గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేముల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవగుప్తా అధ్యక్షతన మండలంలోని 16 గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామ సభలు నిర్వహించి ప్రజల అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులతో మౌలిక వసతులు,వ్యవసాయం,విద్య,ఆరోగ్యం వంటి అంశాలపై అధికారులు పారదర్శకతో, సామాజిక న్యాయం పాటిస్తూ,ఆర్థికాభివృద్ధి కోసం స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను రూపొందించి,పనులను పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహసీల్దార్ వీరశేఖర్,ఈఓఆర్డి మహీధర్ రెడ్డి,మండల స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు,పంచాయతీ అభివృద్ధి అధికారులు,డిజిటల్ అసిస్టెంట్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్దె లక్ష్యం…….గడివేముల ఎంపీడీఓ వాసుదేవగుప్తా
గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేముల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవగుప్తా అధ్యక్షతన మండలంలోని 16 గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామ సభలు నిర్వహించి ప్రజల అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులతో మౌలిక వసతులు,వ్యవసాయం,విద్య,ఆరోగ్యం వంటి అంశాలపై అధికారులు పారదర్శకతో, సామాజిక న్యాయం పాటిస్తూ,ఆర్థికాభివృద్ధి కోసం స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను రూపొందించి,పనులను పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహసీల్దార్ వీరశేఖర్,ఈఓఆర్డి మహీధర్ రెడ్డి,మండల స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు,పంచాయతీ అభివృద్ధి అధికారులు,డిజిటల్ అసిస్టెంట్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

