శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు సోమవారం శ్రీకాళహస్తిలోని బెరివారి మండపం కూడలిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….1901 జూలై 6న జన్మించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అఖండ భారతదేశ నిర్మాణం, జాతీయ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించిన ఆయన, కాశ్మీర్కు సంబంధించిన విధానాలను వ్యతిరేకిస్తూ 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించి జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాదులు వేశారని అన్నారు. “ఒకే దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు చెల్లవు” అంటూ ముఖర్జీ చేసిన ఉద్యమం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, యువత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షుడు ఆర్. హరీష్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, జి.వి. అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, మద్దు వాసు యాదవ్, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, లింగాబత్తిన గోపాల్, తానికొండ్ల భరత్ నాయుడు, పెద్దదాసరి శివారెడ్డి, బొక్కసం కిరణ్మణి, చోటు, సుబ్బరామిరెడ్డి, వీరస్వామి, కుమార్ నాయుడు, గోవర్ధన్, మురళీ, యశ్వంత్, నాగశేషు, శివా యాదవ్, గాధిపాకుల యతీశ్, హుకీం సింగ్, కోలే షణ్ముగం, సజ్జా హరీష్, రాజు, ఢిల్లీ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి
శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు సోమవారం శ్రీకాళహస్తిలోని బెరివారి మండపం కూడలిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….1901 జూలై 6న జన్మించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అఖండ భారతదేశ నిర్మాణం, జాతీయ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించిన ఆయన, కాశ్మీర్కు సంబంధించిన విధానాలను వ్యతిరేకిస్తూ 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించి జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాదులు వేశారని అన్నారు. “ఒకే దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు చెల్లవు” అంటూ ముఖర్జీ చేసిన ఉద్యమం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, యువత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షుడు ఆర్. హరీష్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, జి.వి. అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, మద్దు వాసు యాదవ్, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, లింగాబత్తిన గోపాల్, తానికొండ్ల భరత్ నాయుడు, పెద్దదాసరి శివారెడ్డి, బొక్కసం కిరణ్మణి, చోటు, సుబ్బరామిరెడ్డి, వీరస్వామి, కుమార్ నాయుడు, గోవర్ధన్, మురళీ, యశ్వంత్, నాగశేషు, శివా యాదవ్, గాధిపాకుల యతీశ్, హుకీం సింగ్, కోలే షణ్ముగం, సజ్జా హరీష్, రాజు, ఢిల్లీ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

