పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి ఆగస్టు 22 :
పట్టణంలోని 10వ వార్డులో ఎమ్మెల్యే, మాచర్ల అభివృద్ధి ప్రదాత శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు, మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కజ్జం సైదయ్య గారి ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు వేముల మంగమ్మ, చెల్లా నాగమణి, మల్లెల శివ, బత్తుల చెన్నకేశవులు, మంజుల చెన్నయ్య, చల్ల రాజారత్నం, సుధాకర్, యూనిట్ ఇన్చార్జి కేతావత్ శంకర్ నాయక్తో పాటు వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
షేక్ జానీ భాష
63వ బూత్ ఇన్చార్జి, 10వ వార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు..


