Wednesday, 22 April 2026

Blog

తూర్పు గోదావరి

ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చాటిన విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

గోకవరంలోని  విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ ఒలింపియాడ్ పరీక్షల్లో విశేష విజయాలు సాధించారు. గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, జీకే వంటి విభాగాల్లో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని, గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పతకాలను అందుకున్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, పతకాలతో పాటు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా విద్యార్థి పవన్ సాయి తన అద్భుత ప్రతిభతో రూ.2,500 నగదు బహుమతిని అందుకోవడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా, ఎల్‌కేజీ,  యూకేజీ విద్యార్థులు కూడా “లిటిల్ స్టార్స్ ఒలింపియాడ్” పరీక్షల్లో పాల్గొని గణితం, ఇంగ్లీష్, సైన్స్, జీకే విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను సాధించారు. వీరికి పతకాలతో పాటు సర్టిఫికెట్లు, గిఫ్ట్‌లు, ఇతర బహుమతులు కూడా ప్రదానం చేయబడ్డాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విజేతలకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.

ఖమ్మం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి నేడు: ఏప్రిల్ 17న దేశవ్యాప్తంగా ఘన నివాళులు

భారతదేశ మాజీ రాష్ట్రపతి, మహోన్నత విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. విద్యారంగానికి విశిష్ట సేవలందించిన రాధాకృష్ణన్ భారతీయ తత్వశాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఆయన ఆలోచనలు, విలువలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు, విద్యావేత్తలు ఘన నివాళులు అర్పించారు.

మహబూబ్ నగర్

హిందూ బంధువులంతా ఏకం కావాలి

*హిందువు బంధువులంతా… ఐక్యతతో ఉండాలి…. అంబత్రయ క్షేత్ర గురు స్వామి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ పిలుపు* *పున్నమి ప్రతినిధి *మహబూబ్నగర్* *జిల్లా ::తేదీ:: 17/04* */2026* *హిందూ బంధువులంతా ఐక్యతతో సంస్కృతి* *సంప్రదాయాలను కాపాడుతూ ఉండాలని హిందూ సమ్మేళన* *కార్యక్రమంలో అంబత్రయ క్షేత్ర గురుస్వామి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ గారు హిందూ* *బంధువులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ,*వడ్డెర బస్తి కాలనీ, తదితర హిందూ బంధువులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని* *విజయవంతం చేశారు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

సాహితీ

ఆధునికాంధ్ర పితామహుడు – డా. బద్రి పీర్ కుమార్

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న జరుపుకుంటాము. ఆధునిక తెలుగు నాటకరంగ పితామహుడు, తొలి నాటకకర్త, దర్శకుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని, 2007 నుండి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుతారు. గొప్ప సంఘ సంస్కర్త, మూఢనమ్మకాలపై యుద్దంప్రకటించిన కలియుగ వైతాళికుడు, బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఆధునిక సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహా పురుషుడు, వితంతు వివాహాల కోసం పోరాడి, 1881లో మొదటి వితంతు వివాహాన్ని జరిపించి, తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్రము’ మొదటి స్వీయచరిత్ర, మొదటి ప్రహసనం రాసి బాలికల కోసం పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యకు, సాధికారతకు కృషి చేసి, ‘వివేకవర్ధిని’ పత్రిక ద్వారా సమాజంలోని దురాచారాలపై పోరాటం చేయుట వలన, సంఘ సంస్కరణలు మరియు సాహిత్య సేవ కారణంగా ‘ఆధునికాంధ్ర సమాజ పితామహుడు’ గా, ‘గద్య తిక్కన’ గా పేరుపొందిన స్వర్గీయ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సమర్పిస్తున్న ఈ అక్షర సుమాంజలి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *ఆ* ఆధునిక సమాజానికి ఆదర్శప్రాయుడు *ధు* దురితనివారణ సామాజిక కళాకారుడు *ని* నిబంధనలు అరాచకబంధనలు కాకూడదని *కాం* కాంక్షలు సమున్నత జనోద్ధరణ కార్యక్రమాలుగ *ధ్ర* ధరణి యందు వేదికైన జన విజ్ఞాన కేంద్రం *పి* పిలుపు పలుకుల ప్రాయోజిత పర్వం *తా* తాను విశ్వసించిన సమాజ చైతన్యం *మ* మానవత్వ తత్వ మహిమాన్విత దీపం *హు* హుందాతనము ప్రతిబింబించిన రూపం *డు* డుండుగు లేని సంఘ ప్రయోజనాచార్యుడు *కం* కంఠస్వరము కళాత్మక వరము కలవాడై *దు* దురాచార నిర్మూలనకు కంకణబద్ధుడై *కూ* కూడలి సమసమాజ మండలి కావాలని *రి* రివారీగ జన విజ్ఞానసవారి సొంతం చేసుకుని *వీ* విజ్ఞానవీరుడైన సంఘసంస్కర్త *రే* రేయింబవళ్లు సమాజ హితం కోరి *శ* శక్తి యుక్తి సామాజికభక్తి మిళితం చేసి *లిం* లింగ బేధం లేని సమాజాభివృద్ధికై *గం* గమ్యం వైపు హితకారిని సమాజం మలచి *పం* పండితవిద్యను పామరులకు సైతం పంచిన *తు* తులాభార సమభావ సమతౌల్య నిపుణుడు *లు* లుప్తమయిన సమైక్యత సాహిత్య సమీక్షల విశ్లేషకుడు. నేటికి ప్రసరిస్తున్న సామాజిక చైతన్య క్రాంతి కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

