Tuesday, 25 August 2026
  • Home  
  • విద్యార్థుల ఉపకార వేతనాల కోసం బీజేపీ దీక్షకు ఖమ్మం నేతల మద్దతు
- ఖమ్మం

విద్యార్థుల ఉపకార వేతనాల కోసం బీజేపీ దీక్షకు ఖమ్మం నేతల మద్దతు

హైదరాబాద్ / ఖమ్మం విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. ఈ బృందంలో చిలుకూరు రమేష్, నరకుళ్ళ వెంకటేశ్వర రావు, దొడ్డపునేని కృష్ణయ్య, సుబ్బారావు, రేఖ సత్య నారాయణ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ / ఖమ్మం

విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. ఈ బృందంలో చిలుకూరు రమేష్, నరకుళ్ళ వెంకటేశ్వర రావు, దొడ్డపునేని కృష్ణయ్య, సుబ్బారావు, రేఖ సత్య నారాయణ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.