Monday, 20 April 2026

Blog

కామారెడ్డి

కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచీల పంపిణీ

కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచీల పంపిణీ కామారెడ్డి/ ఏప్రిల్ 17 /పున్నమి ప్రతినిధి కే.పి రాజా రెడ్డి జన సేవా సంస్థ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వేంకట రమణా రెడ్డి సొంత నిధులతో కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచీల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ గంజ్ హైస్కూల్‌లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 74 డెస్క్ బెంచీలను కౌన్సిలర్ ప్రీతి విపుల్ జైన్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతి జైన్ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి స్థాయికి చేరాలని సూచించగా, ప్రధానోపాధ్యాయురాలు గీత గారు పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కొత్తగా నిర్మించిన పాఠశాల భవనం నూ త్వరగా అందేలా చూడాలని వారిని కోరారు. సంస్థ ప్రతినిధి విపుల్ జైన్ విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్న తమను సంప్రదించవచ్చని ప్రధానోపాధ్యాయురాలు గారికి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు సునీత మేడం మరియు రాజేంద్ర గారు మరియు శైలజ కృష్ణవేణి గార్లు రాజేందర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుల సమావేశం – ప్రభుత్వ విధానాలపై ఆందోళన, మేడే ఏర్పాట్లపై చర్చ

ముస్తాబాద్ ఏప్రిల్ 17 పున్నమి ప్రతినిధి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాబోయే రోజులలో మేడే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశంపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డు నిధులు సక్రమంగా వినియోగం కావడం లేదని, అవి వృథా అవుతున్నాయని విమర్శించారు. “ఆరోగ్య రక్ష” పేరిట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించడం వల్ల కార్మికులపై దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని అన్నారు. రక్త పరీక్షల పేరుతో రూ.3200 వరకు దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు అబ్రహం, దేవయ్య, అబ్రహం, ఉప్పలయ్య, కొల్లూరు, పుల్లూరి రాములు, గంగయ్య, అన్నమేని లక్ష్మయ్య, మల్లయ్య, సునూరు రఘుపతి, సాయిలు, దబిడ అంజయ్య, పిల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

మహబూబ్ నగర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు , పెన్షనర్ల న్యాయమైన కోరికలను, దీర్ఘకాలిక అపరిస్కృత డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 17/04/2026* *తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారులు కార్మికులు మరియు పెన్షనర్స్ మెజారిటీ అభిప్రాయాల మేరకు దశల వారి ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకమై ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చారని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ .ఎన్ విజయకుమార్ డిమాండ్ చేశారు, దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు దాదాపు 64 అంశాలు సత్వరమే పరిష్కరింప చేయాలని ఈరోజు మండల జిల్లా కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలియజేశారు, పిఆర్సి రిపోర్టును తెప్పించి జూన్ రెండు లోపు అమలు చేయాలని ఇప్పటికే 30 నెలలు పూర్తయి పుణ్యకాలం గడిచిందని వారు తెలియజేశారు, పెండింగ్ బిల్లులు నెలకు సగటున 600 ఉద్యోగులు రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయని ముఖ్యంగా పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మానవత్వం దృష్టితో వారికి వచ్చే బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలు మే ఒకటి నుంచి వైద్య సేవలు అందించాలని అలాగే 2004 కంటే ముందు నియామకమైన ఉద్యోగస్తులు అందరినీ సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్చాలని తదితర 64 అంశాలతో దశల వారి ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సత్వరమే ప్రభుత్వం స్పందించి న్యాయమైన దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరారు*

