Sunday, 10 May 2026

Blog

అన్నమయ్య

కోడూరు గ్రామ పంచాయతీ వర్కర్స్ రెండు నెలల జీతాలు చెల్లించాలి! సిఐటియు డిమాండ్!!

రైల్వే కోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరులో గ్రామపంచాయతీ కార్మికులకు జూన్ జూలై, రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి, పి. జాన్ ప్రసాద్, డిమాండ్ చేశారు. 27 వినాయక చవితి పండుగ జరుగుతున్న, కార్మికుల పస్తులతో ఉండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారి గడవని కార్మికులకు, కనీసం, నెలకు జీతం ఐదో తేదీ లోగా ఇవ్వాలని కోరారు. వారికి వచ్చే జీతం, సిఐటియు పోరాట ఫలితంగా, 13600 ఇస్తున్నారని, కొందరికి స్వచ్ఛభారత్ కార్మికులకు మాత్రం, 6000 నుంచి 10000 పెంచేయడం జరిగినదని. ఇద్దరు ఒకే పని చేస్తున్న, జీతాల్లో వ్యత్యాసం ఉందని, తక్షణం అందరికీ ఒకే వేతన ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో, పంచాయతీలో, ఒకే రకమైన పనిచేస్తున్నారని, మున్సిపాలిటీకి ఇచ్చే వేతనాలే ఇవ్వాలన్నారు.తక్షణమే ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్

ఫోన్‌పే నుంచి ₹181కే పూర్తి ఇంటి బీమా!

*పున్నమి న్యూస్ స్టాప్ రిపోర్టర్ యాముల రామమూర్తి* ఫిన్‌టెక్‌ దిగ్గజం ఫోన్‌పే గృహ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా కేవలం **₹181 వార్షిక ప్రీమియంతో** ఇంటికి పూర్తి భద్రత కల్పించే సరికొత్త హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది. **ఈ పాలసీలోని ముఖ్యాంశాలు:** * **ప్రీమియం:** ₹181 నుంచి ప్రారంభం అవుతుంది. * **బీమా హామీ:** ₹10 లక్షల నుంచి ₹12.5 కోట్ల వరకు కవరేజీ లభిస్తుంది. * **నష్టాలకు కవరేజీ:** అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు, అల్లర్లు, దొంగతనాలు వంటి 20కి పైగా రకాల నష్టాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది. * **ఏయే వాటికి కవరేజీ వర్తిస్తుంది:** ఇంటి నిర్మాణం, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మరియు విలువైన వస్తువులకు ఈ బీమా వర్తిస్తుంది. * **పాలసీ పొందడం:** ఫోన్‌పే యాప్ ద్వారా ఎటువంటి పత్రాలు లేకుండా, పూర్తిగా డిజిటల్ ప్రక్రియలో, నిమిషాల్లోనే పాలసీ పొందవచ్చు. **ఫోన్‌పే సీఈఓ విశాల్ గుప్తా వ్యాఖ్యలు:** ఫోన్‌పే సీఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ, “ప్రతి భారతీయుడికి బీమాను తక్కువ ఖర్చుతో, సులభంగా అందించడమే మా లక్ష్యం. ఈ కొత్త గృహ బీమా పాలసీతో సొంత ఇల్లు అనే కలను సాకారం చేసుకున్న వారికి, వారి అత్యంత విలువైన ఆస్తిని రక్షించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు. ఎలాంటి తనిఖీలు లేదా పెద్ద పత్రాల ప్రక్రియ లేకుండా ఈ పాలసీని సులభంగా ఎంచుకోవచ్చని ఆయన తెలిపారు. **ఈ పాలసీ ప్రత్యేకతలు:** సాధారణంగా గృహ రుణాలకే బీమా లభిస్తుంది, కానీ ఫోన్‌పే తీసుకొచ్చిన ఈ పాలసీ గృహ రుణం ఉన్నవారికే కాకుండా, లేని వారికి కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, అన్ని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు కూడా ఈ పాలసీని గృహ రుణాల కోసం అంగీకరిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ తక్కువ ప్రీమియం-పెద్ద కవరేజీతో కూడిన పథకం గృహ యజమానులకు ఆర్థిక భద్రతను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భక్తి

