Tuesday, 12 May 2026

Blog

ఎలూరు

శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం

ఈ వార్తకు ఫోటో కలదు రైటప్ : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారు. శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం ఆగిరిపల్లి, ఆగస్టు 4 స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ఆలయ కార్య నిర్వాహణాధికారి సిహెచ్ సాయి పర్యవేక్షణలో సోమవారం ఘనంగా ప్రారంభయ్యాయి. శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి (నాలుగో తేదీ నుండి ఏడవ తేదీ వరకు) నుండి త్రయోదశి వరకు శోభనాద్రిపై స్వయం వ్యక్తంగా వేంచేసి యున్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయ సన్నిధిలో శ్రీ వైఖాన సాగమ శాస్త్రానుసారంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ నిత్య కార్యక్రమము లు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రోత్సవ విశేష కార్యక్రమములు. నీరాజన మంత్ర పుష్ప తీర్థ ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు తెలిపారు. సోమవారం ఉదయం శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్లకు పరివార దేవతలకు స్నపన, విశేషాలంకరణ, నిరాజన మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వినియోగము. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచన, అజస్త్ర దీపారాధన, ఆచార్య అర్చక రుత్విక్ యజమాన దీక్షాధారణ, మృత్సం గ్రహణము, అంకురారోపణ, నిరాజనం మంత్ర పుష్ప తీర్థప్రసాద్వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేశారు.

ఖమ్మం

మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 4 ఖమ్మం జిల్లా మహా సంపర్క్ అభియాన్ ప్రెస్ మీట్ ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షత న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జి గా నియమితులు అయిన మాజీ మంత్రివర్యులు ఇనుగాల పెద్దిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక పోస్టర్ ను విడుదల చేసి,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గల పరిధిలో గల సర్పంచ్ స్థానాలు,అత్యధికంగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి స్థానాలు గెలుచుకొనే విధంగా విజ్ఞులైన ఖమ్మం జిల్లా ప్రజానికం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మొదలుకొని మండల నాయకత్వం వరకు నిర్విరామము గా కృషి చేసి భారతీయ జనతా పార్టీ కాషాయ భావుట ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ, గడీల నరేష్, రామకృష్ణ, అల్లిక అంజయ్య,నున్న రవి, దేవకీ వాసు దేవరావ్, ఈవి రమేష్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరావ్, విజయ్ రాజు, తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

*శ్రీ సరస్వతీ శిశు మందిర్ కి రూ.50000 విరాళం*

శ్రీకాళహస్తి పట్టణం ముత్యాలమ్మ గుడివీధి లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు పాఠశాల ప్రబంధకారిణి సమావేశం పాఠశాల అధ్యక్షులు చాగణం భక్తవత్సలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను చర్చించడం జరిగింది.ప్రబంధకారిణి సభ్యుల ఆధ్వర్యంలో పెద్దపంజాని మండలం పెద్దకప్పాలి ఇండియన్ బ్యాంకు మేనేజర్ AVSK సురేష్ గారు పాఠశాల అభివృద్ది కొరకు రూ .50000 విరాళంగా అందించారు.అందుకు గాను కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డా. లక్ష్మీ నారాయణ, కాలంకారి పద్మావతి, మంగి రెడ్డి, బచ్చు ఆనంద రావు,రాజేష్ వర్మ,ప్రకాష్ ,ఉమాశంకర్ సుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

హేరే కార్ శ్రీను గారి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు హేరే కార్ శ్రీను గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వివేరా హోటల్ లో పుట్టినరోజు సందర్భంగా హేరే కార్ శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీహరి గారు ఆలేరు ఎమ్మెల్య ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారు వారు మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ గారు సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరిగుట్ట మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఖమ్మం

బిజెపి మహా సంపర్క్ అభియాన్. ముఖ్య అతిధి గా హాజరైన తాండ్రా వినోద్ రావు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 4 ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం లోని నేలకొండపల్లి మండలము లో బిజెపి మండలఅధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన పైనంపల్లి గ్రామంలో బూత్ నంబర్ 271,272, లలో బూత్ అధ్యక్షులు కొండా రవి బాబు,కారంగుల వీరయ్య ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ *ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు* కార్యక్రమం జగింది. ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మండల, జిల్లా నాయకులతో కలిసి ప్రతి గడపకు వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పనులను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ , సీనియర్ నాయకులు మన్నే కృష్ణా రావు,భవనాసి దుర్గారావు,సూరేపల్లి జ్ఞానరత్నం,మహ్మద్ షరీఫుద్దీన్,తంగెళ్ల సతీష్ కందరబోయిన వెంకటరమణ మన్నే రాధా కృష్ణ, బాజా రామకృష్ణ రావు, గెల్లా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ముగిసిన డీఎస్సీ క్రీడా కోటా ధ్రువపత్రాల పరిశీలన..

