పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీటిమట్టం రోజురోజుకు స్వల్పంగా తగ్గుతుంది గురువారం 1.944 టీఎంసీల నీరు నిలువ ఉంది జలాశయం సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం లేదని అధికారులు తెలిపారు కుడి ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయడం లేదన్నారు పూర్తిస్థాయి నీటిమట్టం 1482 .50 అడుగులకు గాను ప్రస్తుతం 1482 అడుగులుగా నమోదయింది



