మహానంది క్షేత్రంలో శ్రావణ తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు
మహానంది క్షేత్రంలోని శ్రీ కామేశ్వరీ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు అమ్మవారి అనుగ్రహం కల్పించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా ఆగస్టు 14న అమ్మవారికి విశేష ద్రవ్యాభిషేకం, పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ, చండీహోమం, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు హైదరాబాద్కు చెందిన వారణాసి రామ్మోహన్రావు, విజయలక్ష్మి దంపతులు సహకరిస్తున్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆలయ అధికారులు కోరారు.


