అనకాపల్లి జిల్లా ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
యలమంచిలి, కొత్తపాలెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు వేసుకోవాలని దానికి అనుగుణం గా మండలంలో 800 హెక్టార్లకు చిరుధాన్యాలను ఇండెంట్ పెట్టడం జరిగిందని తెలియజేశారు. కొత్తపాలెం గ్రామంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం చేత వరి నారు మడులు వాడిపోతున్నట్టుగా గుర్తించడం జరిగినది. దీనికిగాను 19 19 19 నీటిలో కరిగే ఎరువు 5 గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా రెండు గ్రాములు యూరియా ఒక లీటర్ నీటికి లేదా 13 0 45 ఎరువు 5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నీటి ఎద్దడి నుంచి రక్షించుకోవచ్చు అని తెలియజేశారు. చిరుధాన్యాలు రాగులు, గంట్లు, ఉలవలు, జనము తదితర విత్తనాలను ఇండెంట్ పెట్టి రైతు సేవ కేంద్రం ద్వారా వరికి ప్రత్యామ్నాయంగా రైతుల అవసరాల మేరకు ఇండెంట్ పెట్టడం జరిగిందని తెలియజేశారు ఈ. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు అరుణ, రైతులు ఆడారి. జగన్నాథం, ఆడారి. సోమనాయుడు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


