పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 31)
వేముల, ఆగస్టు 31: కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వేముల మండలానికి సంబంధించిన పలు సమస్యలను పార్టీ కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జడ్పీటీసీ భయపరెడ్డి, మల్రెడ్డి, రాఘవరెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో చర్చించారు. మండలంలోని ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



