భారతీయ జనతా పార్టీ ఒకటో పట్టణ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గడీల నరేష్ఆ ధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్ , మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి , జిల్లా నాయకులు జనార్దన్ రావు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెడ సంపత్ నాయుడు , జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ తుమ్మ శివ పాల్గొన్నారు. అలాగే మండల పదాధికారులు పాలెపు రాము , పొట్టిముత్తి వాణి, ఖాదర్ బాబు . ఊరుకొండ ప్రభాకర్ నాయుడు , కాదుదుల బాలి, బిందు, తుమ్మ ఇందు, భాజోజకుమార్ , మారెమల్ల రామకృష్ణ , కన్నెబోయిన రాజేష్ పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.



