శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ మహా మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేశారు. అనంతరం స్వామి వారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి, కర్పూర హారతులు ఇచ్చారు. సోమవారం కావడంతో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు పునీతులయ్యారు.

మృత్యుంజయస్వామికి వైభవంగా అభిషేకాలు
శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ మహా మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేశారు. అనంతరం స్వామి వారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి, కర్పూర హారతులు ఇచ్చారు. సోమవారం కావడంతో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు పునీతులయ్యారు.

