మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఏజీఎన్ జ్యువెలర్స్ అధినేతలు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో సామూహిక వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.గణపతి పూజ, పుణ్యాహవాచనం, వరలక్ష్మీ కలశ ప్రతిష్ఠ, అష్టాంగ పూజ, తోరపూజలు నిర్వహించి మహిళలు పరస్పరం తోరాలు కట్టుకున్నారు. అనంతరం అమ్మవారి కలశాన్ని కోనేరులో నిమజ్జనం చేశారు. పాల్గొన్న భక్తులకు దాతలు వాయనాలు, దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు.

మహానంది క్షేత్రంలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఏజీఎన్ జ్యువెలర్స్ అధినేతలు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో సామూహిక వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.గణపతి పూజ, పుణ్యాహవాచనం, వరలక్ష్మీ కలశ ప్రతిష్ఠ, అష్టాంగ పూజ, తోరపూజలు నిర్వహించి మహిళలు పరస్పరం తోరాలు కట్టుకున్నారు. అనంతరం అమ్మవారి కలశాన్ని కోనేరులో నిమజ్జనం చేశారు. పాల్గొన్న భక్తులకు దాతలు వాయనాలు, దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు.

