ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ )
ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు ప్రాంతంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా కిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ షాప్ను ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన మందులు, ఎరువులు సరఫరా చేస్తూ వ్యాపార రంగంలో చావా కిరణ్ మంచి పేరు సాధించాలని ఆకాంక్షించారు. రైతులకు ఉపయోగపడే విధంగా సేవలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ వరంగల్ ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, భూక్యా శ్యామ్ సుందర్ నాయక్, సీతారాం నాయక్, అనంతు ఉపేందర్, వేల్పుల సుధాకర్, నల్లమోతు నానీబాబు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


