విశాఖపట్నంలోని హుడా పార్క్ నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నూతనంగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సులో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రయాణించారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్టీసీ RM అప్పలనాయుడు పలువురు రవాణా అధికారులు ఉన్నారు.

ASR ఎయిర్పోర్ట్కు ఎలక్ట్రిక్ బస్సు సేవలు పరిశీలన
విశాఖపట్నంలోని హుడా పార్క్ నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నూతనంగా ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సులో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రయాణించారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్టీసీ RM అప్పలనాయుడు పలువురు రవాణా అధికారులు ఉన్నారు.

