకాంక్షించారు. END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“సర్వేపల్లిలో అంగన్వాడీలకు సిఎస్‌ఆర్ వరం – చిన్నారుల అభివృద్ధికి పరికరాల పంపిణీ”

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 17 ( జి ఎం కె రావ్ పున్నమి ప్రతినిధి).సర్వేపల్లినియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ నిధులతో అవసరమైన పరికరాలు అందజేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మనుబోలు, వెంకటచలం, పొదలకూరులోని 69 కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు గ్యాస్ స్టవ్‌లు, స్లీపింగ్ మ్యాట్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లు, టీవీలు పంపిణీ చేశారు. పోషణ్ పక్వాడ కార్యక్రమం ద్వారా పిల్లల పోషకాహారం, మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – కొవ్వూరులో గ్రీవెన్స్ కార్యక్రమం

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /కొవ్వూరుతూర్పుగోదావరి జిల్లా ఏప్రిల్ 17: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించే దిశగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం కొవ్వూరులో జరిగింది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 22 వినతి పత్రాలను అందజేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డ్రెయినేజ్ సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా వినిపించాయి. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కేడర్ సమావేశం నిర్వహించబడింది. ఇందులో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామకృష్ణ, టీవీ రామరావు, దాయన రామకృష్ణ, బేతిన నారాయణ, కాకర్ల నారాయుడు, కళాధర్ చక్రవర్తి, సుంకర సత్తిబాబు, వేమగిరి వెంకట్రావు తదితర NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ దహనం పున్నమి న్యూస్ ప్రతినిధి 17 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి : *మాల్ రెడ్డి రంగారెడ్డి ది నరం లేని నాలుక.. ఏ రోజు ఎది మాట్లాడతాడో ఆయనకే తెలియదు… బహిరంగ చర్చలకు వచ్చే దమ్ము మాల్ రెడ్డి రంగారెడ్డి కి లేదు -బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి ఫార్మాసిటీ భూముల విషయంలో మేడిపల్లి గ్రామంలో రైతులముందు నిజ నిర్ధారణ చర్చకు రావాలని ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి . చర్చకు రాకుండా తోక ముడిచిన ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేసి చర్చను అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మరియు భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఇంచార్జి శ్రీ క్యామా మల్లేష్ తో పాటు కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

కామారెడ్డి

కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచీల పంపిణీ

కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచీల పంపిణీ కామారెడ్డి/ ఏప్రిల్ 17 /పున్నమి ప్రతినిధి కే.పి రాజా రెడ్డి జన సేవా సంస్థ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వేంకట రమణా రెడ్డి సొంత నిధులతో కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ గంజ్ హైస్కూల్‌లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 74 డెస్క్ బెంచీలను కౌన్సిలర్ ప్రీతి విపుల్ జైన్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతి జైన్ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి స్థాయికి చేరాలని సూచించగా, ప్రధానోపాధ్యాయురాలు గీత గారు పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కొత్తగా నిర్మించిన పాఠశాల భవనం నూ త్వరగా అందేలా చూడాలని వారిని కోరారు. సంస్థ ప్రతినిధి విపుల్ జైన్ విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్న తమను సంప్రదించవచ్చని ప్రధానోపాధ్యాయురాలు గారికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు సునీత మేడం మరియు రాజేంద్ర గారు మరియు శైలజ కృష్ణవేణి గార్లు రాజేందర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుల సమావేశం – ప్రభుత్వ విధానాలపై ఆందోళన, మేడే ఏర్పాట్లపై చర్చ

ముస్తాబాద్ ఏప్రిల్ 17 పున్నమి ప్రతినిధి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాబోయే రోజులలో మేడే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశంపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డు నిధులు సక్రమంగా వినియోగం కావడం లేదని, అవి వృథా అవుతున్నాయని విమర్శించారు. “ఆరోగ్య రక్ష” పేరిట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించడం వల్ల కార్మికులపై దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని అన్నారు. రక్త పరీక్షల పేరుతో రూ.3200 వరకు దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు అబ్రహం, దేవయ్య, అబ్రహం, ఉప్పలయ్య, కొల్లూరు, పుల్లూరి రాములు, గంగయ్య, అన్నమేని లక్ష్మయ్య, మల్లయ్య, సునూరు రఘుపతి, సాయిలు, దబిడ అంజయ్య, పిల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

మహబూబ్ నగర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు , పెన్షనర్ల న్యాయమైన కోరికలను, దీర్ఘకాలిక అపరిస్కృత డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 17/04/2026* *తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారులు కార్మికులు మరియు పెన్షనర్స్ మెజారిటీ అభిప్రాయాల మేరకు దశల వారి ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకమై ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చారని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ .ఎన్ విజయకుమార్ డిమాండ్ చేశారు, దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు దాదాపు 64 అంశాలు సత్వరమే పరిష్కరింప చేయాలని ఈరోజు మండల జిల్లా కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలియజేశారు, పిఆర్సి రిపోర్టును తెప్పించి జూన్ రెండు లోపు అమలు చేయాలని ఇప్పటికే 30 నెలలు పూర్తయి పుణ్యకాలం గడిచిందని వారు తెలియజేశారు, పెండింగ్ బిల్లులు నెలకు సగటున 600 ఉద్యోగులు రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయని ముఖ్యంగా పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మానవత్వం దృష్టితో వారికి వచ్చే బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలు మే ఒకటి నుంచి వైద్య సేవలు అందించాలని అలాగే 2004 కంటే ముందు నియామకమైన ఉద్యోగస్తులు అందరినీ సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్చాలని తదితర 64 అంశాలతో దశల వారి ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సత్వరమే ప్రభుత్వం స్పందించి న్యాయమైన దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరారు*

మహబూబ్ నగర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు , పెన్షనర్ల న్యాయమైన కోరికలను, దీర్ఘకాలిక అపరిస్కృత డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 17/04/2026* *తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారులు కార్మికులు మరియు పెన్షనర్స్ మెజారిటీ అభిప్రాయాల మేరకు దశల వారి ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకమై ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చారని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ .ఎన్ విజయకుమార్ డిమాండ్ చేశారు, దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు దాదాపు 64 అంశాలు సత్వరమే పరిష్కరింప చేయాలని ఈరోజు మండల జిల్లా కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలియజేశారు, పిఆర్సి రిపోర్టును తెప్పించి జూన్ రెండు లోపు అమలు చేయాలని ఇప్పటికే 30 నెలలు పూర్తయి పుణ్యకాలం గడిచిందని వారు తెలియజేశారు, పెండింగ్ బిల్లులు నెలకు సగటున 600 ఉద్యోగులు రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయని ముఖ్యంగా పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మానవత్వం దృష్టితో వారికి వచ్చే బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలు మే ఒకటి నుంచి వైద్య సేవలు అందించాలని అలాగే 2004 కంటే ముందు నియామకమైన ఉద్యోగస్తులు అందరినీ సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్చాలని తదితర 64 అంశాలతో దశల వారి ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సత్వరమే ప్రభుత్వం స్పందించి న్యాయమైన దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.