రేవుపోలవరం: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
జడ్పీహెచ్ఎస్ రేవుపోలవరం పాఠశాలలో శనివారం *తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవంను* పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనం, తెలుగు సాహిత్యానికి ప్రముఖుల చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేసిన *గిడుగు వెంకట రామమూర్తి పంతులు* సేవలను స్మరించుకున్నారు. మాతృభాషను ప్రేమించి, గౌరవించి, నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు.
అదేవిధంగా *జాతీయ క్రీడా దినోత్సవం* సందర్భంగా హాకీ దిగ్గజం *మేజర్ ధ్యాన్చంద్ను* స్మరించుకున్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు వివిధ క్రీడలపై అవగాహన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు మరియు *విద్యార్థులు* పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. *”మాతృభాషను గౌరవిద్దాం – క్రీడలను ప్రోత్సహిద్దాం”* అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.