ముగిసిన డీఎస్సీ క్రీడా కోటా ధ్రువపత్రాల పరిశీలన..* విజయవాడ క్రీడలు మెగా డీఎస్సీకి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరా గాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియంలో ముగిసింది. ఈ ప్రక్రియ శని, ఆదివారాల్లో సాగింది. 421 పోస్టులకు గాను 1,221 మంది అభ్యర్థులను పిలవగా.. 1,172 మంది హాజరయ్యారని శాప్ పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణ నాయక్ తెలిపారు. మరో రెండు రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్ లైన్ లో పెడతామన్నారు. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

ఖమ్మం

10 న శ్రీమతి జెన్నా రెడ్డి విజయరెడ్డి దశదిన కార్యక్రమం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వంగాముత్యాల బంజర్ లో ఉన్న రాజా సాయి మందిర చైర్మన్ శ్రీమతి జెన్నా రెడ్డి విజయ రెడ్డి గారు గత గురువారం గుండెపోటు తో మరణించారు. ప్రముఖ సాయి భక్తురాలు, నిస్వార్ధ సేవకురాలు, ఎంతో మంది పేద ప్రజలకి నిస్వార్థం గా సేవచేశారూ. వారి యొక్క దశదిన కర్మ కార్యక్రమం 10 వతేది న సప్త పది ఫంక్సన్ హాల్ నందు జరుగుతుంది అని అమే భర్త రిటైరడ్ సీఐ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకులకు కూటమి నాయకులు సవాల్

బహిరంగ చర్చలకు మేము సిద్ధం…!! మీరు సిద్ధమా..?? అసత్య ప్రచారాలు నమ్మే యోచనలో ప్రజలు లేరు మీ అసలు రూపం తెలిసి 11 సీట్లు ఇచ్చారు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతో ఆధారాలతో ఉన్నాయి కోనసీమ,ఆగస్టు04,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే యోచనలో లేరన్నారు.మాజీ ఎమ్మెల్యే మీ నాయకుడు జగ్గిరెడ్డి దళితుల పై పెట్టిన అక్రమ కేసులు దళితుల భూములు లాక్కొని చేసిన అగైత్యాలు మర్చిపోయి ఈరోజు సిగ్గులేకుండా వైసీపీ నాయకులు ఎలా తిరుగుతున్నారో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.కొన్ని రోజుల క్రితం ఆత్రేయపురం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మాట్లాడిన అసత్య మాటలకు మేము నిజాలను నిరూపించాల్సిన అవసరం లేదని నిజానిజాలు ప్రజలు చూస్తున్నారన్నారు.మీకు ఏదైనా ఉంటే దైర్యం ఉంటే బహిరంగ చర్చలకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ ఎదుగుదలను చూడలేక ఓర్వలేక ఆయనపై చేస్తున్న అస్త్యప్రచారాలు మానుకోవడం మంచిదన్నారు.శాసనసభ్యులు బండారు సత్యానంద రావు ప్రజలకు ఏమి చేశారో అందరికీ తెలుసు మీకు తెలియక్కర్లేదన్నారు.మద్యం కోసం మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎంత ఇచ్చారో మీ జేబు లలో ఎంత వేసుకున్నారో చిట్ట మొత్తం మా దగ్గర ఉంది అలాగే మట్టి ఇసుక మాఫియా అంటున్నారు 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వం హయంలో ఎక్కడ ఎక్కడ కొల్లగొట్టి నది పాయలను అడ్డంగా చీల్చి బకాసురుడువలే మేసిన రోజులు మర్చిపోయి నేడు ప్రజలకు అందుబాటు ధరలో తెచ్చిన మా నాయకులను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు.అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు తేడాలను ప్రజలే చూస్తూ ఉన్నారు మీరు నీతి నిజాయతీ అని హాస్యాస్పద మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు.మీ నాయకుడు అమాయకపు దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టీ ఏ పని చేసుకోకుండా చేసినప్పుడు అలాగే దళితుల భూములు లాక్కొని వారిని హింసించినప్పుడు నోరు మెదపని నాయకులు నేడు మీడియా సమావేశాలు పెట్టడం ఏమిటో వారి విజ్ఞతకే ఉదిలేస్తున్నామన్నారు.వికలాంగుల పెన్షన్ లు ఇప్పిస్తామని సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తామని వెల్లకి వేలు దోచేసిన సొమ్ము ఎవరెవరు పంచుకున్నారో పద్దులు మొత్తం మా దగ్గర ఉన్నాయి అలాగే పని పథకంలో ఎంత దోసుకున్నారో కూడా ఉందన్నారు.ఈరోజు అయిన సరే బహిరంగ చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము స్థలం చెప్పండి మేమే వస్తాము అని ప్రతిపక్ష నాయకులకు సవాళ్లు విసిరారు.ఈ కార్యక్రమంలో పాలంగి రవి చంద్ర ,కుసంపూడి రామరాజు ,తోట వెంకట రమణ,గుడెల నాగేంద్ర,మిద్దె గోపాలకృష్ణ,నాగిరెడ్డి సత్యనారాయణ,అంబుల రామకృష్ణ,జోగి ప్రసాద్,మిద్దె పాపారావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అనారోగ్యాలతో ప్రజలు.కాలుష్యం కోరల్లో కొత్తకండ్రిగ గ్రామం

ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలో ఉన్న పుష్పత్ కర్మగారం నందు విపరీతమైన కాలుష్యంఫ్యాక్టరీ నుంచి వదిలి వేస్తున్నారు. ఈ కాలుష్య కోరల్లో కొత్త కండ్రిక గ్రామం అలాగే చుట్టు పక్కల చాలా గ్రామాలు పుష్పత్ కర్మాగారం నుంచి వెలువడే దుమ్ముతో కూడినటువంటి పొగతో గ్రామంలోని ఇళ్ళ మొత్తం నిండిపోతుంది. పైగా దీనివలన లో త్రాగునీరు కలుషితం అయ్యి దాని వలన అనేక రకాల తెలియని అనారోగ్య సమస్యలను గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇలాగే ఉంటే అంతుచిక్కని రోగాలతో ప్రాణం నష్టం కలిగే అవకాశం ఉందని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, నాయకులు స్పందించి సంబంధిత కర్మకారాన్ని పై కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమిరెడ్డి చొరవతో కండలేరు ఎడమ కాలువకు జలకళ

*సోమిరెడ్డి చొరవతో… కండలేరు ఎడమ కాలువకు జలకళ..* *-స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన టిడిపి నాయకులు…* *-సోమిరెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసిన రైతులు..* *పొదలకూరు:* కండలేరు జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఎడమ కాలువలో గత కొద కొద్ది రోజులుగా నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో ఎడమ గట్టు కాలువ క్రింద సాగులో ఉన్న వరిపైర్లు, నిమ్మతోటలతో పాటు పశువులకు తాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పొదలకూరు మండల టీడీపీ నాయకులు ద్వారా రైతులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది దృష్టికి తీసుకెళ్లారు. ఎడమ కాలువ లిఫ్ట్ లో విద్యుత్ సరఫరాను అందించే ట్రాన్స్ ఫార్మర్ పిడుగుపాటుకు గురవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యను ఇటీవల డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో కలెక్టర్ ఆనంద్ స్పందించి నిధులు మంజూరు చేశారు. దీంతో సోమిరెడ్డి ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లకు సర్వీస్ చేయడం తోపాటు ఆదివారం మండల టీడీపీ నాయకులతో కలిసి అధికారులు ఎడమ కాలువకు లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమ కాలువకు నీరు విడుదల చేయించి పంటలు కాపాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఈ ప్రాంత రైతులు ధన్యవాదములు తెలిపారు. నీరు విడుదల చేసిన వారిలో ఇరిగేషన్ అధికారుల తోపాటు టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, దేవినేని శరత్, పులిపాటి వెంకటేశ్వర్లు, ఎత్తపు వెంకట రెడ్డి, వెన్నపూస శ్రీనివాస్ రెడ్డి, మలిరెడ్డి ఓబుల రెడ్డి, రమణా రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.