స్వయంభుగా వెలసిన భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు,
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ స్వామివారు సంవత్సరం మొత్తం కాలంలో నెలరోజులు మాత్రమే దర్శనమిస్తారని ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమ కలిగిన ఈ దేవాలయాన్ని సందర్శించడం తమకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడే గంగమ్మ తల్లిని చెంతనే ఉండాలని ఆకాంక్షతో స్వయంభుగా వెలిసి నిత్యం గంగా నదిలోనే ఉంటూ సంవత్సర కాలం పరిధిలో నెల రోజులు మాత్రమే భక్తిలకి దర్శనమిస్తూ మళ్లీ గంగమ్మ తల్లి చెంతనే ఉంటారని ఎంతో మహిమ కలిగిన ఈ దేవాలయానికి వేలాదిగా భక్తులు వస్తుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు


