అనకాపల్లి జిల్లా, ఆగస్టు 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 1600 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్సైలు సహా పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ముఖ్య మార్గాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.


