TG: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారికి కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు డిజిటలైజ్ చేయాలని, సమయానికి జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