ముంబైలో అత్యంత ధనిక వినాయకుడు

ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ 267 కేజీల బంగారు ఆభరణాలు, 350 కేజీల వెండి సింహాసనంతో గణపతి విగ్రహం అలంకరణ ముంబైలో గణేశ్‌ చతుర్థి వేడుకల సందడి ప్రారంభమైంది. నగరంలోని ప్రముఖ మాతుంగా గణపతి (GSB గణపతి) దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా మరోసారి గుర్తింపు పొందాడు. 70 ఏళ్లుగా గౌడ సారస్వత బ్రాహ్మణ (GSB) ట్రస్ట్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తోందని నిర్వాహకులు తెలిపారు. గణపతి విగ్రహానికి అత్యంత భారీగా రూ.444 కోట్ల బీమా తీసుకున్నారు. ఇందులో విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు, మండపం వద్ద జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించిన భద్రతా కవర్లు ఉన్నాయి. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు గణపతిని దర్శించుకుని, అన్నదానం సేవలో పాల్గొంటున్నారు. మాతుంగా గణపతి ప్రత్యేకత ఏమిటంటే….ఏటా దశాబ్దాలుగా బంగారం, వెండి విరాళాలు పెరుగుతూనే ఉండటంతో ఈ గణపతి దేశంలోనే అత్యంత ధనికుడిగా నిలుస్తున్నాడు….

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి:-

న్యూస్ ఆగస్టు 26 కాట్రేనికోన గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హైస్కూల్లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిరాం విద్యానికేతన్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ,కుత్రిమ రంగులు, రసాయనాలతో కూడిన విగ్రహాలను పూజించి చెరువులలో ,కాలువలలో నిమజ్జనం చేయడం వలన జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని, తద్వారా జలాలలో నివసించే జీవుల మనుగడ కూడా కష్టం అవుతుంది .మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులు, పరిసరాలు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే వినాయక విగ్రహాల అలంకరణలో సహజమైన రంగులను వాడాలని, పూజలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ధర్మకోల్ వాడొద్దని మన భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా విద్యార్థులు మట్టితో గణేష్ బొమ్మలను తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, గెల్లా భూలక్ష్మీదేవి, కె.నాగ దివ్య, ఎన్ దేవకి, ఏ. ప్రత్యూష, ఏ.శిరీష, డి.వీర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు వినాయాక చవితి వేడుకలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరం లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠ శాల విద్యార్థిని విద్యార్థులు గణేషుడు యొక్క ఆశీస్సులతో బాగా చదువు కోవాలి అని విఘ్నేశ్వరుణ్ణి పూజించారు. ఖమ్మం నగర ప్రజలకి ఈ సం దర్భముగా పాఠ శాల చైర్మన్ సాయి మెహర్, డైరెక్టర్ కిషోర్, ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారూ. ఈ కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ

న్యూస్ ఆగస్టు 26 కాట్రేనికోన వినాయక చవితి సందర్భంగా కాట్రేనికోనలో తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు గ్రంధి నానాజీ, తాతపూడి బుల్లి, సుంకర పవిత్రకుమార్, ఆకొండి ఉమామహేష్, శ్రీకాంత్, అల్లవరపు సత్యనారాయణ, వింజమూరి శ్రీనివాస్, మల్లాడి సత్యవతి, ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ,ఆకొండి అంజి, కిరణ్ శర్మ,ఆకొండి సూర్యకాంతం, ఆకొండి లీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన పలువురికి మట్టి గణపతులను ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు అందజేసారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బిజెపి అధ్యక్షుడు మాధవ్ ను కలిసిన ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు.

న్యూస్ ఆగస్టు 26 కాట్రేనికోన ఎపి బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ అనంతరం సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, ముమ్మిడివరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ గొలకోటి వెంకటరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మాధవ గారు నియోజవర్గంలో పార్టీ యొక్క బలవపేతానికి సూచనలు చేశారు ప్రతి కార్యకర్తను వ్యక్తిగతంగా కలసి పార్టీ కోసం పనిచేసే విధంగా తయారు చేయాలని సూచించారు బూత్ కమిటీలను బోలోపేతం చేసినప్పుడు పార్టీ పటిష్టంగా తయారవుతుందన్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అనకాపల్లి ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు, బిజెపి జిల్లా నాయకులు బాబి మాస్టారు, రాయపురెడ్డి భైరవ మూర్తి, మట్టా సూరిబాబు కాట్రేనికోన మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్, అజయ్ వర్మ, విజయ్, బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

వినాయక చవితి వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. “గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి” అని ఆయన ఆకాంక్షించారు.వేడుకలు, గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరిన ఎస్పీ గారు, ప్రజలు పోలీసు విభాగం సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసుల సూచనలుఅధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పరిమితిలో ఉంచాలి.ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.రహదారులపై వాహనాలను అడ్డంగా నిలపరాదు. నిమజ్జన కార్యక్రమాల్లో పోలీసుల సూచనలు పాటించాలి.మద్యపానం చేసి వేడుకల్లో పాల్గొనరాదు.చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో అల్పపీడనం…! ప్రభుత్వం అప్రమత్తం.

ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తం. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత సమీక్ష. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉండాలి. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలి..హోంమంత్రి అనిత.

ఖమ్మం

తెలంగాణ భారీ వర్ష సూచన

పున్నమి ప్రతి నిధి తెలంగాణ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.