లారీ – బైక్ ఢీ – బైకర్ మృతి*
*దొరవారిసత్రం, కుప్పారెడ్డి పాలెం ఆగస్టు 29:*
చెన్నై – నెల్లూరు జాతీయ రహదారిపై శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న బైక్ (AP 40L U2692) ను, అదే దిశలో వెళ్తున్న లారీ (AP 02 TE 5959) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


