మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ సభ్యుల నియామకం.. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ ఇద్దరు హిందూ సభ్యులను నియమించింది. వక్ఫ్ (సవరణ) చట్టం–2025 ప్రకారం ఈ నియామకాలు చేపట్టిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తొందరపాటుగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. మరోవైపు, నూతన చట్టాన్ని అమలు చేయడంలో ఇది కీలక అడుగని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.











