రాజన్న సిరిసిల్ల ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ పరిధిలోని ధర్మారం సబ్ సెంటర్లో నిర్వహించిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) సెషన్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ బుధవారం పర్యవేక్షించారు. చిన్నారులకు అందిస్తున్న టీకాలు, టీకాల నిల్వ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అర్హులైన ప్రతి చిన్నారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని సూచించారు. తల్లిదండ్రులకు టీకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ అధికారి డా. సంపత్ కుమార్, VCCM నవీన, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