తిరుపతి

తాజ్ హోటల్‌లో ‘లెజెండ్’ బాలకృష్ణను మర్యాదపూర్వక కలిసిన జనసైనికుకు నవీన్ కుమార్.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి నవీన్ కుమార్ టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్.. బాలకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తూనే, రాజకీయాల్లోనూ ప్రజా సేవకు అంకితమైన బాలయ్యను కలవడం పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

బడుగు వర్గాలకు టిడిపిలో ప్రాధాన్యం మరింత బలోపేతం- డా. ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వస్తోందని టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పార్టీ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. టిడిపి జాతీయ, రాష్ట్ర కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించడం శుభపరిణామమని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన డా.జి. దశరథాచారి, యం. సుబ్బయ్యలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించడం ద్వారా బడుగు వర్గాల పట్ల పార్టీ నిబద్ధత మరోసారి రుజువైందన్నారు. శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పక్షపాతిగా నిలుస్తున్నారని, ఈ నియామకాలు దానికి నిదర్శనమని తెలిపారు. అలాగే పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కృషి చేసిన సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం నాయకత్వం ప్రత్యేకతగా కొనియాడారు. రాష్ట్ర కమిటీలో 185 మంది సభ్యుల్లో 122 మందిని బడుగు వర్గాలకు చెందిన వారిగా ఎంపిక చేయడం ద్వారా సామాజిక సమతుల్యత సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

వెంకటరామయ్య భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు నివాళి

ఏర్పేడు, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పల్లం గొల్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్కుపల్లి వెంకటరామయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటరామయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అంత్యక్రియల్లో మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్‌తో పాటు జనార్దన్ యాదవ్, వెంకటేశ్వర యాదవ్, మునయ్య, కన్నయ్య యాదవ్, రామకృష్ణ, భాస్కర్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఎంజీఎం స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. కిండర్ గార్డెన్ నుండి లోయర్ స్కూల్‌కు, లోయర్ స్కూల్ నుండి హయ్యర్ స్కూల్‌కు ప్రమోషన్ పొందిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్‌లు, టోపీలు ధరించి విద్యా ప్రయాణంలో తొలి మైలురాయిని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చేస్తూ వేడుకలను కోలాహలంగా మార్చారు. గ్రాడ్యుయేషన్ గౌన్‌లు, టోపీలతో చిన్నారులు కొత్త దశలోకి అడుగుపెడుతున్న సందేశాన్ని ప్రతిబింబించారు. కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ..విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ఆ దిశగా అభివృద్ధి చెందేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ వేడుకలో స్కూల్ హెడ్మాస్టర్ ముని రత్నం నాయుడు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

మహిళా రిజర్వేషన్ బిల్లుకు శ్రీకాళహస్తిలో మద్దతు ర్యాలీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ పార్లమెంట్ సభల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బేరి వారి మండపం నుండి నాలుగు వీధుల మీదుగా జరిగిన ఈ ర్యాలీలో ప్రధాన అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ నారీశక్తిగా ఎదుగుతున్న వేళ, చట్టసభలలో వారికి 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కండ్రిగ ఉమ, చాగణం శైలజ, ఉమా సింగ్, అంకమ్మతో పాటు జిల్లా, మండల స్థాయి పదాధికారులు, మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి భక్తులకు శుభవార్త: రూ. 100 లకే రాహు-కేతు పూజ!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యం, స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా రూ.500 రాహు-కేతు పూజను రద్దు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో స్థానిక పేద ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో శ్రీకాళహస్తి పట్టణం, మండల పరిధిలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి బుధవారం కేవలం రూ.100లకే సామూహిక రాహు-కేతు పూజ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే విశిష్ట సేవలలో భాగంగా ఉన్న రూ.5,000 రాహు-కేతు పూజ టికెట్ ధరను రూ.6,000కు సవరించినట్లు పేర్కొన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా దర్శన సమయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.