మహబూబ్ నగర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు , పెన్షనర్ల న్యాయమైన కోరికలను, దీర్ఘకాలిక అపరిస్కృత డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 17/04/2026* *తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారులు కార్మికులు మరియు పెన్షనర్స్ మెజారిటీ అభిప్రాయాల మేరకు దశల వారి ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకమై ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చారని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ .ఎన్ విజయకుమార్ డిమాండ్ చేశారు, దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు దాదాపు 64 అంశాలు సత్వరమే పరిష్కరింప చేయాలని ఈరోజు మండల జిల్లా కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలియజేశారు, పిఆర్సి రిపోర్టును తెప్పించి జూన్ రెండు లోపు అమలు చేయాలని ఇప్పటికే 30 నెలలు పూర్తయి పుణ్యకాలం గడిచిందని వారు తెలియజేశారు, పెండింగ్ బిల్లులు నెలకు సగటున 600 ఉద్యోగులు రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయని ముఖ్యంగా పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మానవత్వం దృష్టితో వారికి వచ్చే బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలు మే ఒకటి నుంచి వైద్య సేవలు అందించాలని అలాగే 2004 కంటే ముందు నియామకమైన ఉద్యోగస్తులు అందరినీ సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్చాలని తదితర 64 అంశాలతో దశల వారి ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సత్వరమే ప్రభుత్వం స్పందించి న్యాయమైన దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరారు*

అన్నమయ్య

రాజుగుంటలో గంగమ్మ తల్లి పూజలు ఘనంగా నిర్వహణ

తిరుపతి జిల్లా చిట్వేలి మండలం రాజుగుంట గ్రామంలో గంగమ్మ తల్లి పూజలు గురువారం నాడు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అన్నలా సునీల్ నివాసంలో గంగమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా ముద్దలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇంటిని, పరిసరాలను శుభ్రపరచి పూలతో, తోరణాలతో అలంకరించారు. గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజా విధానాలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ముద్దలు సమర్పించి గ్రామ సౌఖ్యం, వర్షాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ పూజల్లో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యత కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు.పూజల అనంతరం అన్నలా సునీల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పాల్గొని భోజనాన్ని స్వీకరించారు. అన్నదానం కార్యక్రమం ఎంతో శ్రద్ధగా, వ్యవస్థీకృతంగా నిర్వహించబడింది గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి. గంగమ్మ తల్లి కృపతో గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొంటాయి” అని పేర్కొన్నారు. యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం విశేషంగా నిలిచింది. మొత్తానికి, రాజుగుంట గ్రామంలో జరిగిన గంగమ్మ తల్లి పూజలు భక్తి, సేవా భావం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ కార్యక్రమం గ్రామస్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంప్రదాయాల ప్రాధాన్యతను మరొక్కసారి చాటిచెప్పింది.

E-పేపర్

ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన మాజీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి.

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 17 ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన మాజీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి కి సవాల్ విసిరిన మాజీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి.ఈ రోజు సభ నిర్వహించకుండా అడ్డుకోని టెంట్లను, కుర్చీలను తొలగించిన కాంగ్రెస్ నాయకులు,గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత. బి ఆర్ ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్న పోలీసులు. అధికారుల దుర్వినియోగం చేస్తున్నారని బి ఆర్ ఎస్ నాయకుల ఆరోపణ.

తూర్పు గోదావరి

ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చాటిన విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

గోకవరంలోని  విడెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ ఒలింపియాడ్ పరీక్షల్లో విశేష విజయాలు సాధించారు. గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, జీకే వంటి విభాగాల్లో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని, గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పతకాలను అందుకున్నారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, పతకాలతో పాటు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా విద్యార్థి పవన్ సాయి తన అద్భుత ప్రతిభతో రూ.2,500 నగదు బహుమతిని అందుకోవడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా, ఎల్‌కేజీ,  యూకేజీ విద్యార్థులు కూడా “లిటిల్ స్టార్స్ ఒలింపియాడ్” పరీక్షల్లో పాల్గొని గణితం, ఇంగ్లీష్, సైన్స్, జీకే విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను సాధించారు. వీరికి పతకాలతో పాటు సర్టిఫికెట్లు, గిఫ్ట్‌లు, ఇతర బహుమతులు కూడా ప్రదానం చేయబడ్డాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విజేతలకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.

ఖమ్మం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి నేడు: ఏప్రిల్ 17న దేశవ్యాప్తంగా ఘన నివాళులు

భారతదేశ మాజీ రాష్ట్రపతి, మహోన్నత విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. విద్యారంగానికి విశిష్ట సేవలందించిన రాధాకృష్ణన్ భారతీయ తత్వశాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఆయన ఆలోచనలు, విలువలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు, విద్యావేత్తలు ఘన నివాళులు అర్పించారు.

