మంగళవారం నాడు వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని స్థానిక మండల వ్యవసాయ అధికారి జి. ఓబులేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేల్పుల గ్రామ పరిధిలో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పులివెందుల వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వేరుశనగ పంటలో సస్యరక్షణ పద్ధతులను, నీటి యాజమాన్య పద్ధతులను మరియు చీడపీడల నివారణకు తగిన సూచనలు సలహాలను రైతులకు క్లుప్తంగా వివరించారు అదేవిధంగా ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలిక వ్యవధి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా ఎరువులను శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదు మేరకే ఉపయోగించాలని అధిక ఎరువుల వాడకం ద్వారా భూసారం నిస్సారం అవుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి జి. ఓబులేసు రైతు సేవా కేంద్రాల సిబ్బంది లక్ష్మీప్రసన్న, కిషోర్ నాయక్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.





