అనపర్తి, జూలై 8 ( పున్నమి న్యూస్ ): అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వడిశలేరు గ్రామానికి చెందిన బత్తిన చరణ్, గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన గుణపు వేణు మనోహర్, వేండ్ర గ్రామానికి చెందిన ఉప్పలగుప్త వెంకటరమణ ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ప్రమాద బీమా పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.5,00,000 చొప్పున మొత్తం రూ.15,00,000 విలువైన బీమా బాండ్లను అందజేశారు.
ఈ బాండ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జోన్ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రూడా ఛైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సురేష్, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు బాధిత కుటుంబాలకు అందజేసి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