మహబూబ్ నగర్

హిందూ బంధువులంతా ఏకం కావాలి

*హిందువు బంధువులంతా… ఐక్యతతో ఉండాలి…. అంబత్రయ క్షేత్ర గురు స్వామి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ పిలుపు* *పున్నమి ప్రతినిధి *మహబూబ్నగర్* *జిల్లా ::తేదీ:: 17/04* */2026* *హిందూ బంధువులంతా ఐక్యతతో సంస్కృతి* *సంప్రదాయాలను కాపాడుతూ ఉండాలని హిందూ సమ్మేళన* *కార్యక్రమంలో అంబత్రయ క్షేత్ర గురుస్వామి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ గారు హిందూ* *బంధువులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ,*వడ్డెర బస్తి కాలనీ, తదితర హిందూ బంధువులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని* *విజయవంతం చేశారు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

సాహితీ

ఆధునికాంధ్ర పితామహుడు – డా. బద్రి పీర్ కుమార్

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న జరుపుకుంటాము. ఆధునిక తెలుగు నాటకరంగ పితామహుడు, తొలి నాటకకర్త, దర్శకుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని, 2007 నుండి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుతారు. గొప్ప సంఘ సంస్కర్త, మూఢనమ్మకాలపై యుద్దంప్రకటించిన కలియుగ వైతాళికుడు, బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఆధునిక సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహా పురుషుడు, వితంతు వివాహాల కోసం పోరాడి, 1881లో మొదటి వితంతు వివాహాన్ని జరిపించి, తెలుగులో మొదటి నవల ‘రాజశేఖర చరిత్రము’ మొదటి స్వీయచరిత్ర, మొదటి ప్రహసనం రాసి బాలికల కోసం పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యకు, సాధికారతకు కృషి చేసి, ‘వివేకవర్ధిని’ పత్రిక ద్వారా సమాజంలోని దురాచారాలపై పోరాటం చేయుట వలన, సంఘ సంస్కరణలు మరియు సాహిత్య సేవ కారణంగా ‘ఆధునికాంధ్ర సమాజ పితామహుడు’ గా, ‘గద్య తిక్కన’ గా పేరుపొందిన స్వర్గీయ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సమర్పిస్తున్న ఈ అక్షర సుమాంజలి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *ఆ* ఆధునిక సమాజానికి ఆదర్శప్రాయుడు *ధు* దురితనివారణ సామాజిక కళాకారుడు *ని* నిబంధనలు అరాచకబంధనలు కాకూడదని *కాం* కాంక్షలు సమున్నత జనోద్ధరణ కార్యక్రమాలుగ *ధ్ర* ధరణి యందు వేదికైన జన విజ్ఞాన కేంద్రం *పి* పిలుపు పలుకుల ప్రాయోజిత పర్వం *తా* తాను విశ్వసించిన సమాజ చైతన్యం *మ* మానవత్వ తత్వ మహిమాన్విత దీపం *హు* హుందాతనము ప్రతిబింబించిన రూపం *డు* డుండుగు లేని సంఘ ప్రయోజనాచార్యుడు *కం* కంఠస్వరము కళాత్మక వరము కలవాడై *దు* దురాచార నిర్మూలనకు కంకణబద్ధుడై *కూ* కూడలి సమసమాజ మండలి కావాలని *రి* రివారీగ జన విజ్ఞానసవారి సొంతం చేసుకుని *వీ* విజ్ఞానవీరుడైన సంఘసంస్కర్త *రే* రేయింబవళ్లు సమాజ హితం కోరి *శ* శక్తి యుక్తి సామాజికభక్తి మిళితం చేసి *లిం* లింగ బేధం లేని సమాజాభివృద్ధికై *గం* గమ్యం వైపు హితకారిని సమాజం మలచి *పం* పండితవిద్యను పామరులకు సైతం పంచిన *తు* తులాభార సమభావ సమతౌల్య నిపుణుడు *లు* లుప్తమయిన సమైక్యత సాహిత్య సమీక్షల విశ్లేషకుడు. నేటికి ప్రసరిస్తున్న సామాజిక చైతన్య క్రాంతి కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.