ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
భైంసా మున్సిపాలిటీ
నాగుల పంచమి పండుగ రోజున భైంసా పట్టణంలోని ఏపీ నగర్, గోపాల్ నగర్, శాస్త్రి నగర్, సంబాజి చౌక్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ రోజు కావడంతో ఇంటి వద్ద పూజలు నిర్వహించుకునేందుకు నీరు అవసరం కాగా, సరఫరా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు..పండుగ సమయాల్లోనే తరచూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంపై ఆయా ప్రాంతాల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో పండుగ రోజుల్లోనైనా నిరంతర నీటి సరఫరా అందించాలని వారు అధికారులను కోరుతున్నారు.


