విశాఖ: పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు అగనంపూడిలో ఘనంగా జరిగాయి. చిరంజీవి యువత అధ్యక్షులు విందుల చిరు రాజు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
ముందుగా పెదమడక శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో చిరంజీవి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
గాజువాక జనసేన సీనియర్ నాయకులు విందుల వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.






