Monday, 31 August 2026
  • Home  
  • గంజాయి సేవించే వారిపై ‘డ్రగ్ టెస్టింగ్’ అస్త్రం..!
- అనకాపల్లి

గంజాయి సేవించే వారిపై ‘డ్రగ్ టెస్టింగ్’ అస్త్రం..!

అనకాపల్లి జిల్లా: ఆగస్టు 30 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) యలమంచిలి : మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు పట్టణ ఎస్ఐ సావిత్రి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గంజాయి, డ్రగ్స్ సేవించే వారిని తక్షణమే గుర్తించేందుకు అత్యాధునిక ‘డ్రగ్ టెస్టింగ్ కిట్ల’ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టౌన్ ఎస్సై సావిత్రి తెలిపారు. ఇటీవల పట్టణ పరిధిలో గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో కొంతమందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురు మాదకద్రవ్యాలు వాడినట్లు రిపోర్టుల్లో నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. వారిని వ్యసనం నుంచి బయటపడేసి, పునరావాసం కల్పించేందుకు అనకాపల్లిలోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి ఉచిత వైద్యం, మానసిక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి సేవించినా లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. యలమంచిలిని ‘డ్రగ్ ఫ్రీ టౌన్’గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్ డిఆర్‌పి రమ్య, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా: ఆగస్టు 30 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

యలమంచిలి : మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు పట్టణ ఎస్ఐ సావిత్రి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గంజాయి, డ్రగ్స్ సేవించే వారిని తక్షణమే గుర్తించేందుకు అత్యాధునిక ‘డ్రగ్ టెస్టింగ్ కిట్ల’ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టౌన్ ఎస్సై సావిత్రి తెలిపారు. ఇటీవల పట్టణ పరిధిలో గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో కొంతమందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురు మాదకద్రవ్యాలు వాడినట్లు రిపోర్టుల్లో నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. వారిని వ్యసనం నుంచి బయటపడేసి, పునరావాసం కల్పించేందుకు అనకాపల్లిలోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి ఉచిత వైద్యం, మానసిక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి సేవించినా లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. యలమంచిలిని ‘డ్రగ్ ఫ్రీ టౌన్’గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్ డిఆర్‌పి రమ్య, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.