జనసేన ఆత్మీయ సమావేశంలో శ్రీ సుంకర శ్రీనివాస్కు ఘన సత్కారం
పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తించిన మంత్రి నాదెండ్ల మనోహర్
పున్నమి ప్రతినిధి, మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో మంగళగిరిలో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్ గారికి ఘన సత్కారం లభించింది.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ సుంకర శ్రీనివాస్ గారు ప్రస్తుతం జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇంచార్జ్గా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ సుంకర శ్రీనివాస్ గారిని ఘనంగా సత్కరించారు.
పార్టీ కోసం శ్రీ సుంకర శ్రీనివాస్ గారు అందించిన సేవలను, జనసేన పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు.



