చిట్వేల్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చిట్వేల్ పట్టణంలోని వైయస్సార్ సర్కిల్లో వైయస్సార్ విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్సార్ సేవలను, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకున్నారు.
వైయస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



