నెల్లూరు టౌన్ హాల్లో చేతన సంస్థ నిర్వహించిన “జీవన వేదం–ఆత్రేయ సినీ సాహిత్యం” కార్యక్రమంలో ఆచార్య విస్తారి శంకర్ రావు ఆత్రేయ సాహిత్య వైభవాన్ని కొనియాడారు. రూపం లేని మనసుకు ఆత్రేయ అద్భుతమైన పదాలతో జీవం పోశారని అన్నారు. ఆయన పాటలు ప్రతి తరాన్ని ఆలోచింపజేసే జీవన సందేశాలతో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. సమాజం, మనస్తత్వం, స్నేహం, దేశభక్తి వంటి అంశాలను హృద్యంగా ప్రతిబింబించారని చెప్పారు. నేటి తరానికి ఆత్రేయ పాటలను వినిపిస్తే మంచి సమాజం నిర్మాణమవుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కందనూరు మధు, సినీ రచయిత రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొని ఆత్రేయకు నివాళులర్పించారు

నెల్లూరు టౌన్ హాల్లో చేతన సంస్థ నిర్వహించిన “జీవన వేదం–ఆత్రేయ సినీ సాహిత్యం”
నెల్లూరు టౌన్ హాల్లో చేతన సంస్థ నిర్వహించిన “జీవన వేదం–ఆత్రేయ సినీ సాహిత్యం” కార్యక్రమంలో ఆచార్య విస్తారి శంకర్ రావు ఆత్రేయ సాహిత్య వైభవాన్ని కొనియాడారు. రూపం లేని మనసుకు ఆత్రేయ అద్భుతమైన పదాలతో జీవం పోశారని అన్నారు. ఆయన పాటలు ప్రతి తరాన్ని ఆలోచింపజేసే జీవన సందేశాలతో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. సమాజం, మనస్తత్వం, స్నేహం, దేశభక్తి వంటి అంశాలను హృద్యంగా ప్రతిబింబించారని చెప్పారు. నేటి తరానికి ఆత్రేయ పాటలను వినిపిస్తే మంచి సమాజం నిర్మాణమవుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కందనూరు మధు, సినీ రచయిత రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొని ఆత్రేయకు నివాళులర్పించారు

