లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో 120 మంది చేరిక
ఉదయగిరి:. సీతారామపురం యువ నాయకుడు చింతం రెడ్డి లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పంచాయతీలకు చెందిన 120 మంది యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బశినేనిపల్లి, చిన్నాగంపల్లి, నెమల్లదిన్నె, సీతారామపురం, సింగారెడ్డిపల్లి పంచాయతీల నుంచి వచ్చిన యువత ఉదయగిరిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం పట్ల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో 120 మంది చేరిక
లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో 120 మంది చేరిక ఉదయగిరి:. సీతారామపురం యువ నాయకుడు చింతం రెడ్డి లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పంచాయతీలకు చెందిన 120 మంది యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బశినేనిపల్లి, చిన్నాగంపల్లి, నెమల్లదిన్నె, సీతారామపురం, సింగారెడ్డిపల్లి పంచాయతీల నుంచి వచ్చిన యువత ఉదయగిరిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం పట్ల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

