నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పరంగి రాము, ఏఐఎఫ్డీఎస్ నాయకుడు కాశి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పరంగి రాము, ఏఐఎఫ్డీఎస్ నాయకుడు కాశి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

