ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో గతంతో పోలిస్తే వసతులు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. రేషన్ దుకాణాల నిర్వహణ కూడా సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందిస్తున్నారని చెప్పారు. గంగిరెద్దుల కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రికార్డుల నిర్వహణ, టి.హెచ్.ఆర్., చిన్నారుల సంరక్షణ, సేవల అమలులో వర్కర్ లక్ష్మీకాంతమ్మ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. యూనియన్ జిల్లా కమిటీ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.

హాస్టళ్లలో వసతులు మెరుగయ్యాయి: ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో గతంతో పోలిస్తే వసతులు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. రేషన్ దుకాణాల నిర్వహణ కూడా సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందిస్తున్నారని చెప్పారు. గంగిరెద్దుల కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రికార్డుల నిర్వహణ, టి.హెచ్.ఆర్., చిన్నారుల సంరక్షణ, సేవల అమలులో వర్కర్ లక్ష్మీకాంతమ్మ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. యూనియన్ జిల్లా కమిటీ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.

