జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ రామారావు తెలిపారు. మొత్తం 6 పోస్టులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్–3, నర్సింగ్ ఆఫీసర్–3 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు MBBS, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు B.Sc నర్సింగ్ లేదా GNM అర్హత కలిగి ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ దరఖాస్తులను కూడా DMHO కార్యాలయంలో సమర్పించాలని డాక్టర్ రామారావు తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



